శాస్త్ర సాంకేతికత పెరిగిందనిప్రపంచమంతా అరచేతిలోనే చూస్తున్నామనిసముద్ర గర్భంలోకి అంతరిక్షంలోకిపురుషులతో సమానంగా స్త్రీలు అభివృద్ధి చెందారనివసుదైకాన ప్రజలంతా సోదర సమానులనియుక్తాయుక్త విచక్షణ ఉందనిచెబుతున్న ఓ మనిషీనేడు సమాజాన జరిగే అరాచకాలే కాదుమానవత్వం మరచి మరణ మృదంగానికి కారణమవుతున్నఒకదేశం పై వేరొక దేశపు ఆధిపత్యం కొరకు జరిగేయుద్ధవాతావరణంలో వేలాదిమందిధన మాన ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనపరిస్థితులు చూస్తుంటేరాతియుగపు సమాజమే నయమనిపిస్తోంది.భర్తను కోల్పోయి భార్యతల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలైన పిల్లలు ఎంతో కష్టపడి నిర్మించిన భవనాలు విద్యాలయ ప్రయోగశాలలు నాశనమయి మరుభూమిలు గా మారుతుండడం చూస్తేశాంతి దూతలు ఏసుక్రీస్తు, మహాత్మా గాంధీ, మహమ్మద్ ప్రవక్త వంటిమహనీయులు కోరుకున్నది ఇప్పటికైనా నెరవేరిందాఏమిటీ యుద్ధోన్మాదం?దీనికి అంతమెప్పుడువిజ్ఞులు, ప్రాజ్ఞులు ఒక్కసారి ఆలోచించండి.!!( నేడు రష్యా, ఉక్రేయన్ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే బంగ్లాదేశ్ లో మత విద్వేషం , మారణ కాండ ఎన్నో ప్రపంచాన జరుగుతున్న సంఘటనలు చూసి ఆర్ద్రతతో వ్రాసినది).........................
ఏమిటీ యుద్ధోన్మాదం?:- కవిమిత్ర, సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి