వనజీవి దరిపల్లి రామయ్య సేవలను స్మరించుకోవడం, కొనయాడటంతో ఆగిపోవద్దని, అతని వన స్పూర్తితో ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇటీవల మరణించిన ప్రముఖ పర్యావరణ వేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య సంస్మరణ సభ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. టికే సేవా సంస్థ ఆధ్వర్యంలో డా. రవిశంకర్ ప్రజాపతి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మొదట రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వనజీవి అభిమానులు, ప్రకృతి ప్రేమికులు సాధారణ కుటుంబంలో పుట్టిన రామయ్య మహోన్నత ఆశయంతో ప్రకృతి కోసం, పర్యావరణం కోసం చేసిన అమోఘమైన సేవలను, రామయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వనజీవి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో టికే సేవా సంస్థ బాధ్యులు సంగెం సూర్యారావు, కే లక్ష్మీనారాయణ, నిమ్మలూరి శ్రీనివాస్, అరుణోదయ విమలక్క, సామాజిక కార్యకర్త కేవిఎం వెంకట్, "వనజీవి ప్రయాణం" పుస్తక రచయిత నరేష్ జిల్లా, సినీ దర్శకులు నాని తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే వనజీవి రామయ్యకి సరైన నివాళి
వనజీవి దరిపల్లి రామయ్య సేవలను స్మరించుకోవడం, కొనయాడటంతో ఆగిపోవద్దని, అతని వన స్పూర్తితో ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇటీవల మరణించిన ప్రముఖ పర్యావరణ వేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య సంస్మరణ సభ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. టికే సేవా సంస్థ ఆధ్వర్యంలో డా. రవిశంకర్ ప్రజాపతి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మొదట రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వనజీవి అభిమానులు, ప్రకృతి ప్రేమికులు సాధారణ కుటుంబంలో పుట్టిన రామయ్య మహోన్నత ఆశయంతో ప్రకృతి కోసం, పర్యావరణం కోసం చేసిన అమోఘమైన సేవలను, రామయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వనజీవి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో టికే సేవా సంస్థ బాధ్యులు సంగెం సూర్యారావు, కే లక్ష్మీనారాయణ, నిమ్మలూరి శ్రీనివాస్, అరుణోదయ విమలక్క, సామాజిక కార్యకర్త కేవిఎం వెంకట్, "వనజీవి ప్రయాణం" పుస్తక రచయిత నరేష్ జిల్లా, సినీ దర్శకులు నాని తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి