అంతా మా మంచికే గదా - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  ఒకూర్లో ఒక రైతున్నాడు. ఆయన బాగా డబ్బున్నోడు. ఆయనకి ముగ్గురు కూతుళ్ళు. ఆ ముగ్గురిదీ చూడచక్కని అందం. చందమామల్లెక్క మెరిసిపోతా వుండేటోళ్ళు. నవ్వితే మల్లెపూలు కురిసినట్టుండేది. అది చూసి అందరూ “అబ్బ... ఎంత ముచ్చటగా వున్నారయ్యా నీ కూతుళ్ళు. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. పెండ్లి చేయాలనుకుంటే మాకోసారి చెప్పండి. పైసా డబ్బులు తీసుకోకుండా మా పిల్లోళ్ళకు చేసుకుంటాం" అనేటోళ్ళు. ఆ పిల్లలు గూడా చానాచానా మంచోళ్ళు. అందరికీ సాయం చేస్తా... పక్షులకూ, జంతువులకు అన్నం పెడ్తా, ఎంత వున్నా ఏమీ లేనోళ్ళ లెక్క అణిగిమణిగి వుండేటోళ్ళు. ఎవ్వరినీ పళ్ళెత్తు మాట గూడా అనేటోళ్ళు గాదు. ఎంతందంగా వున్నా కొంచం గూడా పొగరుగా మాట్లాడేటోళ్ళు కాదు. ఆ రైతు ఆ పిల్లలకి ఏది కావాలంటే అది కొనిస్తా అల్లారుముద్దుగా చూసుకునేటోడు. అట్లా కొద్ది రోజులు గడిచిపోయినాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు గదా...
ఒకరోజు ఏమయిందంటే ఆయన పెండ్లానికి పెద్ద రోగమొచ్చి అనుకోకుండా చచ్చిపోయింది. దాంతో పిల్లల్ని చూసుకునేటోళ్ళు లేక, వాళ్ళకు వండి పెట్టేలోళ్ళు లేక చానా బాధ పడసాగినాడు. దాంతో చుట్టుపక్కల వున్నోళ్ళు, బంధువులు అందరూ ఒక్కటై “ఎన్నాళ్ళిలా ఒక్కనివే బాధపడతా వుంటావు. దేవుని దగ్గర దీపం పెట్టేటోళ్ళు, బైట ముగ్గులేసేటోళ్ళు, వంటింట్లో పొయ్యి వెలిగించేటోళ్ళు లేని ఇల్లు వున్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇంకో పెండ్లి చేసుకో... నీకూ నీ పిల్లలకు అందరికీ మేలు" అని ఒకటే పోరు పెట్టినారు. దాంతో ఆయన సరేనని ఇంగో పెండ్లి చేసుకున్నాడు.
ఆ వచ్చినామె మొదట్లో ముగ్గురు పిల్లల్ని బాగానే చూసుకోనింది గానీ ఆమెకు ఒక కూతురు పుట్టినాక ప్రేమ తగ్గిపోయింది. ఆ అమ్మాయిలతో ఎప్పుడూ పనులు చేయిస్తా, చీటికీ మాటికీ నోటికొచ్చినట్టల్లా తిడతా .... అన్నం గూడా సరిగా పెట్టేది కాదు. ఎట్లాగయినా సరే ఆ అమ్మాయిల్ని ఇండ్లు వదిలి పారిపోయేలా చేయాలని చానా కష్టమైన పనులన్నీ చెబుతా వుండేది. ఒకరోజు ఆమె ముగ్గురినీ పిలిచి "పోండి... పోయి అడవిలో కట్టెలు తీసుకోని రాపోండి.
కానీ దాండ్లను కట్టడానికి తాడూ వుండగూడదు. మీ నెత్తి మీద గుడ్డా వుండగూడదు. జాగ్రత్త" అని హెచ్చరించింది. ఆ పిల్లలు అట్లా ఎట్లా తేవాల్నో అర్థం గాక అడవిలోనికి పోయి ఏడుస్తా కూచున్నారు.
అంతలో ఒక పాము వాళ్ళ దగ్గరికి వచ్చింది. “ఏం అమ్మాయిలూ... ఏమిట్లా అడవిలో కూచోని అట్లా ఏడుస్తా వున్నారు. ఏమి మీ బాధ" అనడిగింది. దానికా ముగ్గురు పిల్లలు కళ్ళల్లో నీళ్ళు కారిపోతా వుంటే వెక్కివెక్కి ఏడుస్తా "ఏం చెప్పమంటావు నాగరాజా మా బాధ... మా రెండో అమ్మ కట్టడానికి తాడు లేకుండా
మోసుకురావడానికి గుడ్డ లేకుండా కట్టెలు తీసుకోని రమ్మనింది. అట్లా ఎట్లా తేవాల్నో అర్థంగాక ఏడుస్తా వున్నాం" అని చెప్పినారు.
దానికా పాము చిరునవ్వుతో “మీరేం బాధపడకండి. మీరు కట్టెలన్నీ కొట్టుకోండి. నేను పోయి మా స్నేహితులను ఐదుమందిని పిలుచుకొని వస్తాను. ముగ్గురమేమో
మోపుకు తాడులాగా వుంటాం. మరో ముగ్గురమేమో చుట్టచుట్టుకోని మీ నెత్తి మీద గుడ్డలాగా వుంటాము" అని చెప్పి వెళ్ళిపోయింది. దాంతో ఆ ముగ్గురు అమ్మాయిలు సంబరంగా కట్టెలన్నీ విరగొట్టి కుప్పలు చేసుకున్నారు. అంతలో ఆ పాము ఇంకో అయిదు పొడవాటి పాములతో అక్కడకు చేరుకోనింది. మూడేమో మోపులకు తాడులాగా తయారయితే, మరో మూడేమో నెత్తి మీద గుడ్డలాగా చుట్ట చుట్టుకున్నాయి. ఆ అమ్మాయిలు ఆ పాములతో మోపు కట్టుకొని ఇంటికి చేరినారు. ఇంట్లో కట్టెల మోపులు దించగానే పాములు ఎక్కడివక్కడ సరసరసర వెళ్ళిపోయినాయి. సవతి తల్లి వచ్చి చూస్తే ఇంగేముంది కట్టెలన్నీ కుప్పలుగా కనిపించినాయిగానీ తాడుగానీ, బట్టగానీ ఏమీ కన్పించలేదు. దాంతో ఏమీ అనలేక వాళ్ళను లోపలికి రానిచ్చింది.
అట్లా కొంత కాలం గడిచినాక ఒకరోజు ఆ సవతితల్లి మూడు కుండలు తెచ్చి వాళ్ళకిచ్చింది. వాటి కింద పెద్ద పెద్ద కన్నాలున్నాయి. "పొండి... పోయి ఈ కుండలతో చెరువు దగ్గరనుంచి నీళ్ళు తెచ్చి ఇంట్లో గచ్చులన్నీ నింపండి. వేరే కుండలు తెచ్చినా, కన్నాలకు ఏమన్నా అతికిచ్చినా మళ్ళా ఈ ఇంట్లోకి అడుగు పెట్టనీయను జాగ్రత్త" అని హెచ్చరించింది. దాంతో ఆ అమ్మాయిలు చెరువు దగ్గరికి పోయి నీళ్ళు అట్లా ఎట్లా తావాల్నో అర్ధంగాక ఏడుస్తా కూచున్నారు. ఆ
అంతలో ఒక కప్ప ఎగురుకుంటా వాళ్ళ దగ్గరికి వచ్చింది. “ఏం అమ్మాయిలూ... ఏమిట్లా చెరువుకాడ కూచోని ఏడుస్తా వున్నారు. ఏమి మీ బాధ" అనడిగింది. దానికా ముగ్గురు పిల్లలు కళ్ళమ్మట నీళ్ళు కారిపోతా వుంటే వెక్కి వెక్కి ఏడుస్తా "ఏం చెప్పమంటావు కప్పరాజా మా బాధ... మా రెండో అమ్మ ఈ కన్నం పడిన కడవలనిచ్చి వేరే కడవలు తీసుకురాకుండా, వీటికి ఏమీ అతికియ్యకుండా నీళ్ళు తెచ్చి గచ్చు నింపమనింది. అట్లా ఎట్లా తేవాల్నో అర్ధం గాక ఏడుస్తా వున్నాం" అన్నారు.
దానికా కప్ప "మీరేమీ బాధ పడకండి. నేను పోయి మా స్నేహితుల్ని మరో ఇద్దరిని పిలుచుకోనొస్తా... మేం కడవల్లోకి పోయి రంధ్రానికి అడ్డంగా, నీళ్ళు బైటకి పోకుండా కూచుంటాం. మీరు హాయిగా కడవలతో నీళ్ళు ముంచుకోని గచ్చునంతా నింపెయ్యండి" అనింది. ఆ అమ్మాయిలు సంబరంగా సరే అన్నారు. వెంటనే ఆ కప్ప చెరువులోనికి పోయి మరో రెండు కప్పల్ని పిలుచుకోనొచ్చింది. ఆ మూడూ మూడు కడవల్లో దూరి కన్నాల కడ్డంగా కూచున్నాయి. దాంతో పిల్లలు నీళ్ళు తీసుకోనొచ్చి గచ్చునంతా నింపేసినారు. వెంటనే ఆ మూడు కప్పులూ ఎక్కడివక్కడ ఎగురుకుంటా వెళ్ళిపోయినాయి. సవతితల్లి వచ్చి చూస్తే ఇంగేముంది... గచ్చు నిండా నీళ్ళు కనిపించినాయిగానీ ఆ కడవలకడ్డంగా ఏమీ కనిపించలేదు. దాంతో ఏమీ అనలేక వాళ్ళను లోపలికి రానిచ్చింది.
అట్లా కొంతకాలం గడిచినాక ఒక రోజు ఆ సవతి తల్లి ముగ్గురినీ పొలానికి తీసుకొని పోయి మూడు బస్తాల వడ్లు ఇచ్చి వీటిని తీసుకోని పోయి ఒక్కగింజ గూడా విరగకుండా సాయంకాలానికంతా బియ్యం చేసుకోని రాండి... లేకపోతే ఈ ఇంటి గడప తొక్కకండి" అనింది. ముగ్గురూ ఆ మూడు మూటలు ముందు పెట్టుకోని అన్ని గింజలను ముక్క విరగకుండా పొట్టు ఎట్లా తీయాల్నో అర్ధంగాక ఏడుస్తా కూచున్నారు.
అంతలో ఒక పిచుక ఎగురుకుంటా వాళ్ళ దగ్గరికి వచ్చింది. "ఏం అమ్మాయిలూ... ఏమిట్లా పొలంలో కూచోని ఏడుస్తా వున్నారు. ఏమి మీ బాధ" అనడిగింది. దానికా ముగ్గురు అమ్మాయిలు కళ్ళమ్మట నీళ్ళు కారిపోతా వుంటే వెక్కి వెక్కి ఏడుస్తా "ఏం చెప్పమంటావు  పిచుక రాజా మా బాధ...  మా రెండో అమ్మ ఈ మూడు బస్తాల వడ్లు ఇచ్చి ముక్క విరగకుండా వీటన్నిటినీ సాయకాలానికంతా బియ్యంగా చేసుకోని రమ్మనింది. అట్లా ఎట్లా చేయాల్నో అర్ధం గాక ఏడుస్తా వున్నాం" అన్నారు.
దానికా పిచుక “మీరేమీ బాధ పడకండి. నేను పోయి మా స్నేహితులందర్నీ పిలుచుకోనొస్తా... ఎంతసేపు. కండ్లు మూసి తెరిచేలోగా ఒక్క వడ్లగింజ కూడా మిగలకుండా అన్నిటినీ పొట్టు తీసేస్తాం" అనింది. దాంతో ఆ అమ్మాయిలు సంబరంగా సరేనంటూ శుభ్రంగా కసువుకొట్టి వడ్లన్నీ కింద పరిచినారు. అంతలో యాడి నుంచి వచ్చినాయోగానీ ఒకటిగాదు, రెండుగాదు వందలవందల పిచుకలు కిచకిచకిచమంటా అట్లా వాలినాయి. కండ్లు మూసి తెరిచేలోగా చకచకచక ముక్క విరగకుండా పొట్టంతా వలిచి మూటల్లో వేసి వెళ్ళిపోయినాయి. దాంతో ఆ ముగ్గురు అమ్మాయిలూ మూడు మూటలు తీసుకోని ఇంటికి పోయినారు. సవతి తల్లి దాంట్లో చూస్తే ఒక వలవని గింజగానీ, విరిగిన బియ్యం ముక్కగానీ కనబడలేదు. దాంతో ఏమీ అనలేక వాళ్ళను లోపలికి రానిచ్చింది.
ఆ సవతి తల్లికి వాళ్ళను ఇంట్లోంచి ఎట్లా బైటకు తరమాల్నో అర్థం గాక ఒకరోజు ఎవరూ లేని సమయంలో మొగునితో కొట్లాట పెట్టుకోనింది. "నీవు వాళ్ళని అడవిలో వదిలిపెట్టి వస్తావా లేక నేనూ నా పిల్ల విషం తాగి చావమంటావా అని పట్టుపట్టింది. దాంతో ఆమె మొగుడు ఏమీ చేయలేక తర్వాత రోజు ముగ్గురు పిల్లలతో “అమ్మా... పక్కవూరిలో పెద్ద తిరుణాల జరుగుతావుంది. మీ చిన్నమ్మ, చిన్న చెల్లి రేపొస్తారంట. మనము ఈ రోజే పోదాం. తయారుకాండి" అని చెప్పినాడు. పాపం... ఆ ముగ్గురు అమ్మాయిలూ తిరుణాలనగానే సంబరంగా
మంచి బట్టలు కట్టుకోని, మొగానికి బొట్టు పెట్టుకోని, తల్లో పూలు తురుముకోని, కళ్ళకు కాటుక దిద్దుకోని మల్లెపూలలెక్క మెరిసిపోతా బైలుదేరినారు. వాళ్ళనాన్న ఒక పెద్ద అడవిలోనికి వాళ్ళను తీసుకోని పోయి ఒకచోట కూచోబెట్టి “మీరు ఇంటికాన్నుంచి తెచ్చుకున్న సద్ది తింటా వుండండి. ఈ పక్కనొక మంచి మాగిన మామిడికాయల చెట్టొకటి వుంది. పోయి పండ్లు పట్టుకోనాస్తా" అని పోయినాడు. అట్లా పోయినోడు మరలా వెనక్కి గూడా తిరిగి చూడకుండా "అయ్యో... పాపం... ఆడపిల్లలని" గూడా అనుకోకుండా అదే సందని ఇంటికి వెళ్ళిపోయినాడు.
పాపం... ఆ ముగ్గురు అమ్మాయిలు ఆ అడవిలో నాన్నా... నాన్నా... అంటూ ప్రతి కొమ్మా రెమ్మా వెదికినారు. భయంతో కేకలు వేసినారు. ముగ్గురూ కలసి కిందామీదా పడి ఏడ్చినారు. చీకటి పడతా వుంటే ఎప్పుడు ఏ జంతువులు వచ్చి మీద పడతాయోనని గజగజా వణికిపోసాగినారు.
అదే సమయంలో ఆ పక్కవూరికి చెందిన ముగ్గురు రాకుమారులు అడవి జంతువులను వేటాడి ఇంటికి తిరిగిపోతా వున్నారు. వాళ్ళు ఏడుస్తా వున్న ఆ ముగ్గురు అమ్మాయిల్ని చూసినారు. వాళ్ళ కథంతా విన్నారు. “అబ్బ... ఎంతందంగా వున్నారు ముగ్గురూ ముత్యాల్లెక్క... చేసుకుంటే ఇట్లాంటి చక్కని చుక్కల్నే చేసుకోవాల" అనుకోని ఆ ముగ్గురినీ వాళ్ళింటికి పిలుచుకోని పోయి పెండ్లి చేసుకున్నారు. దాంతో వాళ్ళ దశ తిరిగి హాయిగా కాలు మీద కాలేసుకోని కులాసాగా బతకసాగినారు.
ఇక్కడ వాళ్ళ నాన్న, చిన్నమ్మ వున్నారు గదా... ఆ వూళ్ళో పెద్ద కరువొచ్చింది. ఒక్క వాన చుక్కగూడా భూమి మీదకు రాలలేదు. దానికితోడు ఒకరోజు రాత్రి కొందరు దొంగలు వాళ్ళింటి మీద పడి వున్నదంతా నున్నగా పూడ్చుకోని పోయినారు. ఒకవైపు డబ్బుల్లేక, మరొక వైపు పంటల్లేక వాళ్ళు వీధిన పడినారు. ఆ వూరిలో బతకలేక వేరే వూర్లలో తినడానికి తిండి లేక ఆడుక్కోసాగినారు.
అట్లా ఒకొక్క వూళ్ళో అడుక్కుంటా అడుక్కుంటా ఒకరోజు ఈ ముగ్గురూ వున్న వూరొచ్చినారు. వాళ్ళు అట్లా అడుక్కుంటా వుంటే మిద్దె మీది నుంచి ముగ్గురూ చూసి "అయ్యో.... మన నాన్నా, చిన్నమ్మా, చిన్న చెల్లెలే గదా" అని వురుక్కుంటా వచ్చి కళ్ళనీళ్ళు బెట్టుకున్నారు. వాళ్ళని చూసిన చిన్నమ్మ "మిమ్మల్ని బాధ పెట్టినందుకేనమ్మా మాకీ కష్టాలు. మంచి వాళ్ళని బాధపెట్టి బాగుపన్నవాళ్ళు ఈ లోకంలో ఎవరూ వుండరు" అంటూ భోరున ఏడ్చింది. "అయ్యయ్యో... అంతమాట అనకమ్మా... మీరు ఆ రోజు అట్లా చేయబట్టేగదా... మాకీరోజు ఇన్ని భోగభాగ్యాలు, అంతా మా మంచికే జరిగింది" అంటూ అందర్నీ ఇంటికి పిలుచుకోనొచ్చినారు. వాళ్ళ మొగుళ్ళకు చెప్పి మోయలేనంత బంగారమిచ్చి పసుపూకుంకుమలతో పంపిచ్చినారు.
***********
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం