సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -801
"ఆలస్యాత్ అమృతం విషం న్యాయము
*****
ఆలస్యాత్: అనగా ఆలస్యం వల్ల.అమృతం అనగా మరణం లేనిది , నిత్యం ఉండటం, అమరత్వం.విషం అనగా  హాని కలిగించే, మరణానికి కారణమయ్యేదీ, హాలాహలం,గరళం అనే అర్థాలు ఉన్నాయి.
ఆలస్యం చేయడం వల్ల అమృతమూ  విషమై పోతుందని అర్థము.
ఆలస్యం చేస్తే అమృతమైనా విషమవుతుంది అంటే చేయవలసిన పనిని నిర్థిష్టమైన సమయంలో జరుగకపోవడం వల్ల అనర్థం కలుగుతుంది కాబట్టి నిర్థిష్టమైన సమయంలో చేయమని హెచ్చరిస్తూ చెప్పే వాక్యమే  "ఆలస్యం అమృతం విషం ". కాబట్టి ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి.
 " సిద్ధమన్నం ఫలం పక్వం/నారీ ప్రథమ యవ్వనం/ కాలక్షేపం న కర్తవ్యం/ ఆలస్యం అమృతం విషం"అనేసంస్కృత శ్లోకంలోంచి తీసుకోబడిన న్యాయము.
అనగా అన్నం సిద్ధంగా ఉన్నప్పుడు,పండిన ఫలం ఉన్నప్పుడు,యవ్వనంలో స్త్రీ ఉన్నప్పుడు కాలక్షేపం చేయకూడదు.సమయం వృధా చేస్తే వండిన అన్నం పాడైపోతుంది.పండిన ఫలం కుళ్ళిపోయి తినకుండా పాడైపోతుంది.స్త్రీ యవ్వనం అంటే "ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే తీరాలి. వివాహం జరగాలి ఆలస్యం చేసిన కొద్ది అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి.కాబట్టి "ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుంది' అని అర్థము.
తరచుగా కొన్ని ఆలస్యాలు చేసి ఆపైన తీరిగ్గా బాధపడే సందర్భాలు కొన్ని ఉంటాయి. తప్పనిసరిగా వెంటనే చేసే పనుల పట్ల అలసత్వం పనికిరాదు. ఆ అలసత్వంతో కూడిన ఆలస్యం జీవితాంతం బాధ పడేలా చేస్తుంది. అవేమిటో చూద్దాం.
కొన్ని ముఖ్యమైన పరీక్షలు ఉంటాయి. వాటికి ఒక్క నిమిషం ఆలస్యం అయినా రాయడానికి అనుమతించరు. ఎప్పటినుండో బాగా చదివి పరీక్షపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వ్యక్తి ఆ ఒక్క నిమిషం ఆలస్యం వల్ల ఎంత కోల్పోతాడో అర్థం చేసుకోవచ్చు. అలాగే బస్సు, రైలు, ఫ్లైట్ రిజర్వేషన్ చేయించుకుని సమయాన్ని  సరిగ్గా సర్దుబాటు చేసుకోలేక, హడావుడిగా అవకతవకలు చేస్తూ ఏ మాత్రం ఆలస్యం చేసినా అటు డబ్బు ఇటు చేరాల్సిన గమ్యానికి చేరలేక ఎంత మానసిక వ్యధ పడతామో వేరే చెప్పక్కర్లేదు.
అందుకే ఏపని చేయాలన్నా పక్కా ప్రణాళిక కావాలి అంటారు పెద్దలు. పెద్దలు ఇంకో మాట కూడా  "శుభస్య శీఘ్రం" అని కూడా అన్నారు.అంటే ఏదైనా మంచి పని చేయాలి అనుకున్నప్పుడు వెంటనే మొదలు పెట్టాలి. ఎలాంటి తాత్సారం చేయకుండా, మీనమేషాలు లెక్కించకుండా, వీలైనంత త్వరగా  చేయాలి అని అర్థము."ఇక "రేపటి పని ఈరోజే చెయ్యి.ఈరోజు పని ఇప్పుడే చెయ్యి" అన్నారు కబీర్ దాసు.
 కాబట్టి  ఏదైనా పనిని తలపెట్టినప్పుడు  ముందు చక్కని ప్రణాళిక వేసుకోవాలి. దానికి కావలసిన సహాయాన్ని ఆప్తులైన వారి నుండి తీసుకుని ప్రారంభిస్తే ఏ పనైనా చక్కగా నెరవేరుతుంది.
 "ఆలస్యం అమృతం విషం" అనే పదం మన నిత్య జీవితంలో రాకుండా జాగ్రత్త పడాలి.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం