సంపూర్ణ మహాభారతము సరళ వ్యావహారిక భాషలో...!

 16 వ రోజు: - శర్మిష్ఠ దేవయానీ
ఒక రోజు రాక్షసరాజ పుత్రి శర్మిష్ట గురు పుత్రి దేవయాని వేయి మంది చెలికత్తెలతో వన విహారానికి వెళ్ళారు. అక్కడ కొలను తీరంలో వారు దుస్తులు విడిచి స్నానం చేస్తున్న తరుణంలో గాలికి బట్టలన్నీ కలసి పోయాయి. బయటకు వచ్చిన దేవయాని దుస్తులు శర్మిష్ట వేసుకుంది. కానీ దేవయాని తాను బ్రాహ్మణ కన్యనని ఒకరు విడిచిన దుస్తులు వేయనని చెప్పింది. శర్మిష్ట కోపగించి నా తండ్రి దగ్గర సేవచేసే బ్రాహ్మణుని పుత్రికి నా దుస్తులు పనికి రాలేదా అని నిందించి ఆమెను ఒక పాడు బడ్డ బావిలో త్రోసి చెలికత్తెలతో వెళ్ళి పోయింది. ఆ సమయానికి అటుగా వచ్చిన యయాతి మహారాజు ఆమెను రక్షించి ఆమె వృత్తాంతం తెలుసుకుని తనరాజ్యానికి వెళ్ళాడు. ఆ తరువాత దేవయాని అక్కడకు వచ్చిన తన చెలికత్తెతో తాను తిరిగి వృషపర్వుని రాజ్యానికి రానని తన తండ్రికి చెప్పమని చెమ్మంది. శుకృడు దేవయానిని ఎంత అనునయించినా నిఫలం కావడంతో శుకృడు కూడా నగరాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. విషయం తెలిసి అక్కడకు వచ్చిన వృషపర్వుడు శుకృని దయలేకుండా తాము జీవించలేమని వారు ఏది కావాలన్నా ఇస్తానని వేడుకున్నాడు. శుకృని తరఫున దేవయాని శర్మిష్ట వేయి మంది చెలికత్తెలతో తనని సేవిస్తే తామిరువురు నగరంలో ఉంటామని చెప్పింది. వృషపర్వుడు అందుకు అంగీకరించాడు.
యయాతీ దేవయానుల వివాహం
దేవయాని తన చెలికత్తెలతో అదే వనవిహారానికి వెళ్ళి అక్కడ తిరిగి యయాతిని చూసింది. దేవయాని యాయాతితో తామిరువురికి ఒకసారి పాణి గ్రహణం జరిగింది కనుక తనను అతడు వివాహం చేసుకోవాలని కోరింది. యయాతి బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహమాడవచ్చు కాని క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహమాడటం ధర్మం కాదని చెప్పాడు. పట్టువదలని దేవయాని తన తండ్రిని రప్పించి తండ్రిచే అందుకు అంగీకారాన్ని పొంది యయాతిని వివాహమాడింది. యయాతి తన భార్యతోనూ ఆమె చెలికత్తెలతో తన రాజ్యానికి చేరుకోవడానికి ఆయత్తమైన సమయంలో శుకృడు శర్మిష్ట వృషపర్వుని కూతురని ఆమెను దూరంగా ఉంచమని ప్రత్యేకంగా చెప్పాడు.
యదువంశజులు
దేవయానీ యయాతికి యదువు, తుర్వసుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. శర్మిష్ట తన జీవితం వృధా అయినందుకు బాధ పడి ఒంటరిగా ఉన్న యయాతి మహారాజుని కలసి దేవయాని చెలికత్తె కనుక తాను కూడా భార్యతో సమానమని చెప్పి అతనిని ఒప్పించి అతని వలన దృహ్వుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు పుత్రులను పొందింది. మొదట దేవయానికి ఆ విషయం దాచి ఒక ముని వలన సంతానం కలిగిందని అబద్ధం చెప్పింది. కానీ శర్మిష్ట పుత్రులను అడిగి విషయం గ్రహించిన దేవయాని జరిగినది తన తండ్రికి చెప్పగా అతడు యయాతికి శాపం ఇచ్చాడు. శాపవశాన వచ్చిన ముసలితనాన్ని శర్మిష్ట కుమారుడైన పూరునికి ఇచ్చి అతడి యవ్వానాన్ని తాను గ్రహించి వేయి సంవత్సరముల తరువాత పూరునికి యవ్వనాన్ని తిరిగి ఇచ్చి కృతజ్ఞతగా అతనిని చక్రవర్తిని చేసాడు. యయాతి కోరికకను నిరాకరించిన అతని కుమారులు నలుగురికి శాపం ఇచ్చాడు. శాపకారణంగా యదు వంశస్థులు రాజ్యార్హత శాశ్వతంగా పోగొట్టుకున్నారు, తుర్వసులు కిరాతకులకు రాజులయ్యారు, ద్రూహ్యులు అతని వంశస్థులు జలమయ ప్రదేశాలకు రాజలయ్యారు, అనువు వంశజులు యవ్వనంలోనే మరణం పాలయ్యారు. శర్మిష్ట కుమారునికి రాజ్యం ఇవ్వనచ్చని ప్రజలకు నచ్చ చెప్పి యయాతి తపోవనానికి వెళ్ళి వేయి సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మ లోకానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని కల్పములు ఉండి ఇంద్ర లోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు యయాతిని పరీక్షించడానికి నీ తపస్సు చాలా గొప్పది కనుక స్వర్గ లోక భోగాలనుభవిస్తున్నావని అన్నాడు. అందుకు యయాతి కొంచం అతిశయించి దేవ, మానవ, మునిగణాలలో ఎవరూ తనకు మించిన తపస్సు చేయలేదని చెప్పగానే అతని పుణ్యం నశించింది. ఇంద్రుడు యయాతిని తిరిగి మానవ లోకానికి వెళ్ళమనగా యయాతి తాను తిరిగి మానవలోకానికి వెళ్ళలేనని నక్షత్ర లోకానికి వెళతానని ఇంద్రుని కోరాడు. ఇంద్రుని అనుమతితో నక్షత్రలోకం చేరిన యయాతి అక్కడ అతడు తన దహోత్రులను చూసి వారికి తన వృత్తాంతం త్తెలిపాడు. వారు యయాతిని అడిగి అనేక ధర్మ సూత్రాలు పిండోత్పత్తి రహస్యాలు తెలుసుకున్నారు. యయాతి సాహచర్యంతో పుణ్యం కలిగి అతని మనుమలు అష్టకుడు మొదలైన వారు తిరిగి యయాతితో పుణ్యలోకాలకు వెళ్ళారు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు