సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు-828
"ఋణ వ్రణ కలంకానాం కాలే లోపో భవిష్యతి"న్యాయము
*****
ఋణం అనగా అప్పు.వ్రణం అనగా పుండు. కలంక  అనగా నింద, మరక,మచ్చ,నలుపు గుర్తు,చెడ్డ పేరు.కాల అనగా నలుపు,సమయము,తగిన సమయము,అదను,ఋతువు, పరమాత్మ, భాగ్యము, కనుపాప,కోయిల,శని, శివుడు.లోపః అనగా తీసుకుని పోవుట,నాశము,తొలగించుట,అగపడకుండుటహింస విడిచి వేయుట.భవిష్యతి అనగా భవిష్యత్తు, రాబోయే కాలము, భవిష్యత్తులో జరుగబోయేది అని అర్థము.
అప్పు, పుండు,నింద ఇవి ఒకప్పుడు (తగిన కాలము వచ్చినప్పుడు) సమసిపోతాయి"అని అర్థము.
మప పెద్దవాళ్ళు తరచుగా "ఋణ శేషము,వ్రణ శేషము, శత్రు శేషము ఉండకూడదు" అనే సామెత చెబుతుంటారు.
ఋణము అంటే అప్పు, వ్రణము అంటే గాయము, నింద ఇవి మూడు కూడా ఒకే విధంగా బాధ  పెడతాయి.నష్టాన్ని కలిగిస్తాయి.కష్టాలను తీసుకుని వస్తాయి. ఒకసారి అప్పు తీసుకుంటే  అది మనసుకు అయిన గాయంలా తీరేదాకా భారమై వెంటాడుతూనే ఉంటుంది. అలాగే ఒంటిమీద అయిన గాయం కూడా తగ్గేంత వరకు సలుపుతూనే ఉంటుంది. ఇక నింద. నింద అంటేనే చేయని తప్పుకు అవమానం పొందడం, శిక్ష పడటం. అలాంటి నింద నిజం నిరూపితం అయ్యేంత వరకూ  మనిషిని నిద్ర పోనీయదు.అవమాన భారంతో కృంగ తీస్తుంది. కాబట్టి ఈ మూడు మనిషికి మరణావస్థ వంటివి. ఇలాంటి వాటిని వెంటనే తీర్చేసుకోవాలి. పోగొట్టుకోవాలి.
ఋణ,వ్రణ,కలంకాలను వెంట వెంటనే తొలగించుకోక పోతే... అందులో ఋణ శేషము అంటే ఎవరికైనా బాకీ పడటం. తీసుకున్న అప్పు తిరిగి వెంటనే చెల్లించకుండా వుండిపోతే అది లోలోపల అగ్ని పర్వతంలా బాధ రగులుతూనే ఉంటుంది.ఆకాశమంత పెరుగుతూనే ఉంటుంది.అందుకే మన పెద్దలు ఋణ శేషము అస్సలు ఉంచుకోకూడదు అంటుంటారు.
 ఇక వ్రణం . వ్రణం అంటే పుండు, గాయం. "నరం మీద పుండు నడమంత్రపు సిరి" మనిషిని నిలకడగా ఉండనీయవు అంటారు. పుండు సలుపుతూ, విపరీతంగా బాధ పెడుతుంది.కాబట్టి దానిని వెంటనే తగ్గించుకోవాలి.
ఇక కలంకం. కలంకం అంటే వ్యక్తికి వచ్చే చెడ్డ పేరు. ఒకోసారి వచ్చిన చెడ్డ పేరు మళ్ళీ‌ పోదు అంటారు. నీలాపనిందలు అనగా మన ప్రమేయం అసలే లేకుండా వస్తుంటాయి.  సాక్షాత్తూ శ్రీకృష్ణుడు అంతటి వాడికే నీలాపనిందలు తప్పలేదు.కాబట్ఠీ దీనికి మనం మానసికంగా సిద్ధమై, ఎప్పటికైనా నిజం తెలుస్తుంది.అనే మనో స్థైర్యంతో ఉండాలి.అది తెలిసేలా చేయాలి .
దీనికి సంబంధించిన నరసింహ సుభాషితాన్ని చూద్దామా...
"ఋణ శేషోగ్ని శేషశ్చ శత్రుశేషస్త థైవ చ!/పునః పునః ప్రవర్ధన్తే తస్మాచ్ఛేషం న రక్షయేత్!!"
అనగా ఋణ శేషము, అగ్ని శేషము,శతృ శేషము ఉంచరాదు.అవి మరల మరల వృద్ధి పొందుతూ ఉంటాయి.అందు వల్ల వాటి యొక్క శేషాన్ని మిగల్చకూడదు.
అప్పు లేదా ఋణం తీసుకోవడం సహజమే.ఒకోసారి అవసరాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ అప్పు/: ఋణము సరియైన కాల పరిమితిలో తీర్చి వేయడం విద్యుక్త ధర్మం.ఆ విధంగా తీర్చిన అప్పులో ఏ కొంచెం మిగిలి పోయినా  అది కూడా ఇంతింతై అన్నట్టుగా పెరిగిపోతుందనేది అప్పు తీసుకున్న వ్యక్తులు గమనంలో పెట్టుకోవాలి.
 అగ్ని శేషము కూడా అంతే. పూర్వము కట్టెల పొయ్యి మీద వంటలు చేసేవాళ్ళు. అయితే వంట పూర్తి చేసిన తర్వాత పొయ్యిలో మిగిలిన నిప్పు రవ్వలపై కానీ కట్టెలపై కానీ నీళ్ళు చల్లి సరిగా చల్లార్చకపోతే ఇ అగ్ని రవ్వలు రగిలి గాలికి ఎగిసి ఇళ్ళ మీద పడి ఇళ్లు కాలిపోయిన సందర్భాలు మనం చాలా సార్లు విన్నాం.అలాగే సిగరెట్ లాంటివి తాగి విసిరేసిన నిప్పుతో అడవులే కాలిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి నిప్పును శేషం లేకుండా పూర్తిగా చల్లార్చాలి.
 ఇక శత్రు శేషము అంటే శత్రువులు లేకుండా వారిని చంపి వేయడం కాదు. వారితో ఉన్న వైరాన్ని పోయేలా చేసుకోవాలి.అంతే గానీ కత్తులు నూరుకునేలా ఉండకూడదు అని అర్థము.
విష్ణు శర్మ సంస్కృత భాషలో రచించిన పంచతంత్ర గ్రంథములోని "కాకోలూకీయం" అనే విభాగంలో కూడా ఇవే విషయాలను ప్రస్తావిస్తూ ఓ శ్లోకం ఉంది.
"ఋణశేషాంచాగ్ని శేషం శత్రు శేషం చ!/వ్యాధి శేషంచ నిశ్శేషం కృత్వా ప్రాజ్ఞో న సీదతి!!
అనగా ఋణ శేషము, అగ్ని శేషము, శతృ శేషము, వ్యాధి శేషము అనే నాలుగు శేషాలు పోగొట్టుకుని జ్ఞాని అయిన వాడు దుఃఖాన్ని పొందడు ఆనందంగా ఉంటాడు అని భావము.
ఇలా ఇవన్నీ ఎంత త్వరగా శేషం లేకుండా కలంకంతో సహా ఎంత త్వరగా పోగొట్టుకుంటాడో, ఆ వ్యక్తి నిశ్చింతగా  ఆనందంగా జీవితాన్ని గడుపుతాడు. ఏ ఒక్క దానిపట్ల అశ్రద్ధ వహించినా ఆయా వ్యక్తులు మానసిక ఒత్తిడి, శారీరక అనారోగ్యానికి గురి కాక తప్పదు.
 కాబట్టి ఈ "ఋణ వ్రణ కలంకానాం కాలే లోపో భవిష్యతి" న్యాయము లోని అంతరార్థము గ్రహించి, తదనుగుణంగా జీవితాన్ని గడపాలి.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం