వేసవి రాకతో ప్రకృతి రంగు మార్చుకుంటుంది. వేసవి అంటే సూర్యుడు మండుటెండతో అగ్ని గోళంగా మారే కాలం. గత కొన్ని సంవత్సరాలుగా వేసవి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకూ వేసవి కాలంగా భావించబడుతుంది. కానీ ఇప్పుడు మార్చిలోనే ఎండలు మండిపోతుండటం, మే నెలలో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకే పైగా ఉండటం వాస్తవంగా కలవరపెడుతున్న విషయం.
వాతావరణ మార్పులు, అడవుల నరికి, శక్తి వనరుల అధిక వినియోగం, పట్టణీకరణ, కాలుష్యం వంటి అంశాలు వేసవి తీవ్రత పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో భూమి ఉష్ణోగ్రత పెరుగుతుండటం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. బహుళ అంతస్తుల భవనాలు, కాంక్రీట్ అడుగంటి రోడ్ల నిర్మాణం వల్ల పచ్చదనం తగ్గిపోయి, ఉష్ణోగ్రత పెరుగుతోంది.ఎండ తీవ్రత కారణంగా శరీరంలో నీరసత, నీరు కోల్పోవడం, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు వేసవి కాలంలో ఎక్కువగా బాధపడుతుంటారు. వ్యవసాయ రంగంపై కూడా వేసవి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నీటి కొరత, భూక్షయం, పంటల నాశనం వంటి సమస్యలు వస్తాయి. జంతుజాలంపై కూడా వేసవి తీవ్ర ప్రభావం చూపుతుంది.
వేసవి తీవ్రతను తగిన జాగ్రత్తలతో ఎదుర్కోవచ్చు. ఎక్కువ సమయం బహిరంగంగా గడపకూడదు. శరీరానికి తేమగా ఉంచేలా ఎక్కువగా నీటిని తీసుకోవాలి. గ్లూకోజ్, పండ్ల రసాలు, మజ్జిగ వంటి ద్రవాలను తీసుకోవడం మంచిది. ప్రభుత్వాలు నీటి వనరుల పరిరక్షణ, నీటి సరఫరా, దుర్వినియోగాన్ని అరికట్టే చర్యలు తీసుకోవాలి. అంతేగాక, ప్రజలు చెట్లను నాటడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటివి అలవాటు చేసుకోవాలి.
వేసవి తీవ్రతతో ఉపాధి కూలీలు సొమ్మసిల్లుతున్నారు. ఎండ తీవ్రతకు నీడ కోసం పరుగులు పెడుతున్నారు. గతంలో పనులు చేసేచోట తాగునీరు, షామియానా ఏర్పాటు చేసేవాళ్లు. ఇప్పుడు ఆ ఏర్పాట్లు లేకపోవడంతో ఎండ తీవ్రతకు చెట్ల నీడన సేదతీరుతున్నారు.శ్రీకాకుళం వంటి ఏజెన్సీ, తీర ప్రాంతాల్లో నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. గార మండలం బందరువానిపేట మహిళలు అర కిలోమీటరుకుపైగా నడిచి మత్స్యలేశం నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అక్కడ అడుగంటిన బావి నీటిని తోడి.. తెస్తున్నారు.నగర శివారులోని త్రోవగుంటలో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. పది రోజులకు ఒకసారి కూడా కొళాయిల నుంచి నీరు రావడం లేదు. ట్యాంకర్ల వద్ద నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. బోర్ల వద్ద అయితే రోజంతా పడిగాపులు కాయాల్సివస్తోంది. కాలనీ వాసులు, గ్రామస్థులు నీటిని నిల్వ చేసుకోవడానికి డ్రమ్ములను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. వేసవి తీవ్రత మన చేతుల్లో ఉండకపోయినా, దాని ప్రభావాన్ని తగ్గించుకోవడం మాత్రం మన వంతు. ప్రకృతిని ప్రేమించాలి, పచ్చదనాన్ని పెంచాలి. ఇలా చేసి మన భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన భూమిని అందించగలుగుతాము.
వాతావరణ మార్పులు, అడవుల నరికి, శక్తి వనరుల అధిక వినియోగం, పట్టణీకరణ, కాలుష్యం వంటి అంశాలు వేసవి తీవ్రత పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో భూమి ఉష్ణోగ్రత పెరుగుతుండటం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. బహుళ అంతస్తుల భవనాలు, కాంక్రీట్ అడుగంటి రోడ్ల నిర్మాణం వల్ల పచ్చదనం తగ్గిపోయి, ఉష్ణోగ్రత పెరుగుతోంది.ఎండ తీవ్రత కారణంగా శరీరంలో నీరసత, నీరు కోల్పోవడం, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు వేసవి కాలంలో ఎక్కువగా బాధపడుతుంటారు. వ్యవసాయ రంగంపై కూడా వేసవి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నీటి కొరత, భూక్షయం, పంటల నాశనం వంటి సమస్యలు వస్తాయి. జంతుజాలంపై కూడా వేసవి తీవ్ర ప్రభావం చూపుతుంది.
వేసవి తీవ్రతను తగిన జాగ్రత్తలతో ఎదుర్కోవచ్చు. ఎక్కువ సమయం బహిరంగంగా గడపకూడదు. శరీరానికి తేమగా ఉంచేలా ఎక్కువగా నీటిని తీసుకోవాలి. గ్లూకోజ్, పండ్ల రసాలు, మజ్జిగ వంటి ద్రవాలను తీసుకోవడం మంచిది. ప్రభుత్వాలు నీటి వనరుల పరిరక్షణ, నీటి సరఫరా, దుర్వినియోగాన్ని అరికట్టే చర్యలు తీసుకోవాలి. అంతేగాక, ప్రజలు చెట్లను నాటడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటివి అలవాటు చేసుకోవాలి.
వేసవి తీవ్రతతో ఉపాధి కూలీలు సొమ్మసిల్లుతున్నారు. ఎండ తీవ్రతకు నీడ కోసం పరుగులు పెడుతున్నారు. గతంలో పనులు చేసేచోట తాగునీరు, షామియానా ఏర్పాటు చేసేవాళ్లు. ఇప్పుడు ఆ ఏర్పాట్లు లేకపోవడంతో ఎండ తీవ్రతకు చెట్ల నీడన సేదతీరుతున్నారు.శ్రీకాకుళం వంటి ఏజెన్సీ, తీర ప్రాంతాల్లో నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. గార మండలం బందరువానిపేట మహిళలు అర కిలోమీటరుకుపైగా నడిచి మత్స్యలేశం నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అక్కడ అడుగంటిన బావి నీటిని తోడి.. తెస్తున్నారు.నగర శివారులోని త్రోవగుంటలో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. పది రోజులకు ఒకసారి కూడా కొళాయిల నుంచి నీరు రావడం లేదు. ట్యాంకర్ల వద్ద నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. బోర్ల వద్ద అయితే రోజంతా పడిగాపులు కాయాల్సివస్తోంది. కాలనీ వాసులు, గ్రామస్థులు నీటిని నిల్వ చేసుకోవడానికి డ్రమ్ములను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. వేసవి తీవ్రత మన చేతుల్లో ఉండకపోయినా, దాని ప్రభావాన్ని తగ్గించుకోవడం మాత్రం మన వంతు. ప్రకృతిని ప్రేమించాలి, పచ్చదనాన్ని పెంచాలి. ఇలా చేసి మన భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన భూమిని అందించగలుగుతాము.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి