స్ఫూర్తి పిల్లల కథల పుస్తకం స్పూర్తి దాయకం

 పిల్లలచేత కథలు రాయించడమే కాకుండా పోరెడ్డి అశోక్ తాను కూడా పిల్లల కొరకు కథల పుస్తకం రాయడం అభినందనీయమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా గారు అన్నారు. లక్ష్మీపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోరెడ్డి అశోక్ రాసిన " స్ఫూర్తి పిల్లల కథలు " పుస్తకాన్ని కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇదివరకే అశోక్ మార్గదర్శకత్వంలో ఇంత వరకు పిల్లలు రాసిన మూడు పుస్తకాలు ప్రచురించడం జరిగింది. జాతీయ స్థాయి అవార్డులతో పాటు, జాతీయ స్థాయి ఉపకార వేతనాలను విద్యార్థులు పొందారు. ప్రస్తుతం " స్ఫూర్తి పిల్లల కథలు " పుస్తకంలో 12 కథలున్నాయి. ఇది ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన పిల్లల కొరకు పెద్దలు రాసిన మొదటి పుస్తకం కావడం గమనార్హం. ఇందులోని కథలు పిల్లల్లో నైతిక పరివర్తనకు, మార్పుకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఈ కథల పుస్తకాన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా నుంచి మరిన్ని పిల్లల కథల పుస్తకాలు రావాలని ఆశిస్తున్నానని కలెక్టర్ శ్రీ రాజర్షి షా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఏ. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వైద్యశాఖ అధికారి శ్రీ నరేందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి మిల్కా, సెక్టోరల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వైద్యులు పాల్గొన్నారు.
కామెంట్‌లు