సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా
 న్యాయాలు -537
తరక్షుఢాకీనీ న్యాయము
****
తరక్షు అనగా సివంగి. ఢాకినీ అనగా రక్తపానము చేసే దయ్యము,విశుద్ధ చక్రము వద్ద నుండే అమ్మవారి అంశ అయిన దేవత అనే అర్థాలు ఉన్నాయి.
సివంగిని ఎక్కి అమ్మవారు లేదా మహాకాళి వచ్చినట్లు అంటే సాక్షాత్తూ ఆ దుర్గా మాత రూపంలో వచ్చినట్లు అని అర్థము.
ఇక ఈ ఢాకినీ దేవతను గురించి తెలుసుకుందాం. ఈ దేవతను కాళికా దేవి, మహాకాళి, మహంకాళి, భద్రకాళి, కాళికా, దుర్గామాత ,కనక దుర్గ అనే  అనేక పేర్లతో పిలుస్తారు.ఈ దేవతను హిందూ మతంలో అతి శక్తివంతమైన,అనంత శక్తి దాయినిగా కొలుస్తుంటారు. అంతే కాదు అంతిమ శక్తి, విధ్వంస దేవత అని కూడా అంటుంటారు.
శక్తులను పూజించే శాక్తేయులు ఈ దేవతను తాంత్రిక దేవతగా, బ్రహ్మజ్ఞానాన్ని  కలిగించే దేవతగా ఆరాధిస్తే.మరికొందరేమో భవతారిణిగనూ,శివుని భార్యగానూ కొలుస్తారు. దశ మహా విద్యలలో ఆదిశక్తి పేరిట అతి కౄరమైన రూపంగానూ, తాంత్రిక సంప్రదాయంలో మొదటి దేవతగానూ భావించి కొలుస్తుంటారు.అంతేకాదు మంత్రాల ద్వారా లీలలు, అద్భుతాలు చేసే ఓ స్త్రీగా కూడా ఢాకిని గురించి చెబుతుంటారు.
ఇక ఈ దేవతను అంతిమ అభివ్యక్తి,ఆదిమ విశ్వశక్తి,అన్ని జీవులకు తల్లిగా అమాయకులను రక్షించే దేవతగా, చెడును నాశనం చేసే అమ్మవారిగా ఆరాధిస్తారు.రామకృష్ణ పరమహంస వంటి యోగులు సైతం కాళీమాతగా ఈమెను పూజించడం జరిగింది.
ఈ శక్తి  దేవత గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.పురాణాల ప్రకారం అమ్మ వారిని దుర్గా మాతగా, మహిషాసుర మర్ధినిగా పిలవడం చూస్తాం. కారణం దుర్గాసురుడు అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ దేవుని నుండి అనేక వరాలను పొందుతాడు.ఆ వరాల గర్వంతో ముల్లోకాలను ఇబ్బంది పెడుతుంటాడు.ముల్లోకాలలోని దేవతలు పరాశక్తిని వేడుకుంటారు.శతాక్షి రూపంలో దుర్గాసురుడిని సంహరించడంతో ఆమెను దుర్గామాతగా కొలవడం మొదలుపెట్టారు.మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యంలో  ఈ దుర్గా దేవి కథ వుంది. సింహ వాహనం మీద బయలు దేరి మహిషాసురుని సంహరిస్తుంది. అందుకే దుర్గా దేవిని మహిషాసుర మర్ధినిగా కూడా కొలుస్తారు.
 ఇలా ఆది పరాశక్తి అయిన అమ్మవారిని నవదుర్గలుగా   నవరాత్రులలో పూజిస్తారు.ఒక్కో దుర్గా మాత  ఒక్కో వాహనం మీద అనగా సింహం, పెద్ద పులి, ఏనుగు,, అశ్వము మొదలైన  ప్రత్యేక వాహనాలను అధిరోహించి వచ్చి  ప్రత్యేక సందేశాలను ఇస్తుంటుందని భక్తుల విశ్వాసం. ఇలా అమ్మవారి అనేక రూపాల గురించే కాకుండా ఆమె మహిమల గురించి కూడా అనేక కథనాలు ఉన్నాయి.

 " ముఖ్యంగా  తరక్షుఢాకీనీ న్యాయము" ఎందుకు  ప్రస్తావించబడినదో చూద్దాం.
అమ్మ వారు,ఆదిశక్తి స్త్రీ రూపం. ఆదిమ మానవుల సమాజాన్ని చూసినట్లయితే మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది.ఆమెను ఎంతో గౌరవంగా చూడటంతో పాటు దైవంగా భావించే వారు.మహిళలు ఏ  విధంగా  ఉండాలో చెప్పడం కోసం సృష్టించబడిన న్యాయంగా దీనిని చెప్పుకోవచ్చు.ఆదిశక్తి అమ్మ వారు దేవతలందరిలో ఎంతటి శక్తివంతమైన దేవతో తెలిసిన ప్రతి స్త్రీ తమపై ఎవరైనా అఘాయిత్యం, అత్యాచారానికి పాల్పడితే తరక్షుఢాకీనీనిలా వారిని చీల్చి చెండాడాలనీ, అలాంటి ధైర్య సాహసాలు స్త్రీ జాతి అణువణువునా నింపుకోవాలనే అర్థంతో ఈ న్యాయమును మనం అర్థం చేసుకోవాలి.పసితనం నుండే బాలికలకు ధైర్య సాహసాలతో  పాటు తనను తాను రక్షించుకోవడానికి కావలసిన శక్తి యుక్తులు  నేర్పాలి.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం