మతం కాదు మానవత్వమే ముఖ్యం;- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్:-విశాఖపట్నం
 పరమాత్ముని ఆనతితో
పుడమి పై జంయించిన
ప్రజలంతా  ఏకోదరులులా
పగలు ,ప్రతీకారాలు లేక
ప్రేమానురాగాలతో ఉండాలని
ప్రేమతో బాల్యంలో  పెంచిన మాతృమూర్తి చెప్పినట్లు
ఊహించిన  నేను
నేటి సమాజాన జరిగే
కులమతాబేధాలు
వర్ణవివక్షతలు
పేద గొప్ప తారతమ్యాలు 
ఉగ్రవాదుల విధ్వంసక చర్యలు
యుద్ధాలలో నరమేథాలు
శరీరం బుద్బుధమని తెలిసినా
ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు చూసి
శాంతి అహింసలే సాధనాలుగా
స్వాతంత్ర్య సముపార్జన చేసిన జాతిపిత మహాత్మాగాంధీ చెప్పినట్లు
అర్ధరాత్రి స్త్రీ నడివీధిలో ఒంటరిగా నడచినపుడే అసలయున స్వాతంత్య్రమన్నది
నెరవేరాలన్న ధ్యాసతో
నలుబది ఏండ్లయి చదువుతో బాటు సంస్కారాన్ని ఆచార్యునిగా బోధిస్తూ కొంత మేరకు
నా ఊహ కు సారూప్యత నిచ్చినా
"గతకాలమే మేలు వచ్చు కాలం కంటెన్" అన్న నన్నయ్య చెప్పినది నిజమనిపిస్తోంది
'కరోనా' వల్ల గుణపాఠం నేర్చుకుని
ప్రజలంతా సమాజశ్రేయస్సు కొరకు పాటుపడి
మానవత్వమే మాధవత్వముగా జీవించాలన్న నా ఊహ
భవిష్యత్తులో నెరవేరునని
తప్పక సుపరిపాలనతో
సమాజాభివృద్ధి జరుగుతుందని ఆశీస్తున్నా ఆకాంక్షిస్తున్నా
"లోకా సమస్తా సుఖినో భవంతు " అన్నది అందరి మనసులో ఉండాలని
భగవంతుని ప్రార్థిస్తున్నాను..!!
........................

కామెంట్‌లు