టూత్ పేస్ట్:- - యామిజాల జగదీశ్
 టూత్‌పేస్టుతో మ‌హా అయితే ఎవ‌రైనా ఏం చేస్తాం.... ద‌ంతాల‌ను శుభ్రం చేసుకుంటాము.. అంతే క‌దూ... కానీ టూత్ పేస్టు వ‌ల్ల నిజానికి మ‌న‌కు ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. స‌రిగ్గా ఉప‌యోగించుకోవాలే కానీ టూత్ పేస్ట్ మ‌న‌కు చాలా ప‌నుల‌కు ఉపయోగ‌ప‌డుతుంది. మ‌రి దాంతో ఏయే ప‌నులు చేసుకోవ‌చ్చో ఇప్పుడిక్కడ తెలుసుకుందాం.
చ‌ర్మంపై ఏర్ప‌డే ముడ‌త‌లు, మ‌చ్చ‌ల‌ను తొల‌గించి, చ‌ర్మాన్ని బిగుతుగా చేయ‌డంలో టూత్ పేస్ట్ బాగా ప‌ని చేస్తుంది. రాత్రిపూట ముడ‌త‌లు ఉన్న ప్ర‌దేశంపై కొద్దిగా టూత్ పేస్టును రాసి అలాగే వదిలేయాలి. ఉద‌యాన్నే నీటితో క‌డ‌గాలి. ఇలా రోజూ చేస్తే ఫ‌లితం ఉంటుంది. ఎండ వ‌ల్ల కందిపోయిన చ‌ర్మానికి తిరిగి పూర్వ రూపం రావాలంటే టూత్ పేస్ట్ ఉప‌యోగ‌ప‌డుతుంది. కొద్దిగా టూత్ పేస్టు తీసుకుని అందులో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లిపి రాయాలి. కొంచెం సేపు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖ సౌంద‌ర్యం పెరుగుతుంది. మొటిమ‌ల‌పై టూత్ పేస్టును రాసి రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉద‌యాన్నే నీటితో క‌డ‌గాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే ఫ‌లితం ఉంటుంది. స్మార్ట్‌ ఫోన్ తెర‌ల‌ను శుభ్రం చేసేందుకు టూత్ పేస్ట్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. కొద్దిగా టూత్ పేస్ట్‌ను తీసుకుని ఫోన్ స్క్రీన్‌పై రాయాలి. అనంత‌రం శుభ్ర‌మైన వ‌స్త్రంతో తుడ‌వాలి. ఇలా చేస్తే ఫోన్ స్క్రీన్ మెరుస్తుంది. స్క్రాచ్‌లు ఉన్నా అంత‌గా క‌నిపించ‌వు. దుస్తుల‌పై ప‌డే మ‌ర‌క‌ల‌ను తొలగించ‌డంలోనూ టూత్ పేస్ట్ ప‌నిచేస్తుంది. దుస్తుల‌ను ఉతికేముందు మ‌ర‌క‌ల‌పై కొద్దిగా టూత్ పేస్టును రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌ర‌క‌లు తొల‌గిపోతాయి. వెండి, ఇత్త‌డి వ‌స్తువులు పాత‌గా క‌నిపిస్తుంటే వాటిపై కొద్దిగా పేస్టును రాసి అనంత‌రం నీటితో క‌డిగేయాలి. అయినా పాత‌గానే ఉంటే పేస్టును రాశాక ఒక రాత్రంతా అలాగే వ‌స్తువుల‌ను వ‌దిలేయాలి. ఉద‌యాన్నే నీటితో క‌డిగితే పాత్ర‌లు మెరుస్తాయి. బాత్‌రూం సింకుల‌పై పేస్టును రాసి నీటితో క‌డిగేస్తే సింకులు త‌ళ‌తళా మెరుస్తాయి. కాలిన గాయాలు, పురుగు కుట్టిన చోట పేస్టును రాస్తే నొప్పి, మంట నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అద్దాలు మ‌స‌క‌గా క‌నిపిస్తుంటే పేస్టును రాసి శుభ్ర‌మైన గుడ్డ‌తో తుడ‌వాలి. అద్దాలు మెరుస్తాయి. సీడీలు, డీవీడీల‌పై స్క్రాచ్‌లు ప‌డి ప‌నిచేయ‌క‌పోతే టూత్ పేస్టును రాసి శుభ్ర‌మైన గుడ్డ‌తో తుడ‌వాలి. అనంత‌రం డిస్క్‌ లు ప‌ని చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
సింప్లిసిటీ!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
చిత్రం
త్యాగదనుడు అంబేద్కర్: నామ వెంకటేశ్వర్లు, S A తెలుగు , జి. ప. ఉ. పాఠశాల, అయిటిపాముల, కట్టంగూర్ మండలం
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం