రంగ, సోము ఒకే తరగతి చదువుతున్నారు. సోము చాలా లావుగా ఉంటాడు. వేగంగా నడవలేడు. రంగ వాళ్ళ స్కూలులోనే రన్నింగ్ ఛాంపియన్. ఒకసారి రంగ సోముతో పరుగు పందెం కాస్తాడు. సోము దానిని అవమానంగా భావించి, ఒప్పుకోడు. కానీ రంగ వదలి పెట్టడం లేదు. "నేను గెలిస్తే నువ్వు నాకు ఏమీ ఇవ్వనక్కర లేదు. నువ్వు గెలిస్తే నీకు నేను 5 వేల రూపాయలు ఇస్తా." అన్నాడు. 5 వేల రూపాయల కోసం కాదు. తాను ఎలాగూ గెలవలేడు. కానీ రంగ నస భరించలేక ఒప్పుకున్నాడు సోము.
రెండు కిలోమీటర్ల మేర పరుగు పందెం. రంగ వేగంగా పరుగెత్తడం ప్రారంభించాడు.సోము చాలా నిదానంగా ప్రారంభించి, ఎక్కడో వెనుకబడ్డాడు. దారిలో వాసు ఒక చెట్టు కింద కూర్చుని, సెల్ ఫోన్ చూస్తున్నాడు. రంగకు సెల్ పిచ్చి చాలా ఉంది. వాసు పక్కన చేరి తనకు కాసేపు సెల్ ఫోన్ ఇవ్వమని బతిమాలాడు. సోము చాలా నిదానంగా నడుస్తాడు. ఇంకో గంట అయినా సోము గమ్యం చేరడని రంగ నమ్మకం. సెల్ ఫోన్లో మునిగి పోయి, గంటల తరబడి టైం పాస్ చేస్తున్నాడు. 3 గంటలు గడిచాయి. ఆ తర్వాత పందెం విషయం గుర్తుకు వచ్చింది. శరవేగంగా పరుగెత్తాడు. సోము గమ్యం చేరి చాలాసేపు అయ్యింది. రంగ సిగ్గుతో తల దించుకున్నాడు. 5 వేలు ఇచ్చుకోవాల్సి వచ్చింది.
పరుగు పందెం: సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి