పుస్తక ప్రపంచం46:- సేకరణ:- అచ్యుతుని రాజ్యశ్రీ

 ది వన్ స్ట్రారెవల్యూషన్ రాసిన జపాన్ రైతు వేదాంతి మసనోబు ఫుకువోకా,సహజంగా వ్యవసాయంలో పంట పండించే విధానాలవివరణ ఇచ్చారు.పొలం దున్నకుండా రసాయనాలు వాడకుండా ఎరువులతో పనిలేక పంటపండించిన మేధావి.ఈపుస్తకంలో తన జీవిత చరిత్ర ను వర్ణిస్తూ వ్యవసాయ టెక్నిక్స్ ని బోధపరిచాడు ఆయన. వ్యవసాయ విప్లవంతెచ్చిన ఆపుస్తకం25కి పైగా భాషల్లో అనువదింపబడింది.స్వాతంత్య్రం వచ్చాక కొన్నాళ్ల పాటు నీతినిజాయితీ పాపభీతి జనాల్లో ఉండటంతో ఆనకట్టలు పర్యావరణ పరిరక్షణ బాన్ ఉండేది.ఈ10ఏళ్లలో గాదెకింద పందికొక్కుల్లాగా అన్ని శాఖల తో పాటు న్యాయ శాఖ గూడా అవినీతికూపంలో దిగి దేశపురోభివృద్ధికి చిల్లులు పెడుతోంది.ఆంగ్ల నాటకాల్లో షేక్స్పియర్ రాసిన హామ్లెట్ అతి పెద్ద  ట్రాజెడీ నాటకం.1601_ 1602మధ్య రాసిన విషాదాంతక నాటకం.అధికారం ప్రతీకారం ప్రేమ మోసం పోరాటాలు ఆరాటాలు తో ప్రేక్షకులను పాఠకులను అలరించిన నాటకం.ప్రసిద్ధ రోమన్ కవి వర్జిల్ తను చనిపోయేముందు ఓమాట చెప్పాడు"నేను రాసిన ఏనీడ్ రాతప్రతిని తగలబెట్టండి. నేను అంతబాగా రాయలేకపోయాను."🌹
కామెంట్‌లు