అంతర్జాల వేదిక ఆధారంగా జరిగిన 2️⃣0️⃣ వ పాటల కార్యక్రమం శుక్రవారందిగ్విజయంగా ముగిసింది.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతి సేవాసంస్థ,చేయూత ఫౌండేషన్ అధినేత, కవి, గాయకుడువాకిటివెంకట్ రెడ్డి గారు,
ఆత్మీయఅతిథులుగా వాల్మీకి సంస్థ అధినేత డా V. D రాజగోపాల్ గారు, లక్ష్య సాధన అధినేత డా. రామకృష్ణ చంద్రమౌళిగారు, ప్రముఖసాహిత్యవేత్త, విశ్లేషకులు ఘంటామనోహర్ రెడ్డిగారు , కుసుమ ధర్మన్న సంస్థ అధినేత డా. రాధా కుసుమగారు, ప్రముఖ సాహిత్యవేత్త డా.కృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి పాట, రచన, సాహిత్యం గురించి ఎన్నో విషయాలు తెలియచేసారు తమ అమూల్యమైన అమూల్యమైన సందేశాలు కూడా అందచేశారు.
ప్రార్థనా గీతంతో మొదలైన కార్యక్రమం మొదటి రౌండ్ భక్తిపాటలు, రెండవ రౌండ్ సినీ గీతలతో గాయనీ, గాయకులు అనేకమంది పాల్గొని తమ చక్కని గాత్రంతో గానాలాపన చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
అందరికీ పేరుపేరునా "అరుణారాగాలు "సంస్థ అధ్యక్షురాలు ధన్యవాదాలు తెలిపారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి