అరుణోదయ సాహితివేదిక ఆధారంగా సోమవారం జరిగిన అంతర్జాల కవిసమ్మేళనం దిగ్వి జయం గా ముగిసింది.
అనేక మంది కవులు పాల్గొన్న ఈ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణా సాహిత్య అకాడమికార్యదర్శి నామోజు బాలాచారి గారు హాజరయి తెలుగు భాషా గురించి, సమాజం లో కవుల పాత్ర , ఇంకా అనేక సాహిత్య విషయాలు చర్చించారు ముఖ్యఅతిథులు గా డా. రాజగోపాల్ గోపాల్ గారు డా. రామకృష్ణ చందమౌళి గారు, ఘంటామనోహర్ రెడ్డి గారు, కృష్ణా రెడ్డి గారు పాల్గొని తమ అమూల్యమైన సందేశాలను, కవితలను అందించారు.
మూడున్నర గంటలపాటు నిర్వీరామంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని c. నారాయణస్వామి గారు నిర్వహించగా. B. శ్రీమన్నారాయణ గారు సహకరించారు.
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు సమూహ అధ్యక్షు రాలు డా. అరుణ కోదాటి ( అక్కిరాజు ) పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి