400 మొక్కలు విరాళం

 శ్రీదేవి విజ్ఞాన జ్వోతి పరిష్కార్ చారిటబుల్ సంస్థ అధ్యక్షురాలు డా.కుప్పిలి కీర్తి పట్నాయక్ 400 మొక్కలను విరాళంగా ఇచ్చి, తమ ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. గతంలో వందలాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉచితంగా వస్తు రూపేణా, ఆకలి తీర్చేలా భోజనాలను, నిరుపేదలకు ఆర్ధిక సౌలభ్యాలను సంస్థ తరపున కీర్తి పట్నాయక్ సమకూర్చారు. నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవం మరియు,  ఐ ఎన్ ఎస్ డే సందర్భాలను పురస్కరించుకొని ఇండియన్ నేవీ వారికి 400  వివిధ రకాల జాతుల మొక్కలను పంపిణి  చేసారు. పర్యావరణ పరిరక్షణకై ఈ మొక్కలను ఉచితంగా విరాళమివ్వడం జరిగిందని కీర్తి పట్నాయక్ అన్నారు.
కామెంట్‌లు