( నిఘా విభాగం వైఫల్యం పై
ఒక పర్యాటకురాలి హృదయ ఘోష...)
ఓ పాలకులారా...!
ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి..!
టూరిస్ట్ లు విహారయాత్రలకొచ్చేది
ప్రకృతి అందాల్ని తిలకించేందుకు...
ప్రకృతిఒడిలో కాసింత సేదతీరేందుకు...
తీపిజ్ఞాపకాల్ని మూటకట్టుకునేందుకు...
శవపేటికలను మోసుకెళ్లేందుకు కాదు...!
తమ...తమ...భర్తలు...తల్లిదండ్రులు...
తమ కళ్ళముందే రక్తపు మడుగులో
కొనఊపిరితో కొట్టుమిట్టాడూతుంటే...
ఏవైద్యసహాయమందించే నాధుడేలేక...
కడకు తమ చేతుల్లోనే కన్నుమూస్తే...
గుండెలు పగిలేలా ఆ కుటుంబ సభ్యులు
చేసిన ఆర్తనాదాలు అరణ్యరోదనలాయె...
చూసే ఆ చూపుల్లో...రక్తపు ధారలే
తుపాకీ శబ్దాలకు ఆ చెవుల్లో..చిల్లులే
క్షణాల్లో కలిసిపోయె ప్రాణాలెన్నో...గాల్లో
ఓ పాలకులారా...!
చేతులు కాలాక ఆకులు
పట్టుకొని లాభమేమి..?
నిప్పంటుకున్న తరువాత
నీటిని కుమ్మరించి లాభమేమి.?
శత్రువుల కదలికల్ని
కనిపెట్టలేని...పసిగట్టలేని...
నిఘా విభాగం చేతుల్లో ఎన్ని
ఆయుధాలుండి ఏమిలాభం..?
ఈశ్వరుడైనా పట్టలేని
ఇంటిదొంగల్ని ముందు ఖతంచేయాలి
చికిత్స కంటే నివారణే ముఖ్యం కదా..?
నేరం చేసిన వాని...చేతులు కత్తిరించాలి
ఆచేతులకి మద్దతిచ్చినోన్ని మట్టుబెట్టాలి
ప్రోత్సహించిన ప్రతివాడు కఠిన శిక్షకర్హుడే
ఓ పాలకులారా...!
పహల్ గామ్ లోని బైసరిన్
లోయలో 2025 ఏప్రిల్ 22
మంగళవారం మధ్యాహ్నం
మూడు గంటలకు
పర్యాటకులపై జరిగిన
ఉగ్రదాడికి మూలకారణం
పచ్చిక బయళ్లలో
రాలిన ఆ రక్తపు చుక్కల్ని...
పర్యాటకులు
కార్చిన ఆ కన్నీటి ధారల్ని....
ఒక్కసారి అడిగి చూడండి...
ఇంటెలిజెన్స్ వైఫల్యమేమైనా ఉందేమో..?
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి