సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు -832
"ఏకం సంధిత్సతో పరం ప్రత్యవతే"న్యాయము
****
ఏకం అనగా ఒకటి లేక ఒకే.సంధిత అనగా  సంఘం లేదా సంబంధం.తతో అనగా అప్పుడు లేదా తర్వాత . పరం అనగా అత్యున్నతమైనది, ఉత్తమమైనది. ప్రత్యవతే  అనగా నష్టపోవడం లేదా కోల్పోవడం అనే అర్థాలు ఉన్నాయి.
"ఒకటి చేయవలె అనుకుంటే మరొకటి అయినట్లు"."తానొకటి తలిస్తే దైవమొకటీ తలుస్తాడు".ఉదాహరణకు వేద వాక్యముల నుండి పరబ్రహ్మమును సాధించడానికి ఆరంభించి తుదకు వైష్ణవములోనికో, శైవము లోనికో దిగినట్లు"అనగా.*అనుకున్నది జరగకుండా అనుకోనిది జరిగినట్లు.
 నిత్య జీవితంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి. తప్పని సరిగా జరుగుతాయి అనకున్నవేమో జరుగవు.ఊహించనివేమో జరుగుతూ ఉంటాయి. అందుకే "తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది" అంటారు.
ఈ న్యాయమును రెండు కోణాల్లో చూడాలి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడంటే అది మన మంచికే కావచ్చు అని కూడా అనుకోవచ్చు.
ఏదో కొండంత శ్రమ చేస్తే చివరికి ఏమి దక్కకుండా పోవచ్చు.చేసిన కష్టం వృధా కావొచ్చుుౌ.
 దీనిలో  ముఖ్యంగా మనం తలిచింది కాకుండా దైవం ఎందుకు వేరుగా తలుస్తాడో చూద్దాం.
దీనికి సంబంధించిన ఓ చక్కని పద్యం ప్రజాకవి వేమన రాశారు. "లోభ మోహములను ప్రాభవములు తప్పు/ తలచిన పనులెల్ల తప్పి చనుచు/తానొకటి దలచిన దైవమొండగుచుండు/ విశ్వదాభిరామ వినురవేమ!" 
అనగా లోభము , మోహము ఉండేవారికి గొప్పతనం ఉండదు.అటువంటి వారు తలచిన పనులు జరుగవు.అందుకే వాళ్ళు తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడు . అదే వారు అనుకుంటూ ఉంటారు.
మనందరికీ తెలిసిందే చంద్రహాసుడి కథ. చంద్రహాసుడికి విషము నిచ్చి చంపమని అతనికి తెలియకుండా అతని చేతికే ఓ లేఖ ఇచ్చి పంపుతాడు దుష్ట బుద్ధి. చంద్రహాసుడికి ఇదంతా ఏమీ తెలియదు. దానిని ఇవ్వడానికి దుష్ట బుద్ధి రాజ్యానికి వెళ్తూ ఆ ఊరి సరిహద్దుల్లో గల ఉద్యానవనంలో  అలసట వల్ల ఓ చెట్టు నీడన విశ్రమిస్తాడు.
 ఆ వ్యాహ్యాళికి వచ్చిన దుష్ట బుద్ధి కూతురు  చంద్రహాసుడిని, అతని చెంతనే  లేఖ ఉన్న సంచీని చూస్తుంది.అందులో ఏముందో చదువుదామని చూస్తే  అందులో ఇతనికి "విషమునిమ్ము" అని వుంటుంది. ఇది తన తండ్రి దుష్ట బుద్ధితో చేసిన పనేనని గ్రహించి కంటి కాటుక తీసి 'ము' 'య'గా మార్చి ఆ సంచీని యథాతథంగా పెట్టి వెళుతుంది.
అది తీసుకుని దుష్ట బుద్ధి కొడుక్కి ఇస్తాడు. అందులో విషయని ఇవ్వమని రాసి ఉండడంతో   వెంటనే సోదరిని ఆ చంద్రహాసునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు.  ఇందులో దుష్ట బుద్ధి స్వభావం దుష్టమైనది కాబట్టే అతడు అనుకున్నది జరుగలేదు.
ఇక కొందరు అమాయకంగా అనుకున్నది కాకపోయినా వేరేది అంతకంటే మంచిది జరుగుతుంది.
ఇద్దరు సోదరులు ఉంటారు.అందులో ఒకడు బాగా తెలివైన వాడు. మరొకడు అమాయకుడు.  అతని అమాయకత్వం చూసి అతనికి భుక్తికి లోటు లేకుండా ఓ పాత్ర అతడికి అందేలా చేస్తాడు. అతడు భార్య పిల్లలతో సుఖంగా ఉండటం చూసి విషయం  అడిగి, తాను ఏమీ రానట్టు ప్రవర్తిస్తే అతడికి తగిన శాస్తి చేస్తాడు.అలా అమాయకుడు అనుకున్నది అది కాకపోయినా మంచి చేస్తాడు.
ఏది ఏమైనా మంచి కోసం చేస్తే కొంచెం అటూ ఇటూగా మంచే జరుగుతుంది ఒకవేళ జరుగక పోయినా బాధ పడవద్దు అంటూ ఆచార్య ఆత్రేయ గారు రాసిన ఓ పాటలో"అనుకున్నామని జరగవు అన్నీ/ అనుకోలేదని ఆగవు కొన్నీ/ జరిగేవన్నీ మంచికనీ / అనుకోవడమే మనిషి పని/ అంటారు."
 కాబట్టి "ఏకం సంధిత్సతో పరం ప్రత్యవతే న్యాయము" లోని అంతరార్థము గ్రహించి తదనుగుణంగా జీవితాన్ని గడపాలి.చింత వలదని ఇతరుల మనసు నొప్పించకుండా, ఉన్నంతలో బతుకడమే మనిషిగా మనం చేయవలసింది.
వురిమళ్ల సునంద, ఖమ్మం[10:29 pm, 10/04/2025] Sunanda Vurimalla: సునంద భాషితం✍️
న్యాయాలు -831
శలభ న్యాయము
   ****
శలభం అనగా మిడుత.
 "మిడుత దీపమును ఆర్పివేయును " అనే మాటను "దుష్టుడు మంచి వారికి కీడు చేయును" అనే అర్థంతో పోల్చి  మన పెద్దలు ఈ న్యాయమును  ఉదాహరణగా చెబుతుంటారు.
 ముందుగా శలభం గురించి నాలుగు విషయాలు తెలుసుకుందాం.
 మిడత అనేది ఒక రకమైన కీటకము.పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది మామూలుగా అయితే ఎవరికీ హాని చేయదు కానీ ఒకోసారి అన్ని మిడతలు కలిసి అనగా మిడతల దండు కలిసి పంటపొలాలను సర్వనాశనం చేస్తాయి.ఆ సమయంలో మిడతలు లక్షల సంఖ్యలో చేరి పంట పొలాలు, చెట్టు చేమలను చేరి ఒక్క క్షణంలో వాటి ఆకులను తినేస్తాయి. అవి దండుగా ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమవుతుంది.
అలాంటి  మిడతల రకాల్లో ఒకటైన మిడత దీపాన్ని కూడా ఆర్పాలని చూస్తుంది.అందుకే ఈ మిడతను నీచుడు లేదా దుష్టుడితో పోల్చారు. అగ…
[12:37 pm, 11/04/2025] Vedanta Sury: https://www.molakanews.page/2025/04/blog-post_957.html?m=1
[12:47 pm, 11/04/2025] Sunanda Vurimalla: హృదయపూర్వక ధన్యవాదాలు సర్ 🙏
[10:56 pm, 11/04/2025] Sunanda Vurimalla: 🦜 నమస్తే సర్ శుభ రాత్రి 🦜🦜
✍️సునంద భాషితం ✍️
న్యాయములు -832
"ఏకం సంధిత్సతో పరం ప్రత్యవతే"న్యాయము
****
ఏకం అనగా ఒకటి లేక ఒకే.సంధిత అనగా  సంఘం లేదా సంబంధం.తతో అనగా అప్పుడు లేదా తర్వాత . పరం అనగా అత్యున్నతమైనది, ఉత్తమమైనది. ప్రత్యవతే  అనగా నష్టపోవడం లేదా కోల్పోవడం అనే అర్థాలు ఉన్నాయి.
"ఒకటి చేయవలె అనుకుంటే మరొకటి అయినట్లు"."తానొకటి తలిస్తే దైవమొకటీ తలుస్తాడు".ఉదాహరణకు వేద వాక్యముల నుండి పరబ్రహ్మమును సాధించడానికి ఆరంభించి తుదకు వైష్ణవములోనికో, శైవము లోనికో దిగినట్లు"అనగా.*అనుకున్నది జరగకుండా అనుకోనిది జరిగినట్లు.
 నిత్య జీవితంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి. తప్పని సరిగా జరుగుతాయి అనకున్నవేమో జరుగవు.ఊహించనివేమో జరుగుతూ ఉంటాయి. అందుకే "తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది" అంటారు.
ఈ న్యాయమును రెండు కోణాల్లో చూడాలి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడంటే అది మన మంచికే కావచ్చు అని కూడా అనుకోవచ్చు.
ఏదో కొండంత శ్రమ చేస్తే చివరికి ఏమి దక్కకుండా పోవచ్చు.చేసిన కష్టం వృధా కావొచ్చుుౌ.
 దీనిలో  ముఖ్యంగా మనం తలిచింది కాకుండా దైవం ఎందుకు వేరుగా తలుస్తాడో చూద్దాం.
దీనికి సంబంధించిన ఓ చక్కని పద్యం ప్రజాకవి వేమన రాశారు. "లోభ మోహములను ప్రాభవములు తప్పు/ తలచిన పనులెల్ల తప్పి చనుచు/తానొకటి దలచిన దైవమొండగుచుండు/ విశ్వదాభిరామ వినురవేమ!" 
అనగా లోభము , మోహము ఉండేవారికి గొప్పతనం ఉండదు.అటువంటి వారు తలచిన పనులు జరుగవు.అందుకే వాళ్ళు తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడు . అదే వారు అనుకుంటూ ఉంటారు.
మనందరికీ తెలిసిందే చంద్రహాసుడి కథ. చంద్రహాసుడికి విషము నిచ్చి చంపమని అతనికి తెలియకుండా అతని చేతికే ఓ లేఖ ఇచ్చి పంపుతాడు దుష్ట బుద్ధి. చంద్రహాసుడికి ఇదంతా ఏమీ తెలియదు. దానిని ఇవ్వడానికి దుష్ట బుద్ధి రాజ్యానికి వెళ్తూ ఆ ఊరి సరిహద్దుల్లో గల ఉద్యానవనంలో  అలసట వల్ల ఓ చెట్టు నీడన విశ్రమిస్తాడు.
 ఆ వ్యాహ్యాళికి వచ్చిన దుష్ట బుద్ధి కూతురు  చంద్రహాసుడిని, అతని చెంతనే  లేఖ ఉన్న సంచీని చూస్తుంది.అందులో ఏముందో చదువుదామని చూస్తే  అందులో ఇతనికి "విషమునిమ్ము" అని వుంటుంది. ఇది తన తండ్రి దుష్ట బుద్ధితో చేసిన పనేనని గ్రహించి కంటి కాటుక తీసి 'ము' 'య'గా మార్చి ఆ సంచీని యథాతథంగా పెట్టి వెళుతుంది.
అది తీసుకుని దుష్ట బుద్ధి కొడుక్కి ఇస్తాడు. అందులో విషయని ఇవ్వమని రాసి ఉండడంతో   వెంటనే సోదరిని ఆ చంద్రహాసునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు.  ఇందులో దుష్ట బుద్ధి స్వభావం దుష్టమైనది కాబట్టే అతడు అనుకున్నది జరుగలేదు.
ఇక కొందరు అమాయకంగా అనుకున్నది కాకపోయినా వేరేది అంతకంటే మంచిది జరుగుతుంది.
ఇద్దరు సోదరులు ఉంటారు.అందులో ఒకడు బాగా తెలివైన వాడు. మరొకడు అమాయకుడు.  అతని అమాయకత్వం చూసి అతనికి భుక్తికి లోటు లేకుండా ఓ పాత్ర అతడికి అందేలా చేస్తాడు. అతడు భార్య పిల్లలతో సుఖంగా ఉండటం చూసి విషయం  అడిగి, తాను ఏమీ రానట్టు ప్రవర్తిస్తే అతడికి తగిన శాస్తి చేస్తాడు.అలా అమాయకుడు అనుకున్నది అది కాకపోయినా మంచి చేస్తాడు.
ఏది ఏమైనా మంచి కోసం చేస్తే కొంచెం అటూ ఇటూగా మంచే జరుగుతుంది ఒకవేళ జరుగక పోయినా బాధ పడవద్దు అంటూ ఆచార్య ఆత్రేయ గారు రాసిన ఓ పాటలో"అనుకున్నామని జరగవు అన్నీ/ అనుకోలేదని ఆగవు కొన్నీ/ జరిగేవన్నీ మంచికనీ / అనుకోవడమే మనిషి పని/ అంటారు."
 కాబట్టి "ఏకం సంధిత్సతో పరం ప్రత్యవతే న్యాయము" లోని అంతరార్థము గ్రహించి తదనుగుణంగా జీవితాన్ని గడపాలి.చింత వలదని ఇతరుల మనసు నొప్పించకుండా, ఉన్నంతలో బతుకడమే మనిషిగా మనం చేయవలసింది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం