పాతపొన్నుటూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ

 విద్యార్థులతోపాటు గ్రామ పౌరులను కలుపుకుని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ నిర్వహించి, అందరిచే ప్రతిజ్ఞ గావించామని పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు తెలిపారు. 
రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రం వలన వాతావరణ కాలుష్య నివారణ కాగల్గునని, ప్రాణవాయువు పెంపొందునని, కాబట్టి విరివిగా మొక్కలు నాటాలని అన్నారు. ఉపాధ్యాయులు అందవరపు రాజేష్ మాట్లాడుతూ పుట్టినరోజు వంటి శుభ కార్యక్రమాలలో మొక్కలు నాటే సత్సాంప్రదాయం అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు చెట్లే చెలిమి కలిమి బలిమి అంటూ స్వీయ గీతాన్ని ఆలపించారు. ఉపాధ్యాయులు బూడిద సంతోష్ కుమార్ భూమమ్మా ధాత్రమ్మా అంటూ నేలతల్లి విలువ చాటుతూ స్వీయ కవితను వినిపించారు. ఉపాధ్యాయులు పైసక్కి చంద్రశేఖరం ర్యాలీలో పలు నినాదాలు పలికారు. ఉపాధ్యాయని యిసై సౌజన్యవతి, ఉపాధ్యాయులు బొమ్మాళి నాగేశ్వరరావులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమ విశిష్ఠతను వివరించి అందరికీ అవగాహన పరిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు, యువత, గ్రామ పౌరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కామెంట్‌లు