మొలక బాలల మాసపత్రిక ఆవిష్కరించిన తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
 హైదరాబాదు లోని బషీర్ బాగ్   ప్రెస్ క్లబ్ లో మొలక బాలల మాస పత్రికను తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు . మొలక సంపాదకులు , సీనియర్ జర్నలిస్టు వేదాంత సూరి ఆధ్వర్యంలో బాలల  కోసం  మొలక గత ;పదేళ్లుగా  నడుపుతున్న సందర్భంగా ఏప్రిల్ మాస మొలక సంచికను  ఆవిష్కరించిన అనంతరం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ బాలల కోసం ఇలాంటి పుస్తకాలు ప్రచురించడం  అభినందనీయమన్నారు  వేదాంత సూరి సీనియర్ జర్నలిస్టు అని 
తమ పత్రికలో కూడా పని చేశారన్నారు. తానూ  బాల్యంలో  పావలా అర్ధరూపాయి పెట్టి చందమామ బాలమిత్ర అనేటువంటి పుస్తకాలు పోస్టులో తెప్పించుకొని చదువుకునేవాళ్లమని గుర్తుచేసుకున్నారు.  మొలక ను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి  అభివృద్ధి లోనికి తీసుకొని  రావాలని ఈ  పత్రికకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు 
ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నెస్ యూనియన్ అధ్యక్షులు విరహత్ అలీ  మాట్లాడుతూ 11 సంవత్సరాల నుండి మొలక పిల్లల కోసం రావడం హర్షించదగ్గ  విషయమన్నారు ఈ కార్యక్రమంలో మొలక ముఖచిత్రానికి బాల ప్రతినిధిగా ఇంటర్వ్యూ  చేసిన చిరంజీవి ఆశ్రితను సన్మానించి జ్ఞాపికతో  అభినందించారు ఈ కార్యక్రమంలో  స్టేట్ జనరల్ సెక్రెటరీ రాం నారాయణ రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి నరేందర్ రెడ్డితెలంగాణ వర్కింగ్ ఎన్ఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తోపాటు సీనియర్ జర్నలిస్టులు వికారాబాద్ జిల్లా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ చారి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జనార్ధన్ ప్రిన్సిపల్ రమణమ్మ మొలక ప్రత్యేక ప్రతినిధి KVM వెంకట్ .  పెద్దెముల్ మండల మాజీ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి

తల్లిదండ్రులు  పాల్గొన్నారు
కామెంట్‌లు