సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు-822
"ఈర్ష్యా హి వివేక పరి పంథినీ" న్యాయము
**"***
ఈర్ష్యా అనగా అసూయ, ఆగ్రహము,కసి, క్రోధము, ద్వేషము.హి అనగా కాబట్టి,ఖచ్చితంగా,అందుకని లేదా ఎందుకంటే.వివేచన అనగా తెలివి, జ్ఞానము,మంచి చెడులను వేరు చేసే శక్తి. ప్రి అనగా చుట్టూ,నడుమ, ద్వారా. పంథిని అనగా మార్గం చూపేవాడు లేదా మార్గదర్శి అనే అర్థాలు ఉన్నాయి
ఈర్ష్య వివేకమునకు శత్రువు.ఈర్ష్యాళువుకు యుక్తాయుక్త వివేచనము  ఉండదు అని అర్థము.
 మనకన్నా గొప్ప వారిని చూసి కలిగేది.ఇతరుల ఉన్నతి చూసి ఓర్వలేక పోవడం.వేరొకరికి ఉన్నది మనకు లేనప్పుడు అది వాళ్ళ స్వంతం అయ్యిందని బాధ పడటాన్ని ఈర్ష్య అంటారు.
ఈ ఈర్ష్య అనేది ఒకానొక బలహీనత. ఈర్ష్య ఉన్న వ్యక్తికి ఆనందం ఆమడ దూరంలో ఉంటుంది.
 ఇది మనసును ప్రశాంతంగా ఉండనీయదు. ఎప్పుడూ కలవరపెడుతుంది. మానసిక ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుంది. ఈ ఒక్క ఈర్ష్య అనేక అనర్థాలకు దారి తీస్తుంది.దీనివల్ల మనసులో అసూయ- ద్వేషాలు, అసహనం - అసంతృప్తులు  తిష్ట వేస్తాయి. చిత్తం ఎప్పుడూ అల్ల కల్లోల సంద్రం వలె ఉంటుంది. అంత వరకు తనకు తాను ఇబ్బంది పడటమే కాకుండా ఇతరుల జీవితాలపై ప్రభావం చూపుతుంది.  సహనం లోపించడం వల్ల  ఎవరేమన్నా తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు.
 తనపై తనకు ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది. దానికి కారణం ఇతరులే అన్న భావనతో వారి జీవితాల్లో ప్రవేశించి వారితో గొడవలకు దారి తీస్తుంది. కుటుంబ బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది ద్వేషం,అసూయ పెచ్చు పెరిగి పండంటి జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది."వీరు మొహం ఎప్పుడూ మొట మొటలాడుతూ ఉంటుంది.
ఇలాంటి వారిని ఉద్దేశించి మన పెద్దలు ఉదాహరణగా అలాంటి వారికి కుళ్ళి కుళ్ళి కుడికన్ను - ఏడ్చి ఏడ్చి పోతుందని అంటారు.
 ఈర్ష్య ఉన్న వారిలో యుక్తాయుక్త వివేచనము ఉండదు. ఎదటి వారి ఉన్నతిని, ఎదుగుదలను చూసి తట్టుకోలేక వారిని మాటలతో మానసికంగానూ హింసిస్తారు. మనసును గాయ పరుస్తారు.
 మరి వారిని మార్చడం మనిషి తరమా? అవుతుందో లేదో తెలియదు కానీ మన వంతు ప్రయత్నం మనం చేయాలి.‌ఎంతో దగ్గరి వారితో హితోక్తులు చెప్పించాలని. ఇలాంటి వారికి యోగా, ధ్యానం పరిచయం చేయాలి. వారి  మనస్సుకు నచ్చిన మంచి పనులు చేసేలా చూడాలి. సహనం ఓపిక పెంచుకునేలా చేయాలి.
 ఈమధ్య కాలంలో నేను చదివిన ఓ కథ దీనికి చక్కగా సరిపోతుంది.
ఒకానొక వ్యక్తి బాగా ధనవంతుడు. పిల్లికి కూడా బిచ్చం పెట్టడు. ఎంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలనే కోరికతో.ఓ సాధువు వద్దకు వెళ్ళి  తన జాతకం చూపి ఇంకా సంపాదించ గలనా? చెప్పండి స్వామి అంటాడు.
అప్పుడు సాధువు అతడి చేయిపట్టుకుని చూసి సంపాదించడం మాట దేవుడెరుగు!. నీ ఆయుష్షు ఇంకో వారం రోజులు మాత్రమే అనేసరికి ఆ మనిషిలో పశ్చాత్తాపం. తాను అప్పటి నుంచి అందరితో మంచిగా మాట్లాడుతూ, కోపగించిన వారి వద్దకు వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. ధనాన్ని అవసరమైన వారికి పంచి పెడతాడు.ఎంతో నిశ్చింతగా ఉంటాడు. వెళ్ళి సాధువుతో నాకు మోక్షం ఎప్పుడు దొరుకుతుందో చెప్పగలరా ? అని అడిగితే సాధువు నవ్వి నాయనా ఇప్పుడు నీకు దొరికినట్టే.
 ఇంత కాలం ఈర్ష్యతో వివేకమునకు దూరమై సంపాదన ఆర్జనలో ఎంతో మందిని బాధ పెట్టావు. వారం రోజుల్లో చనిపోతానని తెలియగానే నీలో మార్పు వచ్చింది. మంచి మనిషిగా మారావు. ఇక నుండి ఇదే భావనతో జీవించు, యోగా ధ్యానం చేయమని చెబుతాడా సాధువు.*ఆ విధంగా ఆ వ్యక్తిలో మంచి మార్పు వస్తుంది.
మనము కూడా ఆ వ్యక్తి కథే కాదు రామాయణం భాగవతం,భారతంలో దుర్యోధనుడు , శిశుపాలుడు, శూర్పణఖ లాంటి వారి కథలు కూడా కొంత వరకు ఈ కోవకు చెందినవే.ఈ ఈర్ష్యా హి వివేక పరి పంథినీ"న్యాయము ద్వారా ఎలా ఉండకూడదో మనం తెలుసుకోగలిగాం .

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం