శ్రీ గురు గీత లోని శ్లోకాలు:
సాష్టాంగ ప్రణిపాతేన తతో నిత్యం గురుం భజేత్
భజనాత్స్థైర్యమాప్నేతి స్వస్వరూపమయోభవేత్
దోర్భ్యాం పద్భ్యాం చ జానుభ్యామురసా శిరసా దృశా
మనసా ఉచసా చేతి ప్రణామోష్టాంగ ఉచ్యతే
సాయి భక్తాగ్రేసరుడు అయిన కాకా దీక్షిత్ దసరా నవరాత్రులలో శిరిడీ వచ్చాడు. ఆ రోజులలో శిరీడీ లక్షలాది మంది భక్తులతో కిట కిట లాడుతోంది. ప్రతీవారు తమకు తోచిన పువ్వులు, పండ్లు,మిఠాయిలు, ఖరీదైన నైవేద్యాలతో అక్కడికి వచ్చి శ్రీ సాయిని తమకు తోచిన విధంగా పూజ చేసుకుంటున్నారు. ఒక రోజు దీక్షిత్ కు ఎంత ప్రయత్నించినా శిరిడీ లో పళ్ళు దొరకలేదు.నిరుత్సాహంతొ మశీదుకు వచ్చి సింపుల్ గా పూజ కానిచ్చేసి ఒక పక్కన కూర్చున్నాడు. ఆ రోజు పళ్లు దొరకనందుకు, సాయికి నైవేద్యం సమర్పించనందుకు ఎంతగానో విచారించాడు.ఇంతలో ఒక భక్తుడు వచ్చి శ్రీ సాయికి ద్రాక్ష పళ్ళు సమర్పించుకున్నాడు. శ్రీ సాయి వెంటనే వాటిని భక్తులకు పంచేసారు. బాబా వద్ద ఒక్క పండు కూడా మిగలకపోవడంతో దీక్షిత్ వెంటనే లేచి తనకు ఇచ్చిన పళ్ళన్నిటినీ బాబాకు తిరిగి ఇచ్చేసాడు.బాబా చిరునవ్వుతో వాటిని తీసుకొని ఎంతో తృప్తిగా తిన్నారు. ఆ విధంగా బాబాకు పళ్ళు నైవేద్యంగా సమర్పించాలని, వాటిని బాబా స్వీకరించి ఆరగించాలన్న దీక్షిత్ కోరికను బాబా నెరవేర్చారు.
సాయి నామం అపూర్వం, సాయి ధ్యానం అసామాన్యం, సాయి శరణమే సకల చింతనలను దూరం చేస్తుంది.సమర్ధ సద్గురువు శ్రీ సాయినాధునికి శ్రద్ధ సబూరిలతో సర్వస్య శరణాగతి చేస్తే చాలు మనల్ని అతి దుర్లభమైన ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటించేస్తారు.
సాష్టాంగ ప్రణిపాతేన తతో నిత్యం గురుం భజేత్
భజనాత్స్థైర్యమాప్నేతి స్వస్వరూపమయోభవేత్
దోర్భ్యాం పద్భ్యాం చ జానుభ్యామురసా శిరసా దృశా
మనసా ఉచసా చేతి ప్రణామోష్టాంగ ఉచ్యతే
సాయి భక్తాగ్రేసరుడు అయిన కాకా దీక్షిత్ దసరా నవరాత్రులలో శిరిడీ వచ్చాడు. ఆ రోజులలో శిరీడీ లక్షలాది మంది భక్తులతో కిట కిట లాడుతోంది. ప్రతీవారు తమకు తోచిన పువ్వులు, పండ్లు,మిఠాయిలు, ఖరీదైన నైవేద్యాలతో అక్కడికి వచ్చి శ్రీ సాయిని తమకు తోచిన విధంగా పూజ చేసుకుంటున్నారు. ఒక రోజు దీక్షిత్ కు ఎంత ప్రయత్నించినా శిరిడీ లో పళ్ళు దొరకలేదు.నిరుత్సాహంతొ మశీదుకు వచ్చి సింపుల్ గా పూజ కానిచ్చేసి ఒక పక్కన కూర్చున్నాడు. ఆ రోజు పళ్లు దొరకనందుకు, సాయికి నైవేద్యం సమర్పించనందుకు ఎంతగానో విచారించాడు.ఇంతలో ఒక భక్తుడు వచ్చి శ్రీ సాయికి ద్రాక్ష పళ్ళు సమర్పించుకున్నాడు. శ్రీ సాయి వెంటనే వాటిని భక్తులకు పంచేసారు. బాబా వద్ద ఒక్క పండు కూడా మిగలకపోవడంతో దీక్షిత్ వెంటనే లేచి తనకు ఇచ్చిన పళ్ళన్నిటినీ బాబాకు తిరిగి ఇచ్చేసాడు.బాబా చిరునవ్వుతో వాటిని తీసుకొని ఎంతో తృప్తిగా తిన్నారు. ఆ విధంగా బాబాకు పళ్ళు నైవేద్యంగా సమర్పించాలని, వాటిని బాబా స్వీకరించి ఆరగించాలన్న దీక్షిత్ కోరికను బాబా నెరవేర్చారు.
సాయి నామం అపూర్వం, సాయి ధ్యానం అసామాన్యం, సాయి శరణమే సకల చింతనలను దూరం చేస్తుంది.సమర్ధ సద్గురువు శ్రీ సాయినాధునికి శ్రద్ధ సబూరిలతో సర్వస్య శరణాగతి చేస్తే చాలు మనల్ని అతి దుర్లభమైన ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటించేస్తారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి