వృద్ధుల సంరక్షణ ఒక సవాల్ :-సి.హెచ్.ప్రతాప్

 భారతదేశంలో జనాభా పరివర్తన జరుగుతున్నందున, వృద్ధుల జనాభా 2025 అంతంనాటికి  నాటికి మొత్తం జనాభాలో 12%కి పెరుగుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ శతాబ్దంలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న వృద్ధ జనాభా సామాజిక మరియు ఆర్థిక సవాళ్లను మరియు  మరియు పలు సామాజిక కారణాల వలన ఆరోగ్య వ్యవస్థపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తుంది.ప్రతి కుటుంబంలో తక్కువ మంది పిల్లలు, సాంప్రదాయకంగా భారతదేశంలో వృద్ధులను చూసుకుంటున్న మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడం, వేగవంతమైన పట్టణీకరణ మరియు అణు కుటుంబాల పెరుగుదల వంటి సామాజిక అంశాలు వైద్య మరియు సామాజిక-ఆర్థిక వృద్ధాప్య సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.దేశం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలలో వృద్ధులకు మెరుగైన సంరక్షణ ఒకటిగా గుర్తించబడింది. ఇందుకు కారణాలు అనేకం. ముళ్యంగా వైద్య రంగంలో వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ లోపిస్తోంది. వైద్య విద్య పాఠ్యాంశాల్లో వృద్ధుల సంరక్షణ ప్రస్ఫుటంగా లేదు. అదేవిధంగా నర్సింగ్ మరియు ఇతర పారామెడికల్ సిబ్బందికి వృద్ధ రోగులకు సంరక్షణ అందించడంలో అధికారికంగా శిక్షణ లేదు. భారతదేశంలోని చాలా వైద్య పాఠశాలల్లో జెరియాట్రిక్స్‌లో ప్రత్యేక శిక్షణ లేదు. జెరియాట్రిక్స్ అనేది తక్కువ ప్రొఫైల్‌లో ఉన్న ప్రత్యేకత, ఇది అకాడెమియాలో కనిపించదు, చాలా తక్కువ మంది దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.దానితో వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సేవలు అనేది ఒక మిధ్యగా మారింది.
సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. నేటి వృద్ధులు తమ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసినవారే. అయినప్పటికీ కుటుంబంలో వారికి సముచిత స్థానం లభించకపోడం బాధాకరం. ఊతకర్రల సాయంతో నడిచే వృద్ధులు వీధుల్లోకి నెట్టివేయబడి అనాథలుగా మిగిలిపోతున్నారు.2004లో వృద్ధుల సమస్యలపై స్పెయిన్‌లో 86 దేశాల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధుల సంక్షేమం, సంరక్షణ కోసం 46 తీర్మానాలు ఆమోదించారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉదాసీనత వల్ల వృద్ధుల సమస్యను సామాజిక సంక్షేమ కోణంలో ఆలోచించకపోవడం శోచనీయం.
దేశంలో ఇటీవల వృద్ధాశ్రమాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వృద్ధాశ్రమాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం మారుతున్న ప్రజల జీవనశైలి అని చెప్పవచ్చు. పూర్వం కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి. అక్కడ పెద్దలను గౌరవించేవారు, వారి పిల్లలు, మనుమలను చూసుకునేవారు. పిల్లలు మంచి ఉద్యోగావకాశాల కోసం దూరమవుతారు. వృద్ధులు ఒంటరిగా, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. దీనికి తోడు చాలా మంది యువకులు ఉద్యోగాల కోసం, తల్లిదండ్రులను వదిలి విదేశాలకు వలసవెళ్తున్నారు. దీని ఫలితంగా వృద్ధులకు సాంగత్యం, సంరక్షణ లభించే వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. అయితే వీటిలో కమర్షియల్ విధానాలే తప్ప వృద్ధాప్యంలో వృద్ధులకు కావలసిన ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు లభించడం లేదు.

ఇటీవల భారత ప్రభుత్వం వృద్ధుల హక్కులను కాపాడే దిశగా గణనీయమైన పురోగతిని తీసుకుంది. 2007లో పార్లమెంటు తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం అని పిలవబడే ఒక బిల్లును ఆమోదించింది, ఇది తల్లిదండ్రులు లేదా సీనియర్ సిటిజన్‌లను పిల్లలు లేదా బంధువుల ద్వారా నిర్వహించడం తప్పనిసరి చేసింది. ఎవరైనా తమ తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యతలను విస్మరిస్తే అది చట్టరీత్యా శిక్షార్హమవుతుందని ఒక శిక్షాస్పదమైన నిబంధనను కూడా అందులో చేచింది. అయితే ఈ చట్టం అమలులో విఫలమయినందున దేశంలో వృద్ధుల సంరక్షణ ఇంకా మిధ్యగానే మిగిలింది.చట్టాలు మరియు విధానాలు మనకు కుటుంబ విలువలను మరియు పెద్దల పట్ల గౌరవాన్ని నేర్పించలేవు. అందువల్ల, లేత వయస్సులో పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందించడంలో తల్లిదండ్రులకు ప్రధాన పాత్ర ఉంది. ప్రత్యేక కోర్సులు మరియు శిక్షణల ద్వారా వృద్ధాప్య సంరక్షణలో ఆరోగ్య నిపుణుల సామర్థ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి మరియు సమాజంలోని వృద్ధులకు సామాజిక-ఆర్థిక మద్దతు విధానాలను అభివృద్ధి చేయాలి.  

కామెంట్‌లు
Popular posts
సింప్లిసిటీ!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం