తిరుమలరావుకు అందమైన కుటుంబం ఆత్మీయ సత్కారం.

 విశాఖపట్నం ముడసర్లోవ పార్క్ లో రాష్ట్రపతి పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావుకు ఘన సన్మానం జరిగింది. తిరుమలరావు 2009లో న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతులమీదుగా జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సన్మానం ప్రత్యేకతను సంతరించుకుంది. 
కుటుంబ బాంధవ్యాల పవిత్రతను పెంచేందుకు అత్యంత వైభవంగా అందమైన కుటుంబం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించామని కమిటీ అధ్యక్షులు కుదమ పరమేశ్వరరావు తెలిపారు. ఎనభై కుటుంబాలకు చెందిన మూడువందల మందికి పైగా బంధుగణం పాల్గొని తమ తమ ఆప్యాయతలను, అనురాగాలను పంచుకున్నారని ప్రధాన కార్యదర్శి కె.గోపి అన్నారు. 
ఈ అనుబంధాల సమ్మేళన వేదికపై కొందరిని ప్రముఖులుగా గుర్తించి సన్మానించడం జరిగిందని ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఐతే తమ బంధు గణమందు రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్న ఏకైక వ్యక్తి కుదమ తిరుమలరావు అని, మా బంధువులందరికీ గర్వకారణంగా నిలిచారని కమిటీ కోశాధికారి అరసాడ రఘుపతిరావు తెలిపారు. కుదమ తిరుమలరావు 1967లో పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం, కుదమ గ్రామంలో జ్యోతి, నరసింగరావు బాబయ్య పట్నాయక్ లనే పుణ్య దంపతులకు నాల్గవ పుత్రునిగా జన్మించిరి. తిరుమలరావు ఇరవై రెండేళ్ళకే  1989లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా శ్రీకాకుళం జిల్లా, భామిని మండలం, పసుకుడిలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఆటపాటలతో, చిత్రలేఖన కళలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తూ, గుణాత్మకమైన విద్యను అందించేలా పాఠాలను బోధిస్తూ తిరుమలరావు నిరంతర శ్రామికునిగా కృషి చేస్తూ ఉంటారు. 
ఆయన కేవలం పదేళ్ల సర్వీస్ లోనే 1999లో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రభుత్వం వారిచే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. పదహారేళ్ళ సర్వీస్ లోనే 2005లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులమీదుగా స్వీకరించారు. కేవలం ఇరవై ఏళ్ల సర్వీస్ లోనే 2009 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ల చేతులమీదుగా పొందారు. రచనలతో, పాటలతో, చిత్రలేఖనంతో విద్యాప్రమాణాలు పెంచుట ద్వారా తిరుమలరావు పనిచేస్తున్న పాఠశాలలు సైతం ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దబడ్డాయి. మరోవైపు కవితలు, వ్యాసాలు, కథలు, పాటలు మున్నగు అంశాలయందు కూడా తనదైనశైలిలో సృజనాత్మకతతో రాణించి, పెక్కు పురస్కారాలను పొందారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ఎన్యూమరేటర్ గా సెన్సస్ 2001 అవార్డును పొందిన తిరుమలరావు, అక్షరక్రాంతి జన్మభూమి చదువులపండుగ సిక్కోలు సంబరాలు, తెలుగు వికాసం, గోదావరి కృష్ణా పుష్కరాల పురస్కారాలు, ఉగాది, అక్షర సంక్రాంతి మున్నగు ప్రభుత్వ పథకాలన్నింటా వందకు పైగా పురస్కారాలు పొందారు. బెంగళూరులో తెలుగు తేజం, విజయనగరంలో విద్యాభారతి బిరుదాంకిత ఉగాది పురస్కారం, హైదరాబాద్ లో తెలుగు కళా వైభవం సహస్ర కవిమిత్ర బిరుదాంకిత పురస్కారం, పొద్దుటూరులో తెలుగు దీప్తి పురస్కారం, అనంతపురంలో తెలుగు రక్షణ వేదిక పురస్కారం, అంతర్వేదిలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డులు వంటి పలు పురస్కారాలు వందకు పైగా పొందారు తిరుమలరావు. 
కుదమ తిరుమలరావు ధర్మపత్ని ఐన సుకన్య, ప్రస్తుతం రాజాం సెంటాన్స్ స్కూల్ లో హిందీ పండిట్ గా పనిచేస్తున్నారు. ఏకైక సంతానం స్నేహ, అల్లుడు సందీప్ లు హైదరాబాద్ లో స్థిరపడిరి. ఇంకా నాలుగేళ్ల పైబడి సర్వీస్ ఉన్న తిరుమలరావు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తిరుమలరావు అన్నయ్య కుదమ పరమేశ్వరరావు కూడా రాష్ట్ర స్థాయి ఉత్తమ సైన్స్ ఉపాధ్యాయునిగా ఆనాటి ముఖ్యమంత్రి కె.రోశయ్య చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండల విద్యాశాఖాధికారిగా విశేషమైన సేవలను అందించి పదవీవిరమణ గావించారు పరమేశ్వరరావు. అందమైన కుటుంబం కమిటీ అధ్యక్షులు కుదమ పరమేశ్వరరావు,  
ప్రధాన కార్యదర్శి కుదమ గోపి,
ఆర్గనైజింగ్ సెక్రటరీ  కె.శ్రీనివాసరావు, 
కోశాధికారిగా అరసాడ రఘుపతిరావు,
గౌరవసలహాదారులు కుదమ కృష్ణారావు, భాస్కరరావు, 
కె.అరంజ్యోతి, తుంబలి యజ్ఞేశ్వరరావు, బగ్గాం ధనంజయరావు,
గౌరవాధ్యక్షులు ఆర్వీ పట్నాయక్, ఎస్.కె.గోవిందరావు, ఎం.పి.గౌరీశంకరరావు, 
మహిళా కార్యదర్శులు అలివేలు, లత, కృష్ణసాయి, విజయ, రాధ, శాంతి, సుకన్య, లక్ష్మి, భాషిణి, 
కల్చరల్ కమిటీ కార్యదర్శులు కె.వెంకటచలపతిరావు, ఎ.హరనాథరావు, వి.స్వర్ణసాయిసుధ, పాల్తేరు మాధవరావు, కె.మధుసూదనరావు, సాలూరు రామకృష్ణ, 
ఉపాధ్యక్షులు తట్టికోట గణపతిరావు, ఎ.వాసుదేవరావు, కె.వి.చలపతిరావు, పక్కి మధుసూదనరావు, కె.నాగభూషణరావు,
సహకార్యదర్శులు నడుకూరు విజయకుమార్, కె.మధుభాను కుమార్ పట్నాయక్, ఎన్.శ్రీనివాసరావు, కె.సంతోష్ కుమార్, 
ఆహ్వాన కమిటీ సభ్యులు  కె.సత్యసాయిబాబా, కె.రమేష్, మల్లేశ్వరరావు, పక్కి తులసీదాస్, కె.రవి, రేగులవలస రవి, ఎ.తిరుపతిరావు, కె.రామ్ ప్రసాద్,  
దేవీప్రసాద్ పట్నాయక్, పి.రామదాస్ లు తిరుమలరావు సేవలను ప్రశంసించారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం