పుస్తకప్రపంచం 43 : - సేకరణ : - అచ్యుతుని రాజ్యశ్రీ

 క్రీ.పూ.300లో యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్ అనే టెక్ట్స్ బుక్ నేటికీ సుప్రసిద్ధం.ప్రింటింగ్ ఆవిష్కరణ తర్వాత వెయ్యి ఎడిషన్స్ గా వచ్చిన ఏకైక పుస్తకం.ఒకప్పటి ఆంగ్ల నవల,కథలు,సాహిత్యం అంతా ఆనాటి రాజకీయ సామాజిక ప్రజాసమస్యలను కళ్లకు కట్టినట్లు చూపేవి. వాస్తవికత కు దర్పణాలు.అలాంటివి శాశ్వతంగా నిలుస్తాయి. బోరిస్ పాస్టర్నక్ రాసిన డాక్టర్ ఝివాగో అలాంటి అద్భుత నవల.రష్యన్ విప్లవం ఆనాటి సమాజం,చరిత్ర, సోషలిజం మార్క్సిజం ఆనాటి ప్రాచీన ఆచారవ్యవహారాలకు ,కాలంతో సంఘర్షణ అన్నీ ఈనవలలో చిత్రించాడు రచయిత. హీరో యూరీ ఝివాగో  కవి,వైద్యుడు.ఇక ప్రకృతివర్ణన కూడా ఆకర్షిస్తుంది.అందుకే రష్యన్ నవలలు అంత పాపులర్ అయ్యాయి.ఫ్రెంచ్ రచయిత అలెగ్జాండ్రె డ్యుమాస్ రాసిన దికౌంట్ ఆఫ్ మాంటె క్రిస్టో చారిత్రక ప్రాధాన్యత సాహసకృత్యాలతో నిండిన నవల.19వశతాబ్దిలో రోమ్ పారిస్ ల స్థితిగతులు ఆనాటి పరిస్థితులను కళ్లముందు సాక్షాత్కరింపజేసిన పుస్తకం.ఎడ్మండ్ డాంటే అనే యువ నావికుడు అన్యాయంగా 14ఏళ్లు జైల్లో బంధింపబడ్తాడు.మెడిటరేనియన్ ఐలాండ్ (మాంటెక్రిస్టో) లో సంపద దాచిపెట్టబడింది ఉందని తోటి ఖైదీ చెప్పడంతో డాంటే లోఉత్సాహం ఉబికింది. జైలు నుంచి తప్పించుకొన్న అతను ఆసంపదను శోధించి సాధించి చేజిక్కించుకుంటాడు. తన పేరును కౌంటాఫ్ మాంటే క్రిస్టో గా మార్చుకుని శత్రువుల పని బడ్తాడు. నెపోలియన్ పాలన అంతం ఐన తర్వాత 1840లో ఫ్రాన్స్ దేశ పరిస్థితులకు యథార్థమైన కథారూపం ఈనవల. అన్ని రకాల గరంమసాలాలు దట్టించి ఆనాటి రచయితలు కొన్ని ఏళ్లు కలంతో మేధోమధనం సాగించిన రచనలు కాబట్టే నేటికీ విశ్వవ్యాప్త రచనలుగా రాణిస్తున్నాయి.🌹
కామెంట్‌లు