వినాలి!!!?:-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
భూమిని నమ్మి 
పొలం దున్ని 
పంట పండించి 
కడుపు నింపేవాడు- రైతు-!

మనిషిని నమ్మి 
చదువును చెప్పి 
మెదడుతో పంటను 
పండించిన వాడు -గురువు!!

కడుపు నిండితేనే 
మెదడు పనిచేస్తుంది 
కడుపు చెప్పినట్లు మెదడు వింటుంది!!
కానీ 
మెదడు చెప్పినట్లు కడుపు వినదు!!!?

అందుకే 
రైతు -గురువు -చెప్పినట్లు అందరూ వినాలి!!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ మండలం బిజ్నాపల్లీ నాగర్ కర్నూల్ జిల్లా.

కామెంట్‌లు