పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికొరకు స్మశానంలో ప్రవేసించి,బేతాళుడు ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధీంచి భుజంపైన చెర్చుకుని మౌనంగా స్మశానంనుండి
బయలుదేరాడు .
" మహిపాలా అనన్య ప్రతిభావంతుడవు అయిన నీపట్టుదల,శ్రమ మెచ్చదగినదే! మనప్రయిణంలో నీకు అలసట తెలియకుండా సముచిత నిర్ణయం అనేకథ చెపుతాను విను...
అవంతి రాజ్యాన్నిగుణశేఖరుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు తన మంత్రి సుబుధ్ధితో కలసి సదానందుని ఆశ్రమానికివెళ్ళాడు అక్కడ సదానందుడు విద్యార్ధులకు బోధిస్తూ ఉండటంతో పాఠశాల చేరువులోని అరుగు పైన కూర్చుని సదానందుని బోధన వినసాగాడు....
' నాయనలారా మనిషికి ఒక్కటే జీవితం ఈజీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి జీవించడానికి ధనం కాని ,ధనం కోసం జీవించకూడదు. నిస్వార్ధంగా జీవించాలి,ఉదాహరణకు చెట్లకు కాచే ఫలాలు ఆచెట్లే తినలేవు,
సమస్త ప్రాణకోటి దాహాన్ని తీర్చే నదీ తన నీటిని తను తాగలేదు. పసువులు ఇచ్చే పాలు ఇతరులకు వినియోగపడతాయి కాని అవి తాగవు.
రళ్ళతో కొట్టినా తీయ్యని ఫలాలను అందిస్తాయి చెట్లు,ఒక్క రోజు జీవించే పుష్పలు సుగంధ భరితమైన వాసనలు వెదజల్లుతాయి.పూచే పూవ్వుకు ,కాచే పండుకు లేని స్వార్ధం మనిషిలో ఎందుకు ఉండాలి? వందేళ్ళు జీవించలేమని తెలిసి వేయ్యేళ్ళకు సరిపడ మనిషి ఎందుకు సంపాదిస్తాడో తెలియదు. రాజ్యవిస్ధీర్ణత పేరున యుధ్ధాలు చేస్తూ వేలమంది ప్రాణాలు కోల్పోవడం ,మరెందరికో అంగవైకల్యం కలగడం ఎంతవరకు న్యాయం?' ...వెలుపల గుర్రం సకలింపు వినిపించడంతో ,పాఠశాల వెలుపలకు వచ్చి రాజును చూసిన సదానందుడు "ప్రభువులకు అభివాదములు ఎప్పుడు వచ్చారు "అన్నాడు.
" గురు దేవ రేపు భువనగిరి రాజ్యంపై దాడి చేయబోతూ తమరి ఆశీర్వాదాలు పొందడానికి వచ్చాను తమ బోధన విన్న అనంతరం నాకు కనువిప్పి జరిగింది యుధ్ధం వలన ఇరుదేశాల ప్రజలు నన్ను ద్వేషిస్తారు కనుక యుధ్ధం ప్రయత్నం విరమిస్తున్నాను అని ,రాజధానికి చేరి వేగులు తెచ్చిన వార్త విని ఆవేశంగా తన రెండు లక్షల సైన్యంతో బయలుదేరి భువనగిరి రాజ్య పొలిమేరలలో విడిది చేసాడు.
" విక్రమార్క మహరాజా నిన్న భువనగిరిపై దాడి చేయను అని సదానందునికి మాటఇచ్చిన అవంతి రాజు గుణశేఖరుడు తనసైన్యంతో ఎందుకువెళ్ళాడు ? నా ప్రశ్నలకు సమాధానం తెలిసి చెప్పక పోయావో తల పగిలి మరణిస్తావు "అన్నాడు బేతాళుడు.
"బేతాళా కాలం చాలా చిత్రమైనది ఎప్పుడు ఎవరిని శత్రువు చేస్తుందో , ఎవరిని మిత్రులు చేస్తుందో చెప్పలేం. అవంతిరాజు గుణశేఖరుడు భువనగిరిపై దాడి చేయడానికి వెళ్ళలేదు భువనగిరిని రక్షించడానికి వెళ్ళాడు.అలావెళ్ళడానికి కారణం తమరాజ్య వేగు తెచ్చిన వార్త.
లక్షమంది సైనికులతో వచ్చి భువనగిరిని జయించాలని బయలుదేరాడు అమరావతి రాజు చంద్రసేనుడు, కాని భువనగిరికి రక్షగా అవంతి రాజు గుణశేఖరుడు ఉన్నాడన్న విషయం తెలుసుకుని యుధ్ధం విరమించి తనసైన్యంతో మార్గమధ్యనుండి వెనుతిరిగాడు.
విషయం తెలుసుకున్న భువనగిరి రాజు, అవంతి రాజు గుణశేఖరునికి ఆపదలోఆదుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసాడు. భువనగిరి ప్రజలు గుణశేఖరునికి బ్రహ్మరధం పట్టారు. " ప్రభు తమరు నిన్న ఈ భువనగిరిపై దాడిచేసి స్వాధీన పరుచుకోవాలి అనుకున్నారు అదే జరిగి ఉంటే ఇరువైపుల వేలమంది సైనికులు మరణించేవారు ఇరుదేశాలకు ఆర్ధిక భారంఅయ్యేది ఈ భువనగిరి ప్రజలు తమరిని శత్రువుగా పరిగణించేవారు. తమ యుధ్ధం వద్దు అని తీసుకున్న సముచిత నిర్ణయం వలన నేడు భువనగిరి ప్రజలు తమరికి జేజేలు పలికారు.ఇరురాజ్యాల ప్రజలు సంతోషించారు.పోరాటాలకన్నా ఇచ్చిపుచ్చు కోవడం మిన్నఅని సాటి వారితో స్నేహంగా మెలగడంలో ఆనందం ఉందని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు " అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతో సహ మాయమైనాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై మరలా వెనుతిరిగాడు.
సముచిత నిర్ణయం. కల్పిత బేతాళ కథ.:- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు. చెన్నయ్ .-9884429899
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి