కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ, వర్క్ ఎడ్జిస్ట్ మెంట్ పై పాతపొన్నుటూరు యుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు మరో ఘనత సాధించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల ఎనిమిదిన ఆయన రచించిన కవితతో ఈ ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తొలి జానపద సాంస్కృతిక అకాడమీ అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ నేతృత్వంలో కవితా సభ నిర్వహించగా తిరుమలరావు పాల్గొని ఈ గౌరవం పొందారు.
ఆర్ట్- అమరావతి ఫౌండేషన్ ఛైర్మన్ పొట్లూరి హరికృష్ణ నేతృత్వంలో, లహరి మహేందర్ గౌడ్ సమన్వయంతో హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని జాతీయ స్థాయిలో అంతర్జాలం ద్వారా నిర్వహించిన "బేటీ బచావో - బేటీ పడావో" కవితోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న తిరుమలరావును అభినందిస్తూ వారు ప్రశంసాపత్రాన్ని పంపారు. తిరుమలరావు రచించిన అనాదిగా ఆడది అనే కవితలో రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రిబాయిపూలే, మదర్ థెరీసా, కల్పనాచావ్లా, నాగమ్మల వంటి వారి సేవలను త్యాగాలను స్మరించుకుంటూ నేటి మహిళాలోకం ప్రస్థానాన్ని గుర్తెరిగి సమాజం సడవాలని వివరించారు. తిరుమలరావుకు ఆర్ట్ అమరావతి ఫౌండేషన్ ప్రశంసాపత్రం లభించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి