ఎండాకాలం. మామిడి చెట్టు విరగ కాసింది. జనాలు మామిడి కాయలను తెంపుకొని పోతున్నారు. చాలా సందడిగా ఉంది. ఆ పక్కనే తుమ్మచెట్టు ఉండి. మామిడి చెట్టు తుమ్మచెట్టును అదేపనిగా హేళన చేయసాగింది. "చూశావా! నేను ఎంత అందంగా ఉన్నానో! నా పళ్ళ కోసం జనం ఎంతగా ఎగబడుతున్నారో! పాపం! నిన్ను చూస్తే జాలి వేస్తుంది. ముళ్లతో అసహ్యంగా ఉన్నావు. నిన్ను పట్టించుకునే వారే లేరు. నా ముందు నువ్వు ఎంత?" అని. రోజు రోజుకూ దాని హేళనలు ఎక్కువైనాయి. అయినా తుమ్మచెట్టు తనలో తాను నవ్వుకుంటూ మౌనంగా ఉంది. కాలమే సమాధానం చెబుతుంది అనుకుంది.
రోజులు గడుస్తున్నాయి. తుమ్మచెట్టుకు అందమైన గిజిగాడు పక్షులు గూళ్ళు కట్టాయి. దారిన పోయే వాళ్ళు, ఆ అందమైన చిట్టి పక్షులను, అవి అందంగా నిర్మించుకున్న గూళ్ళను ఆశ్చర్యంగా చూస్తున్నారు. అబ్బా! నిజమైన పక్షి రాజులు అంటే గిజిగాడులే. బంగారు రంగులో ముద్దుగా ఉండటమే కాదు. ఏ ఇంజనీరుకూ సాధ్యం కానంత అద్భుతంగా గూళ్ళు కట్టుకున్నాయి. ఇలా రకరకాలుగా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒకరోజు ఒక రైతు రైతులకు తుమ్మచెట్లు ఎలా ఉపయోగ పడతాయో సవివరంగా జనాలకు చెప్పాడు. తుమ్మచెట్టు గర్వంగా మామిడి చెట్టు వంక చూసింది. అది ఎండాకాలం కాకపోవడంతో మామిడి కాయలు లేవు. దాన్ని పట్టించుకునే నాథుడే లేడు.
అప్పుడు తుమ్మచెట్టు ఇలా అన్నది. "దేని గొప్ప దానిదే. తన గొప్పను చూసుకొని, మురిసిపోయి, ఇతరులను హేళన చేయవద్దు." అన్నది. మామిడి చెట్టుకు గుణపాఠం కలిగింది.
అణగిన అహంకారం: సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి