వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచనపల్లి.
 స్త్రీకి ఉండవలసిన లక్షణాలను  ఆరు అని చెప్పి  వాటిలో ప్రధానం క్షమయా ధరిత్రి  భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి అని చెప్తారు  ఇది స్త్రీలకు మాత్రమే కాదు పురుషులకు కూడా  సామాన్యంగా ఓర్పు నశించడం అనేది బీపీ పెరగడానికి కారణం  ఎక్కువగా ఆ వ్యాధి కలిగిన వారు  సహజంగా క్షమను కోల్పోతారు  ఎప్పుడైతే ఆ కోపంలో ఆచికాకులో ఎదుటివారిని  అనరాని అనే మాట ఏ ఒక్కటి అన్నా  అది  ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది  స్నేహాలను పాడు చేస్తుంది  సహనంగా ఉంటే కొండంత ప్రమాదాన్ని కూడా దూరం చేసుకోవచ్చు  ఒక్క క్షణం మనం అసహనం లో ఉన్నట్లయితే  మనకు తెలియకుండానే మన నోటి ద్వారా  ఇతరుల మనసును క్షోభ పరిచే మాటలు రావడం  దానివల్ల జీవితాలు నాశనం అవ్వడం కూడా జరగవచ్చు  కనక నోటిని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం.
సమాజంలో ఉన్న ఏ వ్యక్తికైనా ఏదో ఒక సందర్భంలో కోపం రాక మానదు  కోపం అనర్ధం అని మన పెద్దలు అనేకసార్లు మనకు బుద్ధుడు చెప్పినా  బుద్ధి స్వాధీనం తప్పి కోపానికి లోనవుతుంది  కోపగించుకోవడం అంటే మన మీద మనమే ప్రతీకారం తీర్చుకోవడం అని అర్థం  మనిషి గొప్పతనం ఎక్కడుంటుంది మెదడులోనా కాదు అతని హృదయంలో ఉంటుంది  ఎవరికి వారు తమను గురించిన గొప్పలు చెప్పుకోవడం తప్ప  ఇతరుల గొప్పతనాన్ని గ్రహించరు  నీవు ఎప్పుడైతే నీ గురించి గొప్పలు చెప్పుకోకుండా ఎదుటివారి గొప్పతనాన్ని గురించి  అధ్యయనం చేసి వారు ఎందుకు అలా ప్రవర్తించగలిగారో అర్థం చేసుకున్నట్లయితే  ఆ పద్ధతిని అనుసరించినట్లయితే  నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకుంటారు  దానికి చేయవలసిన పని 100 మంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవడం పోతన వారు  వ్యాస మహర్షి వ్రాసిన  భాగవతాన్ని   అనువదిస్తూ దానిలో వారు చెప్పని చాలా విషయాలు  మన ముందుకు తీసుకువచ్చారు  శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవుని అన్న వాలిని  అతడు చేసిన ధర్మ ద్రోహానికి శిక్షగా ఒక్క బాణంతో లీలగా అతనిని  కూలదీశాడు  వాలి తక్కువ వాడా గొప్ప నీతిశాలి త్రిశూలాన్ని చేతబట్టిన శివమహా దేవున్ని సేవిస్తూ గొప్ప శీలం కలవాడు అతని మెడలో ఒక మహిమ గల పూలమాల ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది  దేవతలకు కూడా దిగులు పుట్టించే బల పరాక్రమాలు గల పది తలల రావణుని మానాన్ని  వెల్లగించి పారవేసిన మహాబలుడు  కనుక జీవితంలో ఏ ఒక్క తప్పు చేసినా  తనకున్న బలపరాక్రమాలన్నీ  వారికి సహకరించవని తెలుసుకోవాలి  ఇది పోతన గారు చెప్పిన నీతి
ఈ మాట ఎవరికీ చెప్పాడు ఆ శంకరాచార్యుల వారు    మూఢ మతికి  అంటే సంక్షేమలో డోలాయమాలంగా ఉన్న  చేయాలా వద్దా ఆరంభించాలా వదిలేలా అన్న నిర్ణయం తీసుకొని వారికి  ఇలా నిర్ణయం తీసుకోండి అని చెప్పారు కనుకనే భజగోవింద శ్లోకాలు ఎంత కాలం బ్రతికి ఉన్నాయి  అని అర్థం పరమార్థ  అది కామ ద్రోమా వాయువా తెలుసుకోవాలి   నిరీక్షించాలి  ఆ మిశ్రమం పదార్థంలో నుండి మడ్డి చేరుకుంటుంది కిందకు చేరుతుంది అది ఘనమవుతుంది  అప్పుడు దానిని వర్గీకరిస్తే రెడ్డి శబ్దానికి విభజన అర్థం తెలుస్తోంది అంటే నాకు పేరు పెట్టగలిగితే మీరు నన్ను రెడ్డి అని పిలవడానికి  అభ్యంతరం పెట్టకండి అంటాడు  వేమనమాత్యులు
==============================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు