ఆరోగ్యం విషయంలో తాగు నీరు పాత్ర ఎంతో ముఖ్యమైనది. వాహనం నడువాలంటే ఇంధనం ఎంత అవసరమో మనిషి శరీరం పనిచేయడానికి నీరంత అవసరం. అందులోనూ పరగడుపున గోరు వెచ్చని నీళ్లు తాగటం మరింత మేలు చేస్తుంది.
పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల కలిగే మేలును పరిశీలిద్దాం. ఉదయం లేచిన వెంటనే మంచినీళ్లు తాగితే మల విసర్జన సులభంగా జరుగుతుంది. పరగడుపున నీళ్లు తాగటం వల్ల ఒంట్లో పేరుకుపోయిన వ్యర్ధాలు ఏ రోజుకారోజు బయటికి వెళ్లిపోతాయి. పెద్ద పేగు శుభ్ర పడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. రక్త వృద్ధి, శుద్ధి జరిగేందుకు ఉదయం తాగే నీరు ఉపయోగపడుతుంది. కండరాలు బలపడి, చక్కగా పెరిగేందుకు తగినంత నీరు తాగటం అవసరం. జీవక్రియల పనితీరు సగటున 24 శాతం మేర పెరుగుతుంది. బరువు తగ్గే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. చర్మం సహజంగా, తగినంత తేమతో, మృదువుగా మారుతుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు తక్కువ. ఒకవేళ అలా ఇన్ ఫెక్షన్లు వచ్చినా వెంటనే తగ్గుతాయి. ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి. కనుక నీళ్ళెంత ముఖ్యమో తెలిసింది కదూ.
పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల కలిగే మేలును పరిశీలిద్దాం. ఉదయం లేచిన వెంటనే మంచినీళ్లు తాగితే మల విసర్జన సులభంగా జరుగుతుంది. పరగడుపున నీళ్లు తాగటం వల్ల ఒంట్లో పేరుకుపోయిన వ్యర్ధాలు ఏ రోజుకారోజు బయటికి వెళ్లిపోతాయి. పెద్ద పేగు శుభ్ర పడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. రక్త వృద్ధి, శుద్ధి జరిగేందుకు ఉదయం తాగే నీరు ఉపయోగపడుతుంది. కండరాలు బలపడి, చక్కగా పెరిగేందుకు తగినంత నీరు తాగటం అవసరం. జీవక్రియల పనితీరు సగటున 24 శాతం మేర పెరుగుతుంది. బరువు తగ్గే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. చర్మం సహజంగా, తగినంత తేమతో, మృదువుగా మారుతుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు తక్కువ. ఒకవేళ అలా ఇన్ ఫెక్షన్లు వచ్చినా వెంటనే తగ్గుతాయి. ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి. కనుక నీళ్ళెంత ముఖ్యమో తెలిసింది కదూ.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి