ఓ మెతుకు పట్టి చూద్దాం.:- డా.సి వసుంధర,చెన్నై.
 ఏదైనా గొప్ప గొప్ప గ్రంధాలను గూర్చి పూర్తిగా తెలుసుకోవడం అనేది చాలా శ్రమ కాలంతో కూడినపనీ. అయిన ప్పటికీ వాటిని గూర్చి క్లుప్తంగానైనా తెలుసుకోవడం ఉత్తమం. 
నేనిప్పుడు కొన్ని ప్రాచీన సాహిత్యంలోని విషయాలను కొద్దిగా వివరిస్తాను. 
1) వేదములు 
*****
ప్రపంచ సాహిత్యంలో వేదాల కంటే ప్రాచీనమైన సాహిత్యం లేదు ఇవి  అత్యంత పురాతనమైన సంస్కృత భాషలో రచింపబడ్డాయి. 
2 వేదములు ఎన్నిగా విభజింపబడ్డాయి?
వేదములు నాలుగు 
1 ఋగ్వేదము 
2 యజుర్వేదము 
3 సామవేదము 
4 అధర్వ వేదము 
ప్రతి వేదమును రెండు గా విభజింపబడ్డాయి
1 కర్మకాండ  2జ్ఞానకాండ
1కర్మకాండలో యజ్ఞాధులను గూర్చి  వివరించారు.
2 జ్ఞానఖండలో బ్రహ్మ తత్వాన్ని గురించి వివరించారు. 
ఈ బ్రహ్మజ్ఞానాన్నిగూర్చి చెప్పే భాగాన్ని వేదాంతము లేక ఉపనిషత్తులు అని
పిలుస్తారు. 
వేదములను మనుషులు రాయలేదు భగవంతునిఆజ్ఞచే మంత్రద్రష్టలైన ఋషులచే  ఉచ్చరించబడినవి.
అలా చెప్పడం వల్ల అవన్నీ కొంత అర్థం చేసుకోవడం కష్టతరంగా తయారయ్యాయి అప్పుడు వ్యాసుడు వాటన్నిటిని విడదీసి చక్కదిద్ది పెట్టాడు కాబట్టి వేద వ్యాసుడు పిలవడం జరిగింది 
ఉపనిషత్తులు 
*****
ఈ నాలుగు వేదాలకు చివరి భాగాలను ఉపనిషత్తులు లేదా వేదాంతములు అని అంటారు ఇది చాలా ఉన్నాయి అందులో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి అందులో మళ్ళీ పది ఉపనిషత్తులు అత్యంత ముఖ్యమైనవి అవి,, ఈశా ,కేశ, కఠోరోపనిషత్తు 
ప్రశ్న,,ముండ మాండూక్య మొదలైన వి. 
వేదాంతాన్నిగురించి చెప్పేటప్పుడు ఈ 10 ఉపనిషత్తులు ఆచార్యులు మాటిమాటికి స్మరిస్తారు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఉపనిషత్తుల లోని విషయాన్ని సంగ్రహంగా భగవద్గీతలో చెప్పబడింది అని పెద్దల మాట అలాగే బ్రహ్మ సూత్రాలులలో  కూడా ఉపషత్తులలోని సారాంశం ఉన్నది అని 
పరశీలకుల మాట.
  "కధా మంజరి స్తోత్రములు"(ధర్మ ప్రచార సమితి తిరుపతి) అనే గ్రంథం ఆధారంగా రాయడమైనది
డా.సి వసుంధర.

కామెంట్‌లు