మాయా చెరువు:- /- గంగ నిఖిల్- ఏడవ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-అనంత సాగర్,సిద్దిపేట జిల్లా
 రంగన్న పేట అనే ఊరిలో ఒక చెరువు ఉన్నది. ఆ ఊరిలో ఒక పెద్ద చెరువు ఉన్నది.అందులో చేపలు చాలా ఉన్నాయి.ఒక రోజు జాలర్లు చేపలు పట్టడానికి చేరువులోనికి వెళ్ళారు.ఎవరికి ఒక్క చేప కూడా పడలేదు.చేపలు ఎన్నో ఉన్నా కూడా వలలోకి ఒక్క చేప రాలేదు.గాలానికి కూడా ఒక్క చేప చిక్కలేదు.
   తర్వాత రోజు కూడా జాలర్లు చెరువులోకి వెళ్ళారు. ఆ రోజు కూడా ఒక్క చేప పడలేదు.ఇది మాయా చెరువు అని భయపడి జాలర్లు చేపలు పట్టడానికి వెళ్ళలేదు.కొన్ని నెలలు గడిచాయి.జాలర్లు చెరువులోకి చేపల కోసం మళ్ళీ వెళ్ళారు. అప్పుడు కూడా చేపలు పడలేదు. ఈ విచిత్రం చూసి జాలర్లు పట్టణం వెళ్ళి పెద్ద పెద్ద వలలు తెచ్చి చెరువులో వేసారు.వలలు మాయమైనవి. జాలర్ల పడవలు కూడా మునిగాయి.
     జాలర్లు భయపడినారు. అతి కష్టంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. చెరువులో ఏదో అద్భుత భూతం ఉందని జాలర్లు అనుకున్నారు. చెరువులో చేపలు పట్టడం మానుకున్నారు. తమ ప్రాణాలు కాపాడిన చెరువుకు చేపలు కృతజ్ఞతలు చెప్పాయి.


కామెంట్‌లు