రసవత్తరంగా జరిగిన వీక్షణం అంతర్జాల సమావేశం :- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్
  వీక్షణం 151వ అంతర్జాల సమావేశంశనివారం  ఉదయం  రసవత్తరంగా జరిగినది. మొదట వీక్షణం అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి తల్లాప్రగడ రావు, మధు ప్రఖ్యా మరియు కవులకు స్వాగతం పలికారు. 150 సమావేశాల సమీక్షలను పుస్తకంగా తీసుకొని రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. మొదటి సమావేశం 2012న జరిగిందని 150 వ సమావేశం గతనెల 22వ తేదీ జరిగిందన్నారు.
150 సమావేశాల సంచికను డాక్టర్ తల్లాప్రగడ రావు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించటం సంతోషంగా ఉన్నదన్నారు. మృత్యుంజయుడు మాట్లాడుతూ మొదటి సమావేశం నుండి వీక్షణం సమూహంతో కలసి పనిజేయటం సంతోషంగా ఉన్నదన్నారు. రాజేంద్రప్రసాద్ తర్వాత ప్రసంగిస్తూ వీక్షణం సమవేశాలు చాలా బాగా జరుగుతున్నాయని, భారతీయ కవులు ఈ సమావేశాలలో పాల్గొనటానికి ఉత్సాహం చూపుతున్నారని అన్నారు.
పిమ్మట ప్రఖ్యాత కవి మధు ప్రఖ్యా కవిసమ్మేళనం నిర్వహించారు. రావు తల్లాప్రగడ వినాయకుని కీర్తనతో కవిసమ్మేళనం ప్రారంభీంచారు. డాక్టర్ గీతా మాధవి ఆమె ప్రియురాలు కవితను, భిల్లా శ్రీధరరెడ్డి పచ్చరాళ్ళు కవితను, ముప్పాళ్ళ భవాని నా ఊహలో వసంతం కవితను, మౌనశ్రీ మల్లిక్ కళ్ళజోడు కవితను, టి బాలక్రిష్ణారెడ్డి విశ్వావసు ఉగాది కవితను, మంజుల సరిపల్లి నీతి నీగతి కవితను, పాతూరి అన్నపూర్ణ మనోనేత్రంవిచ్చుకుంటే కవితను, మోటూరి నారాయణ రావు వేమనపద్యం మనజీవన సూత్రం కవితను, డాక్టర్ నవనీత రవీందర్ కన్నీటి విలువ కవితను, రామక్రిష్ణ చంద్రమౌళి షోడా కవితను, వంశీధర్ జ్వలనగానం కవితను, గౌడి సరిత నవరసాల ఉగాది సొబగులు కవితను, ఆది మోపిదేవి పునర్జన్మ ఉంటే బాగుండు కవితను, బుక్కపట్నం రమాదేవి నిన్నటి నేను పై కవితను, అవధానం అమృతవల్లి సంయమన రధంపై శాంతి ఝండా ఎగరేస్తూ కవితను, దేవులపల్లి పద్మజ తెలుగు భాష పద్యాలు, పరాంకుశం క్రిష్ణవేణి పాడాలని ఉన్నది కోకిలనై కవితను, అయ్యల సోమయాజులప్రసాద్ విశ్వావసు నీకు స్వాగతం కవితను, డాక్టర్ ఎం ఎన్ బృందా జీవనరాగం కవితను, భోగెల ఉమామహేశ్వరరావు నవవసంతం కవితను, డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి నవవసంతం పద్యాలును, పరిమి వెంకట సత్యమూర్తి కళ్ళద్దాలు కవితను, డాక్టర్ కోదాటి అరుణ వచ్చేనమ్మా వచ్చేను ఉగాది పండుగ వచ్చేను కవితను, కె శ్యామలాదేవి ఉగాది కవితను, వనజ బలసాని గోవర్ధన గిరిధారి (డ్రగ్స్) కవితను, స్వాతి బోడిగం  ఉగాది కవితను, ఆలపాటి గారి అమ్మాయి ఉగాది కవితను, చిట్టాబత్తిన వీర రాఘవులు రైతులపై చిద్రబ్రతుకు కవితను,డాక్టర్ మల్కని విజయలక్ష్మి సూర్యుని కవితను, ఆనం ఆశ్రితారెడ్డి సాహిత్యం వైపు అడుగులు కవితను, మేడిశెట్టి యోగేశ్వరరావు ఆ మూర్ఖుడేవరు కవితను చదివి ప్రేక్షక వీక్షకులను అలరించారు.గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ ఉగాది ఊసులు కవితను వినిపించారు.
చివరిగా అతిధులకు మరియు  కవులకు ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని డాక్టర్ గీతా మాధవి ముగించారు.
కవితలన్నీ బాగున్నాయని. కార్యక్రమం ఆద్యంతం అద్భుతంగా సాగిందని, వచ్చేనెల సమావేశం కొరకు ఎదురుచూస్తున్నామని కవులు సంతోషం వ్యక్తంజేసారు.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.వీక్షణం భారతదేశ ప్రతినిధి

కామెంట్‌లు
Popular posts
సింప్లిసిటీ!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం