శ్రీ గురు గీత లోని శ్లోకాలు:
గుకారశ్చంధకారస్తు రుకారస్తన్నిరోధకృత్
అంధకారవినాశిత్వాద్గురురిత్యభిదీయతే
కర్మణా మనసా వాచా సర్వదారాధయేత్గురుం
దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జో గురుసన్నిధౌ
ఒకసారి హరిద్వార్ నుండి వచ్చిన ఒక సాధువు శిరీడీలో కొన్ని రోజులున్నాడు. ప్రతీరొజు సత్సంగం జరిగేటప్పుడు బాబా ఎదురుగా వున్న ఒక స్థంబానికి ఆనుకొని కూర్చునేవాడు. బాబా ఎదురుగా కూర్చున్నాను కావూన శ్రీ సాయి యొక్క అనుగ్రహం తనకే ఎక్కువగా లభిస్తుందన్న గర్వం, అహంకారం అతనిలో ప్రవేశించించాయి.ఒకరోజు అతను మశీదుకు రావడం కాస్త ఆలస్యమయింది. ఖాళీగా వుండడం వలన ఒక పాప వచ్చి ఆ స్థలంలో కూర్చుంది. అంతలో ఆ సాధువు వచ్చి ఆ పాపను కసిరి కొట్టి బలంగా లేవదీసాడు.అప్పుడు సాయి కోపంతో "వెళ్ళి మశీదు బయట కూర్చో" అని ఆ సాధువును పంపేసారు.మర్నాడు మళ్ళీ అదే తతంగం నడిచింది. ఆ అమాయకురాలైన పసి పిల్ల మీద జులుం చూపిస్తున్న సాధువును కసిరి కొట్టి పూజా సామానులన్నింటినీ విసిరేసారు శ్రీ సాయి.ప్రతీ రొజు కూర్చున్నంత మాత్రాన ఆ స్థలం సాధువుది కానీ ఆ పాపది కానీ ఎలా అవుతుందనేది సాయి భావం.
ఈ సకల చరాచర సృష్టిలో అణువణువూ ఆ భగవంతునికే చెందినది.ఏదీ మనది కాదు. వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాం, పోయేటప్పుడు కూడా ఖాళీ చేతులతో పోతాం, అటువంటప్పుడు నాదీ నీదీ అన్న మమకారం ఎందుకు ?
సాక్షాత్తు పరమేశ్వరుని అవతారం అయిన శ్రీ సాయినాధుని సన్నిధిలో వుండి కూడా మమకారాలను వదిలెయ్యకపోతే ఇక శిరిడీ యాత్ర నిష్ప్రయోజనం
గుకారశ్చంధకారస్తు రుకారస్తన్నిరోధకృత్
అంధకారవినాశిత్వాద్గురురిత్యభిదీయతే
కర్మణా మనసా వాచా సర్వదారాధయేత్గురుం
దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జో గురుసన్నిధౌ
ఒకసారి హరిద్వార్ నుండి వచ్చిన ఒక సాధువు శిరీడీలో కొన్ని రోజులున్నాడు. ప్రతీరొజు సత్సంగం జరిగేటప్పుడు బాబా ఎదురుగా వున్న ఒక స్థంబానికి ఆనుకొని కూర్చునేవాడు. బాబా ఎదురుగా కూర్చున్నాను కావూన శ్రీ సాయి యొక్క అనుగ్రహం తనకే ఎక్కువగా లభిస్తుందన్న గర్వం, అహంకారం అతనిలో ప్రవేశించించాయి.ఒకరోజు అతను మశీదుకు రావడం కాస్త ఆలస్యమయింది. ఖాళీగా వుండడం వలన ఒక పాప వచ్చి ఆ స్థలంలో కూర్చుంది. అంతలో ఆ సాధువు వచ్చి ఆ పాపను కసిరి కొట్టి బలంగా లేవదీసాడు.అప్పుడు సాయి కోపంతో "వెళ్ళి మశీదు బయట కూర్చో" అని ఆ సాధువును పంపేసారు.మర్నాడు మళ్ళీ అదే తతంగం నడిచింది. ఆ అమాయకురాలైన పసి పిల్ల మీద జులుం చూపిస్తున్న సాధువును కసిరి కొట్టి పూజా సామానులన్నింటినీ విసిరేసారు శ్రీ సాయి.ప్రతీ రొజు కూర్చున్నంత మాత్రాన ఆ స్థలం సాధువుది కానీ ఆ పాపది కానీ ఎలా అవుతుందనేది సాయి భావం.
ఈ సకల చరాచర సృష్టిలో అణువణువూ ఆ భగవంతునికే చెందినది.ఏదీ మనది కాదు. వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాం, పోయేటప్పుడు కూడా ఖాళీ చేతులతో పోతాం, అటువంటప్పుడు నాదీ నీదీ అన్న మమకారం ఎందుకు ?
సాక్షాత్తు పరమేశ్వరుని అవతారం అయిన శ్రీ సాయినాధుని సన్నిధిలో వుండి కూడా మమకారాలను వదిలెయ్యకపోతే ఇక శిరిడీ యాత్ర నిష్ప్రయోజనం
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి