న్యాయాలు -603
పుష్కర పలాశ న్యాయము
*****
పుష్కర అనగా సూర్యుడు,కొలను,సర్ప విశేషము,భేరీ విశేషము.పలాశ అనగా మోదుగు చెట్టు, రాక్షసుడు అనే అర్థాలు ఉన్నాయి.
పుష్కర పలాశ అనగా సూర్యుని అగ్ని రూపాన్ని సంతరించుకున్న విశేషమైన మోదుగ చెట్టు యొక్క పువ్వు.ఈ పూల చెట్టును అగ్ని పూల చెట్టు ,ఎర్ర పూల చెట్టు అని కూడా పిలుస్తారు.
మరి ఈ మోదుగు చెట్టు గురించిన వివరాలు తెలుసుకుందామా.
మోదుగ చెట్టు నిటారుగా దాదాపు 15 మీటర్ల వరకు పెరుగుతుంది.ఈ చెట్టు భారతదేశమంతటా వ్యాపించి ఉంది. సముద్ర మట్టం నుండి 1200ల అడుగుల ఎత్తు వరకు వ్యాపించి పెరుగుతుంది. ఇది ఎక్కువగా పచ్చిక మైదానాలు,అడవి,బయలు ప్రదేశాల్లో పెరుగుతుంది. ఈ చెట్టు ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూతకు వస్తుంది.ఈ పూల మొగ్గలు ముదురు గోధుమ రంగులోనూ చెట్టు శిఖర భాగంలో విస్తరించి పూచినప్పుడు అగ్ని శిఖల వలె ఎర్రగా వుంటాయి.అంతే కాదు మంచి సువాసనతో చూపులకు ఎంతో ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తూ మనసు దోచుకుంటాయి.వాటిని చూస్తుంటే హృదయం ఉల్లాసభావనతో ఉప్పొంగి పోతుంది.
భక్తి విషయానికి వస్తే ఈ పూలు పరమ శివునికి ఎంతో ప్రీతికరమైనవని, పూజలో ఈ పూలను ఉపయోగిస్తారు.
ఇక మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆరోగ్యం, పండుగల్లో మోదుగ చెట్టులోని ప్రతి భాగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూర్వము మోదుగ చెట్టు ఆకులతో విస్తర్లు కుట్టి అందులోనే భోజనం చేసేవారు. యజ్ఞాలు, యాగాలు, పూజా కార్యక్రమాల్లో ఎండిపోయిన మోదుగ కొమ్మలను సమిధలుగా వాడుతారు. వాటి నుండి వచ్చే పొగ ఇంట్లోని చెడును పోగొడుతుందని నమ్ముతారు.ఇక హోలీ పండుగ వచ్చిందంటే చాలు ఒకప్పుడు మోదుగ పూలను సేకరించి నీటిలో నానబెట్టి,ఆ తర్వాత ఉడికించగా వచ్చిన రంగు నీళ్ళను సీసాల్లో నింపుకుని దాచుకునే వారు.హోళీ పండుగ రోజున ఈ ఎర్రరంగు నీళ్ళు చల్లుకునేవారు. ఇవి ప్రకృతి సహజమైన, రసాయనాలు కలవని నీళ్ళు కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండేవి కావు.
ఈ చెట్టు ఆకులు, విత్తనాలు, చెట్టు నుంచి వచ్చే జిగురు... ఇలా చెట్టు మొత్తంగా అనేక అనారోగ్యాలకు ఔషధంగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు.
చివరగా ఓ విషయం కూడా చెప్పుకుందాం. తెలుగు సాహిత్యంలో"మోదుగు పూలు "అనే పేరుతో ప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య గారు రాసిన నవల ఎంతగా ప్రాచుర్యం పొందినదో మనందరికీ తెలుసు. ప్రముఖ ప్రవచనకారుడైన గరికపాటి నరసింహారావు గారు తన "సాగర ఘోష" పద్య కావ్యంలో ఓ పద్యం కూడా రాశారు.
ఇక మన పెద్దలు"పుష్కర పలాశ న్యాయము" చెప్పడంలో గల అంతరార్థాన్ని చూద్దాం. ఇక్కడ పుష్కర అనగా సూర్యుడనీ, సూర్యుని కాంతిని పుణికిపుచ్చుకున్న నారింజ ,ఎరుపురంగుతో కూడి అగ్ని శిఖలా పూచే పూలే పుష్కర పలాశ అని అర్థము.
సూర్యుడి కాంతి ఉదయాస్తమయాల్లో ఎరుపు రంగులో కనిపిస్తూ హృదయాన్ని ఉల్లాసభరితం చేస్తుంది.అలాగే మోదుగు పువ్వు కూడా... మరి మనం కూడా మోదుగు చెట్టులా,పూవులా ఇతరులకు మన పూలవంటి మాటలతో సంతోషాన్ని కలిగిస్తూ, చెట్టులా పరోపకారం చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుందాం.
పుష్కర పలాశ న్యాయము
*****
పుష్కర అనగా సూర్యుడు,కొలను,సర్ప విశేషము,భేరీ విశేషము.పలాశ అనగా మోదుగు చెట్టు, రాక్షసుడు అనే అర్థాలు ఉన్నాయి.
పుష్కర పలాశ అనగా సూర్యుని అగ్ని రూపాన్ని సంతరించుకున్న విశేషమైన మోదుగ చెట్టు యొక్క పువ్వు.ఈ పూల చెట్టును అగ్ని పూల చెట్టు ,ఎర్ర పూల చెట్టు అని కూడా పిలుస్తారు.
మరి ఈ మోదుగు చెట్టు గురించిన వివరాలు తెలుసుకుందామా.
మోదుగ చెట్టు నిటారుగా దాదాపు 15 మీటర్ల వరకు పెరుగుతుంది.ఈ చెట్టు భారతదేశమంతటా వ్యాపించి ఉంది. సముద్ర మట్టం నుండి 1200ల అడుగుల ఎత్తు వరకు వ్యాపించి పెరుగుతుంది. ఇది ఎక్కువగా పచ్చిక మైదానాలు,అడవి,బయలు ప్రదేశాల్లో పెరుగుతుంది. ఈ చెట్టు ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూతకు వస్తుంది.ఈ పూల మొగ్గలు ముదురు గోధుమ రంగులోనూ చెట్టు శిఖర భాగంలో విస్తరించి పూచినప్పుడు అగ్ని శిఖల వలె ఎర్రగా వుంటాయి.అంతే కాదు మంచి సువాసనతో చూపులకు ఎంతో ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తూ మనసు దోచుకుంటాయి.వాటిని చూస్తుంటే హృదయం ఉల్లాసభావనతో ఉప్పొంగి పోతుంది.
భక్తి విషయానికి వస్తే ఈ పూలు పరమ శివునికి ఎంతో ప్రీతికరమైనవని, పూజలో ఈ పూలను ఉపయోగిస్తారు.
ఇక మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆరోగ్యం, పండుగల్లో మోదుగ చెట్టులోని ప్రతి భాగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూర్వము మోదుగ చెట్టు ఆకులతో విస్తర్లు కుట్టి అందులోనే భోజనం చేసేవారు. యజ్ఞాలు, యాగాలు, పూజా కార్యక్రమాల్లో ఎండిపోయిన మోదుగ కొమ్మలను సమిధలుగా వాడుతారు. వాటి నుండి వచ్చే పొగ ఇంట్లోని చెడును పోగొడుతుందని నమ్ముతారు.ఇక హోలీ పండుగ వచ్చిందంటే చాలు ఒకప్పుడు మోదుగ పూలను సేకరించి నీటిలో నానబెట్టి,ఆ తర్వాత ఉడికించగా వచ్చిన రంగు నీళ్ళను సీసాల్లో నింపుకుని దాచుకునే వారు.హోళీ పండుగ రోజున ఈ ఎర్రరంగు నీళ్ళు చల్లుకునేవారు. ఇవి ప్రకృతి సహజమైన, రసాయనాలు కలవని నీళ్ళు కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండేవి కావు.
ఈ చెట్టు ఆకులు, విత్తనాలు, చెట్టు నుంచి వచ్చే జిగురు... ఇలా చెట్టు మొత్తంగా అనేక అనారోగ్యాలకు ఔషధంగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు.
చివరగా ఓ విషయం కూడా చెప్పుకుందాం. తెలుగు సాహిత్యంలో"మోదుగు పూలు "అనే పేరుతో ప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య గారు రాసిన నవల ఎంతగా ప్రాచుర్యం పొందినదో మనందరికీ తెలుసు. ప్రముఖ ప్రవచనకారుడైన గరికపాటి నరసింహారావు గారు తన "సాగర ఘోష" పద్య కావ్యంలో ఓ పద్యం కూడా రాశారు.
ఇక మన పెద్దలు"పుష్కర పలాశ న్యాయము" చెప్పడంలో గల అంతరార్థాన్ని చూద్దాం. ఇక్కడ పుష్కర అనగా సూర్యుడనీ, సూర్యుని కాంతిని పుణికిపుచ్చుకున్న నారింజ ,ఎరుపురంగుతో కూడి అగ్ని శిఖలా పూచే పూలే పుష్కర పలాశ అని అర్థము.
సూర్యుడి కాంతి ఉదయాస్తమయాల్లో ఎరుపు రంగులో కనిపిస్తూ హృదయాన్ని ఉల్లాసభరితం చేస్తుంది.అలాగే మోదుగు పువ్వు కూడా... మరి మనం కూడా మోదుగు చెట్టులా,పూవులా ఇతరులకు మన పూలవంటి మాటలతో సంతోషాన్ని కలిగిస్తూ, చెట్టులా పరోపకారం చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుందాం.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి