ఓ మెతుకు పట్టి చూద్దాం:- డా.సి వసుంధర,చెన్నై.
 ఏదైనా గొప్ప గొప్ప గ్రంధాలను గూర్చి పూర్తిగా తెలుసుకోవడం అనేది చాలా శ్రమ కాలంతో కూడినపనీ. అయిన ప్పటికీ వాటిని గూర్చి క్లుప్తంగానైనా తెలుసుకోవడం ఉత్తమం. 
నేనిప్పుడు కొన్ని ప్రాచీన సాహిత్యంలోని విషయాలను కొద్దిగా వివరిస్తాను. 
1) వేదములు 
*****
ప్రపంచ సాహిత్యంలో వేదాల కంటే ప్రాచీనమైన సాహిత్యం లేదు ఇవి ఎంత అత్యంత పురాతనమైన సంస్కృత భాషలో రచింపబడ్డాయి. ప్రపంచం లైబ్రరీలో ఋగ్వేదం మొదటి పుస్తకం
2 వేదములు ఎన్నిగా విభజింపబడ్డాయి?
వేదములు నాలుగు 
1 ఋగ్వేదము 
2 యజుర్వేదము 
3 సామవేదము 
4 అధర్వ వేదము 
ప్రతి వేదమును రెండు గా విభజింపబడ్డాయి
1 కర్మకాండ  2జ్ఞానకాండ
1కర్మకాండలో యజ్ఞాధులను గూర్చి  వివరించారు.
2 జ్ఞానఖండలో బ్రహ్మ తత్వాన్ని గురించి వివరించారు. 
ఈ బ్రహ్మజ్ఞానాన్నిగూర్చి చెప్పే భాగాన్ని వేదాంతము లేక ఉపనిషత్తులు అని
పిలుస్తారు. 
వేదములను మనుషులు రాయలేదు భగవంతునిఆజ్ఞచే మంత్రద్రష్టలైన ఋషులచే  ఉచ్చరించబడినవి.
వేదాలలోఅనేక విషయాలను చెప్పబడ్డాయి
ఉదాహరణకు వివాహమైన తర్వాత 
కొత్తలలో భార్యను దగ్గర కూర్చోపెట్టుకొని భర్తఆమెకు కొన్ని ధర్మాలను చెప్పడం ఆమె మనోగతంతెలుసుకోవడం చేయాలని వేదాలలో ఇది ఎంతో విశిష్టమైన విషయం అటువంటి అవగాహన లేకఈనాడు దాంపత్య జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. 
వేదాలు చిక్కు పడి ఉంటే వ్యాసుడు వాటిని విడపరిచి వేద సారాంశాన్ని మహాభారతంగ్గారచించడం జరిగింది అందుకే ఆయనకు వేద వ్యాసుడు అన్న పేరు  వచ్చింది
 శుభం

కామెంట్‌లు