పాండిచ్చేరీలో జాతీయ తెలుగు ప్రజ్ఞానిధీ పురస్కారాల కార్యక్రమం


 ఐ యస్ ఓ గుర్తింపు పొందిన తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ అంతర్జాతీయ సి ఈ ఓ డా. యు వి రత్నo  మరియు అంతర్జాతీయ పోగ్రామ్ కన్వీనర్ డా. ధనాశి ఉషారాణి ఆధ్వర్యంలో పాండిచ్చేరీ కేంద్రపాలిత ప్రాంతము తమిళనాడు హోటల్ షాన్ భాగులో వివిధ రాష్ట్రముల నుండి విచ్చేసిన  విశిష్ట ప్రతిభావంతులైన తెలుగు  వారి కీర్తి  ప్రతిష్టలను ఇనుమడిoప చేసేలా 100 మంది కవులు కళాకారులు సామాజిక స్పృహ కలిగిన తెలుగు తేజాలను జాతీయ తెలుగు ప్రజ్ఞానిధీ పురస్కారముతో సత్కరించడం జరిగింది.డా. యు. వి రత్నo మాట్లాడుతూ తెలుగు భాష కీర్తిని ఉనికిని కాపాడే బాధ్యతలో భాగంగా పాండిచ్చేరిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతీయ పోగ్రామ్ కన్వీనర్ డా. ధనాశి ఉషారాణి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్  అఫ్ పీపుల్ డా. ఉన్నo జ్ఞాన సుందరి  దేవరపల్లి శ్రీనివాస్ రావ్ ఆంధ్రప్రదేశ్ హిందూ శక్తి సేనా భాస్కర్ బాబు కర్ణాటక నేషనల్ మజ్జిరియన్ యూనియన్ జెండ్రల్ సెక్రెటరీ పొట్టు రామకృష్ణ సురేష్ అధ్యక్షులు  తోటబాలకృష్ణ తోలుబొమ్మలాట  కాశీ విశ్వేశ్వరరావు సామజిక వేత్త ముఖ్య అతిధిలు పాల్గొన్నారు
కామెంట్‌లు