అక్షరమే గర్జించే మహా ప్రస్థానం శ్రీశ్రీ పంథా

 తాను రచించిన అక్షరాలు తూటాలై పేలుతాయని, గర్జించే 
ప్రజా చైతన్యమని, ప్రగతికి నాంది పలికిన మహాప్రస్థానం శ్రీశ్రీ రహదారని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, నంది పురస్కార గ్రహీత శాసపు సత్యనారాయణ అన్నారు.
కంచరాం ప్రజా గ్రంథాలయం ఆవరణలో నిర్వహించిన శ్రీశ్రీ జయంతి వేడుకల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశ్రీ నేర్పు, ఓర్పు, ఓదార్పు, మార్పు దిశగా నడిపించాయని అన్నారు. 
ప్రజా గ్రంథాలయం అధ్యక్షులు పొదిలాపు శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో తొలుత శ్రీశ్రీ చిత్రపటానికి శాసపు సత్యనారాయణ, జాతీయ స్థాయి ఉత్తమ యువజన పురస్కార గ్రహీత పెంకి చైతన్య కుమార్ లు పూలమాలాలంకరణ చేసి నివాళులర్పించారు. 
ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శాసపు సత్యనారాయణ, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు, శతాధిక వ్యాసకర్త పిల్లా తిరుపతిరావు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పెంకి చైతన్య కుమార్, సైన్స్ ఉపాధ్యాయులు పండూరు వేణుగోపాల్, మాణిక్యం దుర్గారావు పాల్గొని ప్రసంగించారు. కుదమ తిరుమలరావు శ్రీశ్రీ గీతాలును ఆలపించారు. గ్రంథాలయ పాఠకులు రఘుమండల శ్రీనివాస నాయుడు, అరటికట్ల ఉదయ కిరణ్, పతివాడ లలిన్ కుమార్, పొట్నూరు హేమంత్ కుమార్, రుంకాన లోకేష్, సామంతుల పవన్ కుమార్, చల్లపల్లి చంటి, సామంతుల లోకేష్, పొట్నూరు లోకేష్, మాణిక్యం పార్వతీశం, ఒట్టి కన్నారావు, కెంగువ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు