శ్రీ గురు గీత లోని శ్లోకాలు:
యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురౌ
తస్యైతే కథితా వ్యర్థా ప్రకాశంతే మహాత్మనః
త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధుస్త్వం చ దేవతా
సంసారభీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః
శ్రీ బాపూజీ శాస్త్రి గులావి అను బాబా భక్తుడు 1918 ఫిబ్రవరీలో శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకొని తనతో తెచ్చిన గంగా జలంతో బాబాకు అభిషేకం చేసాడు. అనంతరం శ్రీ సమర్ధ రామదాస స్వామి జన్మ దిన వేడుకలకు హాజరయ్యేందుకు సజ్జన గఢ్ కు వెళ్లెందుకు సాయి అనుమతి కోరాడు. అప్పుడు శ్రీ సాయి నవ్వి" ఇక్కడ వున్నట్లే అక్కడ కూడ నేనే వున్నాను. శుభం. క్షేమం గా వెళ్ళిరా" అని ఆశీర్వదించారు. అనంతరం బాపూజీ సజ్జన్ గఢ్ వెళ్ళాడు. అక్కడ దాస నవమి తిధి నాడు ధ్యానం చేసుకుంటున్న బాపూజీకి శ్రీ సాయి భౌతికంగా దర్శనమిచ్చి ఆశీర్వదించారు. అంతే కాక అతని చేత తన కాళ్ళు కూడా వత్తించుకున్నారు. శ్రీ సాయి యొక్క సేవా ఫలం దక్కించుకున్న బాపూజీ ఎంతటి అదృష్టవంతుడో కదా !
రావు బహద్దూర్ సాఠే శిరిడీ లో ఒక కట్టిస్తుండగా ఒక పెద్ద చెట్టు అడ్డంగా ఉందని భావించిన కూలీలు దానికి ఎడా పెడా నరకబోతుండగా శ్రీ సాయి వచ్చి వారిని వారించారు. " ఆ చెట్టుకు కూడా ప్రాణముంటుంది, దానిని హింసించకండి" అని అన్నారు. తర్వాత వాడా పూర్తి కావస్తుండగా అదే చెట్టు కొమ్మలు అడ్డంగా వచ్చేసరికి, వాటిని తొలగించడానికి అనుమతినివ్వవల్సిందిగా సాఠే కోరినప్పుడు బాగా అడ్డు వచ్చే వాటిని మాత్రమే అది కూడా చాలా సున్నితంగా తొలగించండి" అని అనుమతి ఇచ్చారు శ్రీ సాయి.
యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురౌ
తస్యైతే కథితా వ్యర్థా ప్రకాశంతే మహాత్మనః
త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధుస్త్వం చ దేవతా
సంసారభీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః
శ్రీ బాపూజీ శాస్త్రి గులావి అను బాబా భక్తుడు 1918 ఫిబ్రవరీలో శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకొని తనతో తెచ్చిన గంగా జలంతో బాబాకు అభిషేకం చేసాడు. అనంతరం శ్రీ సమర్ధ రామదాస స్వామి జన్మ దిన వేడుకలకు హాజరయ్యేందుకు సజ్జన గఢ్ కు వెళ్లెందుకు సాయి అనుమతి కోరాడు. అప్పుడు శ్రీ సాయి నవ్వి" ఇక్కడ వున్నట్లే అక్కడ కూడ నేనే వున్నాను. శుభం. క్షేమం గా వెళ్ళిరా" అని ఆశీర్వదించారు. అనంతరం బాపూజీ సజ్జన్ గఢ్ వెళ్ళాడు. అక్కడ దాస నవమి తిధి నాడు ధ్యానం చేసుకుంటున్న బాపూజీకి శ్రీ సాయి భౌతికంగా దర్శనమిచ్చి ఆశీర్వదించారు. అంతే కాక అతని చేత తన కాళ్ళు కూడా వత్తించుకున్నారు. శ్రీ సాయి యొక్క సేవా ఫలం దక్కించుకున్న బాపూజీ ఎంతటి అదృష్టవంతుడో కదా !
రావు బహద్దూర్ సాఠే శిరిడీ లో ఒక కట్టిస్తుండగా ఒక పెద్ద చెట్టు అడ్డంగా ఉందని భావించిన కూలీలు దానికి ఎడా పెడా నరకబోతుండగా శ్రీ సాయి వచ్చి వారిని వారించారు. " ఆ చెట్టుకు కూడా ప్రాణముంటుంది, దానిని హింసించకండి" అని అన్నారు. తర్వాత వాడా పూర్తి కావస్తుండగా అదే చెట్టు కొమ్మలు అడ్డంగా వచ్చేసరికి, వాటిని తొలగించడానికి అనుమతినివ్వవల్సిందిగా సాఠే కోరినప్పుడు బాగా అడ్డు వచ్చే వాటిని మాత్రమే అది కూడా చాలా సున్నితంగా తొలగించండి" అని అనుమతి ఇచ్చారు శ్రీ సాయి.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి