కోలవెన్ను రామకోటేశ్వరరావు;- - యామిజాల
 తెలుగు అందాలను ఇతర ప్రాంతాలవారికి, ఇతర దేశాలవారికి అందించాలని మనసులో తళుక్కు మనడంతో ఆ దృష్టితోనే విద్యార్థి దశ నుంచే ఇంగ్లీషు సాహిత్యాన్ని చదివి ఆకళింపు చేసుకోవడం, రచన సాగించడం, తెలుగు సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించడంతో ఆయన పేరు నలుగురి నోటా నానింది. తెలుగు భాషా సాహిత్యానికి విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించిన ఆయనప్రముఖ ఆంగ్ల పత్రికా రచయితగా, సంపాదకుడిగా పేరుప్రఖ్యాతులు గడించారనడం అతిశయోక్తి కాదు.  
ఇంతకూ ఆయనెవరో చెప్పలేదు కదూ.
ఆయనే కోలవెన్ను రామకోటేశ్వర రావు.
1894 అక్టోబరు 22వ తేదీన జన్మించిన ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నరసరావుపేటలో హైస్కూలు వరకూ చదివిన ఆయన ఆ తర్వాత బందరులోని నోబుల్ కళాశాలలో డిగ్రీ చేశారు. అనంతరం మద్రాసు వెళ్ళి అక్కడి ప్రెసిడెన్సీ కళాశాలలో నాయ్యశాస్త్రంలో పట్టా పొందారు.
కొంతకాలంపాటు బోధనావృత్తిలో ఉన్నప్పటికీ బాలగంగాధరం తిలక్, మహాత్మాగాంధీ ఉపన్యాసాలకు ఆకర్షితులైన రామకోటేశ్వరరావు జాతీయ ఉద్యమ సత్యాగ్రహాలలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాలుపంచుకుని జైలు జీవితం గడిపిన ఆయన కాగి చల్లారిన పాలలాటివారు.
న్యాయవాదవృత్తిలోనూ కొంతకాలం కొనసాగిన ఆయన  ఆ తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులుగారి స్వరాజ్య పత్రికలో పని చేశారు.
అయితే ఆయనలోని దృఢసంకల్పం మరో అడుగు ముందుకు వేయించింది. స్వరాజ్య పత్రిక నుంచి బయటకొచ్చి అప్పటి మద్రాసు నుంచి త్రివేణి అనే ఆంగ్ల సాహిత్య పత్రికను వెలువరించడానికి పూనుకున్నారు. అనుకున్నట్టే 1927లో త్రివేణి అనే పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈయన ఆశయానికి ఒక్క తెలుగువారే కాక మహారాష్ట్ర, కన్నడ ప్రాంత రచయితలూ తోడ్పడ్డారు. ఆయన త్రివేణి పత్రిక ద్వారా అందించిన రచనలు దేశవిదేశాల వారికి తెలుగు సాహిత్యం చేరువైంది. ఈ క్రమంలో ఆయన కృషి అమోఘం. అద్భుతం.
రాజనీతిజ్ఞులకన్నా సాహితీవేత్తలు భారత సమైక్యత సాధించగలరని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఏ భాషపైనా ద్వేషం పెంచుకోకూడదని, సంస్కృతానికి, ఆంగ్లానికి కూడా మనమందరం రుణపడి ఉన్నామని చెప్తుండే రామకోటేశ్వరరావుకు అడవి బాపిరాజు, నండూరి సుబ్బారావు, బసవరాజు అప్పారావు అంటే ప్రాణమిత్రులు.
ఆంగ్ల సాహిత్యం వల్ల తెలుగు సాహిత్యానికి ప్రమాదం అంటూ వచ్చిన వ్యాఖ్యలకు ఆయన ఆశ్చర్యపోయేవారు.   ఏ భాషా మరో భాషకు ప్రమాదం కాదని, ఏ భాష గొప్పతనం ఆ భాషదే అని నమ్మే ఆయన ఆంధ్రులకు ఇంగ్లీషు, హిందీ కూడా అవసరమే అని చెప్పేవారు.
తన సంపాదకత్వంలో త్రివేణి పత్రికను ఆహా ఓహో అని కాకపోయినా ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ స్థాయిలోనే నడిపిన తృప్తి తనకుందని చెప్పిన రామకోటేశ్వరరావు 1970 మే 19వ తేదీన తుదిశ్వాస విడిచారు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం