సునంద భాష్యం:- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయాలు-911
మౌనం పండిత లక్షణమ్ న్యాయము
*****
మౌనం అనగా నిశ్శబ్దం, మాటలు లేని స్థితి, నిశ్శబ్దంగా ఉండటం, మాటలాడక పోవడం, వాక్కును నియంత్రించడం.పండితుడు అనగా చదువరి, ధీమంతుడు, పఠి,ప్రజ్ఞానుడు, ప్రజ్ఞావంతుడు. లక్షణమ్ అనగా పద్దతి,రీతి,మంచి చెడుల భావన అనే అర్థాలు ఉన్నాయి.
ఊరకుండటమే పండితుని లక్షణము.మౌనం ప్రజ్ఞస్య భూషణం అని కూడా అంటారు. అనగా మౌనం అనేది ఒక ఉన్నత విద్యావంతునికి ఆభరణం లాంటిది అనే అర్థంతో మన పెద్దలు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 మౌనాన్ని అత్యున్నత ధర్మంగా కూడా భావిస్తారు. మాట్లాడడానికి కుదరని చోట మౌనమే అత్యున్నత  అత్యున్నత ధర్మంగా నిలుస్తుంది.
 "చిత్త నిశ్చయ రూపాత్మా మౌన శబ్దేన స స్మృతః అనగా ఎవరి మనసు స్థిరంగా మరియు ప్రశాంతంగా ఉంటుందో అతను ఎల్లప్పుడూ మౌనంగా ఉంటాడు అని అర్థము.
 మౌనం వల్ల అత్యంత వివాదాస్పదమైన సంఘటనలు కూడా సద్దుమణుగుతాయి. మాటకు మాట తెగులు అంటారు కదా! మాటకు మాట తీవ్ర ప్రతి స్పందన లేనట్లయితే  అనగా ఎంత పెద్ద గొడవ అయినా ప్రతిపక్షం మౌనం వహిస్తే   గొడవ అంతటితో సమసిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే 'మౌనేన కలహం నాస్తి " అంటారు.
దీనినే మొత్తంగా  "కృషితో నాస్తి దుర్భిక్షం,జపతో నాస్తి పాతకమ్/ మౌనేన కలహం నాస్తి,నాస్తి జగరతో భయమ్. అంటారు"
అనగా కృషి చేసే వారికి కరువు వుండదు.  జపము చేసే వారికి కలహం ఉండదు. మౌనంగా ఉండేవారికి కలహాలు ఉండవు.జాగ్రత్తగా ఉండే వారికి భయం ఉండదు అని భావము.
 మౌనం అనగా మూగిమొద్దులా ఉండటం కాదు. ఏం జరుగుతున్నా పట్టించుకోక పోవడం అంతకన్నా కాదు. ఏదైనా ఉద్రిక్తత కలిగించే సంఘటనలు జరిగినప్పుడు  ఆవేదనతో పాటు ఆవేశం పెల్లుబుకుతుంది. అలాంటి సమయంలో వివేకాన్ని, విచక్షణను కోల్పోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు మౌనంగా ఉండటం వల్ల ఆవేశం తీవ్రత తగ్గుతుంది.  అప్పటి వరకు అరిచి గీ పెట్టిన ఎదుటి వ్యక్తే  ఏం చేయాలో తోచక ఆలోచనలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది.తత్ఫలితంగా  సమస్య తీవ్రత తగ్గుతుంది. మానవ సంబంధాలు మెరుగు పడటానికి దారులు సుగమం అవుతాయి. అందుకే మౌనం పండితుల లక్షణం అని అంటారు. పండితులు తమ సమయాన్ని శుష్క సంభాషణలతో వృధా చేసుకోరు. అనవసరంగా భావోద్వేగాలకు లోను కారు.
 మౌనంగా ఉండే పండితుని హృదయం ఎల్లప్పుడూ విశాలంగా ఉంటుంది. అంతః ప్రపంచం పెరుగుతుంది. తాను చేయబోయే ప్రతి పని,తీసుకునే ప్రతి నిర్ణయము ఎంతో వివేచన, విజ్ఞతతో కూడి ఉంటుంది.
  మౌనం విలువ, గొప్పతనం పండితులకు, మహనీయులకు బాగా తెలుసు. కాబట్టే  వారు తరచూ మౌనాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. గాంధీజీ వారానికి ఒక రోజు మౌనాన్ని వ్రతంగా చేసే వారు. "వేల మాటల్తో మెప్పించలేని విషయాన్ని  ఒక్క చూపుతో చెప్పవచ్చు. అలాగే వేయి చూపులతో చెప్పలేని భావాన్ని ఒక్క మౌనంతో చెప్పవచ్చని ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు గారైన రవి శంకర్ గారు అంటుంటారు.
అలాగే మెహర్ బాబా ఏమంటారంటే మాట మౌనం దాల్చినప్పుడు మనసు మాట్లాడుతుంది.అలాగే మనసు మౌనంగా ఉన్నప్పుడు  హృదయం మాట్లాడుతుంది.హృదయం మౌన ముద్రలో ఉన్నప్పుడు అంతరాత్మ అనుభూతి చెందుతుందని చెప్పారు. 
ఇక గురుదేవులైన రమణ మహర్షి పదాల ప్రతి బంధకాలు లేకుండా నిశ్శబ్దంగా సంభాషించడమే మౌనం అంటారు.
 ఇలా ఏ పండితుడైనా, పామరుడైనా  ఎవరైనా సరే సరే మౌనాన్ని  నిధిగా భావించి అవసరం మేరకు ఉపయోగించుకుంటే ఈ లోకంలో తగాదాలు, కలహాలు ఉండవు. అంతటా శాంతి పావురాలు సంతోషంగా చరిస్తాయి.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం