పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు, ఆ పాఠశాల నుండి బదిలీ అయిన సందర్భంగా, ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వీడ్కోలు పలుకుతూ ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తిరుమలరావు సేవలను కొనియాడారు. గతేడాది సెప్టెంబర్ 4న పని సర్దుబాటు డెప్యుటేషన్ బదిలీల్లో భాగంగా కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఈ పాఠశాలకు నియామకం పొందిన తిరుమలరావు, తిరిగి నేడు కడుము పాఠశాలలో చేరే క్రమంలో ఈ బదిలీ సన్మానం జరిగింది. ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వ్యవస్థకు తిరుమలరావు గర్వకారణంగా నిలిచారని, తోటి ఉపాధ్యాయులకు ఆయన అనేక అభ్యుదయ అంశాలందు గొప్ప మార్గదర్శకులని అన్నారు.
విద్యార్థులలో చదువుల స్థాయిని పెంచేందుకు నిరంతరమూ కృషి చేయుటతో పాటు, వారిలో అంతర్గతంగా దాగివున్న సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించుటతో పాటు, పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి తిరుమలరావు ఎంతగానో శ్రమించారని ఉపాధ్యాయులంతా ప్రసంగించారు. విద్యార్థులు పతివాడ హరిణి, గంగు మణి, గేదెల బాలకృష్ణలు ప్రసంగాలలో తిరుమలరావు అందించిన స్ఫూర్తిని వివరించారు. అనంతరం
ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖరం, బూడిద సంతోష్ కుమార్, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావులు శాలువా, జ్ఞాపికలతో తిరుమలరావును ఘనంగా సన్మానించారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి