కుంకుమపువ్వు.:-తాటి కోల పద్మావతి

 కుంకుమపువ్వు భారతీయుల జీవితాల్లో విడదీయరాని భాగం. కొన్ని ముఖ్య వంటకాల్లో దీనిని ఉపయోగిస్తారు. అలాగే పుట్టబోయే పిల్లలు ఎర్రగా పుట్టాలంటే పాలలో కుంకుమపువ్వు త్రాగాలని కూడా ఒక నమ్మకం ఉంది. ఏమైనా ప్రపంచంలోనే అత్యుత్తమ కుంకుమపువ్వు మన కాశ్మీర్ ప్రాంతంలోనే పండటం మనకు గర్వకారణం. ఇక్కడ కనిపిస్తున్న పువ్వులు వాటి నుంచి సేకరించిన పుప్పడి దారాలే కుంకుమపువ్వు గా తీసుకుంటారు. 
ప్రపంచంలోనే అనేక దేశాలలో కుంకుమ పువ్వుకు ఆదరణ ఉన్న ప్రస్తుతం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసి ఆదాయం గడిస్తోంది. ఇరాన్ భారత్ లో ఉన్న కుంకుమ పువ్వులకు చాలా డిమాండ్ ఉన్న అవి మన అవసరాలకే సరిపోతాయి కనుక అమెరికా వంటి దేశాలలో అవి దొరకడం లేదు. దాదాపు 3 వేల సంవత్సరాల నుంచి కుంకుమ పువ్వు పండుతోందని ఒక అంచనా. కుంకుమపువ్వు పండాలంటే తడి వాతావరణం ఉండాలి. వర్షపాతం ఎక్కువ కావాలి. అందుకే ఇది అన్ని ప్రాంతాలలో మనకు కనిపించదు. 
ఇంత విలువైన కుంకుమ పువ్వులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. 

కామెంట్‌లు