ఇరవై లోనే అరవైకి:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం.
నేటి సమాజాన 
నూనూగు మీసాలు కూడా రాని యువత
మగవారితో సమానంగా మాకు హక్కులు కావాలని
అన్ని రంగాలలో దూసుకుపోతున్న మహిళలు
విద్యావిహీనులే గాక విద్యావంతులమని
నైతికవిలువలు చెప్పే  
కుటుంబ సభ్యులే కాదు
ప్రజాప్రతినిధులు

పొగాకు ఉత్పత్తుల సంబంధిత  వాటి బారినపడి
కన్యాశుల్కం లో గిరీశం చెప్పినట్లు
"పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్" అని
చుట్ట, సిగరెట్, బీడీ, పేరు ఏదైనా పొగాకు బారిన పడి
భయంకర క్యాన్సర్ వ్యాధి బారిన పడి
కన్నవారికి, కట్టుకున్న వారి కడుపు కోతకు కారణమై
ముఖ్యంగా యువత ఇరవై లోనే అరవైగా మారి జీవచ్చవాలలా జీవించడం
ఎంతవరకు సమంజసం
పరమాత్ముడిచ్చిన యుక్తాయుక్త విచక్షణతో అలోచించండి
మత్తు పదార్థాలకు బానిసలుగాక 'శతమానం భవతిగా' జీవించి
సమాజాభివృద్దికి తోడ్పడదాం
వసుదైకానికే ఆదర్శంగా నిలుద్దాం....!!

(మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వ్రాసినది)
...............................


కామెంట్‌లు