సునంద భాషితం :- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయములు -827
"ఉపాయేన హి యచ్ఛక్యం న తచ్ఛక్యం పరాక్రమైః" న్యాయము
*****
ఉపాయేన అనగా ఉపాయము చేత.హి అనగా ఇది.యచ్ఛక్యం అనగా యత్+చక్యం యత్ అనగా ఏది,ఎందుకంటే, ఎక్కడ, ఎప్పుడు, ఎలా.చక్యం అనగా ఏదైనా పనిని సమర్థవంతంగా, తెలివిగా మరియు వేగంగా చేయడం, ఏదైనా పనిని చక్కగా సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం.న అనగా కాదు.తచ్ఛక్యం అనగా తత్+చక్యం ,తత్ అనగా అది.పరాక్రమైః అనగా పరాక్రమముతో అని అర్థము.
 మన పెద్దవాళ్ళు నాలుగు రకాల ఉపాయాలు ఉన్నాయని చెబుతారు.అవి 1.సామము, 2.భేదము, 3.దానము, 4.దండము. వీటికి మరో మూడు కూడా చేర్చి సప్తోపాయములు అంటారు.అవే 5 మాయ, 6.ఉపేక్ష, 7.ఇంద్ర జాలము.
"ఉపాయము చేత సాధించదగిన దానిని పరాక్రమము చూపి సాధించలేము అని అర్థము.
"ఉపాయేన హి యచ్ఛక్యం న తచ్ఛక్యం పరాక్రమైః "న్యాయము ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే "గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తీసుకుని పోకూడదు" అని. ఉపాయంతో లౌక్యంగా తప్పించుకొనే ప్రయత్నం చేయాలి కానీ బలాబలాలు తెలుసుకోకుండా పౌరుషం లేదా పరాక్రమము చూపితే నష్ట పోయేది తొందరపడి పరాక్రమము చూపే వ్యక్తియే.
 సింహం -కుందేలు కథలో కుందేలుకు తెలుసు.తాను పరాక్రమముతో సింహం నుండి తప్పించుకోలేనని.అందుకే అది చక్కని ఉపాయం ఆలోచించి సింహానికి తానే కాకుండా అడవిలో మరో సింహం ఉందని భ్రమింపజేసి సింహం పీడ విరగడ అయ్యేలా చేస్తుంది. తనొక్కతే కాకుండా  మొత్తం జంతువులను రక్షిస్తుంది..
 పొట్టేలు కొండను ఢీకొఃటే గాయాలు పొట్టేలుకే గానీ కొండకు కాదు.ఏ ఉపాయం ఆలోచించకుండా పొట్ఠేలులా తిరగబడితే ,పోరుషం చూపడం వల్ల పొట్టేలుకే నష్టం వాటిల్లింది.కాబట్టి ఉపాయంతో సాధించాల్సిన పనిని పరాక్రమముతో సాధించే సాహసం చేయకూడదు అనే అర్థంతో ఈ న్యాయము చెప్పబడింది.
ఇలాంటిదే మరొక కథ "కాకి- పాము కథ" చెట్టుపైన కాకి గూట్లో గుడ్లు పెట్టుకుంటుంది.చెట్టుకింద పుట్టలో ఉన్న పాము కాకి మేతకు పోగానే గూటిలోకి పాకి గుడ్లను తినేస్తుంది.అది గమనించిన కాకి తాను ఎలాగూ పౌరుషంతో పామును గెలవలేదు అందుకే ఓ ఉపాయం ఆలోచిస్తుంది  ఆ చెట్టుకు దగ్గరలో ఉన్న సరస్సుకు రాజ కుమార్తె చెలికత్తెలు స్నానానికి వస్తారు. వారి నగలు వస్త్రాలు ఒడ్డున పెట్టి స్నానం చేస్తూ ఉంటారు.అది పరిశీలించిన కాకి వాళ్ళు చూసే విధంగా ఓ బంగారు నగను ముక్కున కరుచుకుని వాళ్ళు చూస్తూ వుండగానే పుట్టలో జార విడుస్తుంది. రాజ భటులు వచ్చి పుట్టను పలుగులతో తవ్వడంతో అందులోని పాముకు దెబ్బలు తాకి చనిపోతుంది. అలా కాకి ఉపాయంతో పాము పీడ విరగడ అయ్యేలా చేస్తుంది.
 ఇలా మహాభారతంలో ద్రౌపది కీచకుని నుండి ఎలా ఉపాయంతో తప్పించుకుంటుందో మనకు తెలుసు. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏదైనా సమస్య వస్తే ఉపాయంతో ఆ సమస్యను ఎలా అధిగమించాలో చూడాలి కానీ సమస్య సృష్టించిన వ్యక్తులపై కోపంతో పౌరుషానికి పోతే  ..అలా పోయిన వ్యక్తికే లేనిపోని అనారోగ్యాలు కలుగుతాయి అందుకే మన పెద్దలు "ఉపాయం లేని వాడిని ఊర్లోంచి వెళ్ళగొట్టాలి "అనే మాట కూడా అంటూ ఉంటారు.
కాబట్టి  ఉపాయం ఉండాలి.పంతాలు పట్టింపులు పౌరుషాలకు పోతే జరిగేది నష్టమే.అందుకే ఈ న్యాయమును గమనంలో పెట్టుకొని అపాయాల బారిన పడకుండా ఉపాయంతో బయటపడాలి.

కామెంట్‌లు
Popular posts
సింప్లిసిటీ!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం