మెక్కూమెక్కూ... ముక్కామెక్కూ..: - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
 
***********
    ఒకూరిలో ఒకడున్నాడు. వాడేమో రోజూ కూర (మాంసం) తీస్కోనొచ్చి వంట బాగా అదిరిపోయేలా చేయమని పెండ్లానికిచ్చి పొలానికి పోయేటోడు. ఆమె చానా టక్కరిది. మొగుడట్లా బైటికి పోవడం ఆలస్యం గబగబా రొట్టె చేసుకోని
మెత్త మెత్తని ముక్కలన్నీ ఏరి బాగా కూర చేసుకోని నున్నగా తినేసేది. మొగుడు వచ్చే సమయానికి మిగిలిన ఒట్టి ఎముకలు వేసి చారు చేసి వానికి పెట్టేది.
వాడు చారూ, ఎముకలు చూసి “ఇదేందే... దీంట్లో ఒక్క ముక్క కూడా లేదు" అనడిగితే "ఏమో నాకేం తెల్సు... నువ్వెట్లాంటిది తెస్తే అట్లాంటిది చేసి పెడతా వున్నా. ముక్కల్లేకపోతే పోయి... నీకు కూరమ్మేటోన్ని అడుగుపో" అని గట్టిగా కొట్లాడేది. పాపం వాడు ఆమె నోటికి బెదపడి గమ్మున నోరు మూసుకోని మట్టసంగా పెట్టినేది తినేటోడు. అట్లా ఆమె ముక్కలన్నీ తినుకుంటా తినుకుంటా రోజు రోజుకీ దుబ్బగయిపోతా వుంటే పాపం వాడేమో రోజు రోజుకీ సన్నగా బక్కచిక్కి పోతా వున్నాడు.
ఒకరోజు వాడు చెల్లెలిని చూసొద్దామని వాళ్ళూరికి పోయినాడు. ఆమె అన్నను చూసి "ఏందన్నా... ఇంతకుముందు పోట్లగిత్తలా ఎట్లా వుండేటోనివి. ఇప్పుడేమి ఇట్లా ఎండుపుల్లలెక్క బాగా చిక్కిపోయినావు" అనడిగింది. దాంతో వాడు జరిగిందంతా చెప్పినాడు.
ఆమె “అట్లనా" అని మూడు లక్కబొమ్మలు తెచ్చిచ్చి “అనా... అనా... ఇవి అలాంటిలాంటి మామూలు  లక్కబొమ్మలు కాదు. మంత్రించిన లక్కబొమ్మలు. వీటిని తీస్కోనిపోయి నీ పెండ్లానికి తెలీకుండా ఒకటి నీ గుమ్మం కింద తవ్వి పెట్టు. మరొకటి గూట్లో దాచిపెట్టు. ఇంకొకటి గవాక్షిపైన పెట్టు" అని చెప్పింది.
సరేనని వాడు ఆ మూడు లక్కబొమ్మలూ తీస్కోనిపోయి పెండ్లాం నీళ్ళకు పోయినప్పుడు ఒకటి గుమ్మంకింద, మరొకటి గూట్లో, ఇంకొకటి గవాక్షిలో కనబడకుండా పెట్టేసి ఏమీ తెలీనోనిలెక్క మట్టసంగా వున్నాడు.
తరువాత రోజు పొద్దున్నే వాడు ఎప్పటిలాగానే కూర తీస్కోనొచ్చి పెండ్లానికిచ్చి పొలానికి పోయినాడు. మొగుడట్లా పోయినాడో లేదో... వెంటనే ఆమె మెత్త మెత్తని ముక్కలన్నీ ఏరి పొయ్యి మీదికి కూరగిన్నె ఎక్కిచ్చింది. కూర చేసినాక రొట్టెలు కాల్చుకుందామని పిండి తీసి వేన్నీళ్ళు కలిపి కొడతా వుంటే గుమ్మం కిందున్న బొమ్మ
"కొట్టూ... కొట్టూ... రొట్టే కొట్టూ 
ఒక్కదానికే బాగా కొట్టు" అనరిచింది. "ఎవరబ్బా అట్లా అంటా వున్నారని" ఆమె అదిరిపడి చుట్టూ చూస్తే ఎవరూ కనబడలేదు. దాంతో "ఏందోలే" అనుకోని రొట్టెలు చేసుకోని, పళ్ళెంలో కూరేసుకోని తిందామని నోట్లో పెట్టుకోబోయింది.
వెంటనే గూట్లో వున్న బొమ్మ “పెట్టూ  పెట్టూ నోట్లో పెట్టు....
ఒక్కడానివే దంచీ కొట్టు..." అనరిచింది.
అంతే ఆమె “ఎవరబ్బా అట్లా అంటావున్నారని" బిరబిరా బైటికి పోయి అంతా వెదికింది. కానీ ఎక్కడా ఎవరూ కనబళ్ళేదు.
దాంతో “ఏందోలే" అనుకోని రొట్టెలోకి కూరద్దుకోని తినసాగింది. వెంటనే గవాక్షిలోని బొమ్మ 
“మెక్కూ మెక్కూ ముక్కా మెక్కూ ....
మొగునికి పెట్టక బాగా మెక్కూ..." అని ఆగకుండా అరవసాగింది.
దాంతో ఆమె "నేను కూర తింటావున్నది ఎవరో చూస్తా వున్నట్టున్నారు” అని భయపడి ఆరోజు నుండీ ఏమీ తినకుండా చేసినవి చేసినట్టు మట్టసంగా మొగునికి కూడా సమానంగా పెట్టడం మొదలు పెట్టింది.
***********

కామెంట్‌లు
Popular posts
సింప్లిసిటీ!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం