79.దేశజనాభా భారమా?వరమే అని నిరూపిద్దామే!మేటి కర్షకుల్ని అన్నదాతల్ని, జాతికి అందిద్దామే!అతివృష్టి- అనావృష్టి ,రైతన్నకు అండై నిలుద్దామే!దేశఆత్మేరైతు,రైతుఆత్మహత్యా?అడ్డుకట్టేద్దామే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!80.ప్రజలందరినీ అక్షరాస్యులవ్వ, తీర్చిదిద్దుదామే!గానుగెద్దులుగా ,బతికే వాళ్ళకి శిక్షణ ఇద్దామే!నెల్లూరు పందెం ఎద్దులుగా, దేశాల నిలబెడదామే!శ్రమ, సాంకేతికత ఏకం, నవభారతం నిర్మిద్దామే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!81.చదువే ఉద్యమం ,జ్ఞానమే, ఆశయం , ముందడుగేద్దామే!జ్ఞానసముపార్జనే ధ్యేయమై, జనాన్ని చదివిద్దామే!అంధవిశ్వాసాలంతమవ్వ,విజ్ఞానదృష్టే సారిద్దామే!ప్రగతి నిర్మాణ సాధనం,జ్ఞానగాండీవం ధరిద్దామే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!_________
ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు -9441058797.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి