ప్రేమకోసం ....!!--శ్రీమతి షాహీన్ సిద్డిఖా.-నల్లగొండ.

 ఈ రోజు జరిగిన సంఘటన 
నాకు చాలాసంతోషాన్ని ఇచ్చింది! 
నేను పుట్టి పెరిగింది పల్లెటూల్లొనె ,
పై చదువుల కోసం ఊరికి 
దూరంగా ఉండవలసి వచ్చింది! 
ఆ తరువాత పెళ్ళి .
పట్టణంలో ఉండవలసి వచ్చింది!
ఉదయం ఒక ఫోన్ వచ్చింది. 
నేను గొంతుగుర్తుపట్టలేకపోయాను. 
మా ఇంటిపక్కన ఉండే ఆవిడ, 
వరుసకుఅమ్మమ్మ అవుతారు!
ఫోన్ చేసి -
యోగక్షేమాలు తెలుసు కున్నారు!
చాలా ఆప్యాయంగా 
అరగంట సేపు మాట్లాడారు!
"మీ అమ్మ లేకుంటే ఏంటి
మా ఇంటికి వచ్చి 
నాలుగు రోజులుఉండిపోవచ్చు గదా!"
అని చాలా ఆప్యాయంగాఆహ్వానించారు. 
ఈ రోజుల్లో తోడబుట్టిన వారే 
మనకు ఫోన్ కూడా చేయరు
వారి ఇండ్లకు రమ్మని ఆహ్వానించరు!
దీన్నిబట్టి ప్రేమలు 
పల్లెటూళ్ళలోనే 
పురుడుపోసుకున్నాయనే విషయం 
మరోమారునిజమయ్యింది!
అవును.....
 ప్రేమలు కనుమరుగవుతున్న తరుణంలో
ఇలాంటి వాళ్ళవల్లనే ఇంకా
ప్రేమలు బ్రతికున్నాయనిపిస్తుంది. 
పల్లెటూళ్ళు కనుమరుగైతే 
ఆ ప్రేమలుకూడా 
కనుమరుగవుతాయేమోకదా! 
చూడాలి మరి.......!!
                      ***
కామెంట్‌లు