ఆది పర్వము- షష్టమాశ్వాసము
* 31వ రోజు*
ధర్మరాజ యౌవ రాజ్య పట్టాభిషేకం దుర్యోదనాదులకుట్ర
తరువాత దృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజుని చేసాడు. ధర్మరాజు నలుగురు తమ్ములు నాలుగు దిక్కులను జయించి రాజ్యాన్ని విస్తరించగా చక్రవర్తిలా ప్రకాశించ సాగాడు. భీమార్జున పరాక్రమం నకుల సహదేవుల శత్రు భయంకరం ప్రజల మెప్పు పొందాయి. ద్రోణుడు అర్జునిని పరాక్రమానికి మెచ్చి బ్రహ్మశిరం అనే అస్త్రాన్ని ఇచ్చాడు. ద్రోణుడు ఆ అస్త్ర మహిమను ఇస్తూ "అర్జునా నాకు అగ్నివృశుడు ఇచ్చిన ఈ అస్త్రం అమోఘ శక్తి కలది. ఇది లోకాలను మాడ్చి వేస్తుంది. దీనిని సామాన్య మానవుల మీద ప్రయోగించ రాదు. ఇప్పుడు నీవు నాకు మరొక గురు దక్షిణ ఇవ్వాలి ఏ కారణం చేతనయినా నీకు నువ్వుగా నాతో యుద్ధం చేయరాదు " అన్నాడు. ధర్మ రాజు వైభవం దుర్యోధనుడు సహింప లేక పొయ్యాడు. ఒక రోజు తండ్రి దగ్గరకు వెళ్ళి " తండ్రీ పాండవులు మహా వీరులు నీవు ధర్మరాజును రాజుని చేసావు. మంత్రులూ, సామంతులూ, ప్రజలు అతనిని గౌరవిస్తున్నారు. నీవు గుడ్డి వాడివి తాత భీష్ముని ప్రతిజ్ఞ వలన ధర్మరాజు మాత్రం తగిన రాజని ప్రజలు విశ్వసిస్తున్నారు. మమ్మల్ని ఎవరూ లక్ష్యపెట్టడం లేదు. నీవు మార్గాంతం ఆలోచించి వారిని కొంత కాలం ఇక్కడి నుండి పంపించి నట్లైతే ప్రజలు వారిని మరచి పోతారు కాబట్టి మాకు గౌరవం దక్కుతుంది " అన్నాడు. దృతరాష్ట్రుడు బదులుగా " నాయనా దుర్యోధనా నాకు అన్నీ తెలుసు. నేను అంధుడను కనుక రాజ్య కార్యాలను స్వయంగా నిర్వహించ లేను. పాండురాజు నాచే యజ్ఞ యాగాలు చేయించాడు. రాజులను జయించి రాజ్యాన్ని విస్తరించాడు. నన్ను భక్తితో సేవించాడు. కనుక నీకంటే పెద్దవాడైన ధర్మరాజుని యువరాజుని చేసాను ఇప్పుడు తొలగించ లేను " అన్నాడు. దుర్యోధనుడు " తండ్రీ రాజ్యాధికారం వారసత్వంగా లభించేది నీవు అంధుడవు కనుక నీ తమ్ముడు రాజ్యం చేసాడు. అతని మీద అభిమానం చూపిన ప్రజలు ధర్మరాజుని రాజుగా చూడాలని కోరుతున్నారు ఆపై అతని కుమారుడు ఆ పై వారి వంశం రాజులౌతారు. మేము వశ పారంపర్యముగా బానిసలుగా ఉండవలసినదేనా? ఈ రాజ్యం నీది నీ తరువాత మాకు చెందాలి ప్రజాభిమతం మార్చడానికి కొంతకాలం పాండవులను వారణావతం పంపుతాము. ప్రజలు కొంత మరచిన తరువాత వారు తిరిగి వస్తారు " అన్నాడు. దృతరాష్ట్రుడు " నాయనా నా అభిప్రాయం కూడా అదే కానీ ఇందుకు విదురుడు భీష్ముడు అంగీకరించరు " అన్నాడు. దుర్యోదనుడు మీరు చక్రవర్తి కాబట్టి అందరూ మీ ఆజ్ఞను పాటిస్తారు. భీష్ముడు సమభావం కలవాడు కనుక ఏమీ అనడు, అశ్వత్థామ నాతో ఉంటాడు కనుక అతని మీద ప్రేమతో ద్రోణుడు నన్ను విడువడు. బావ మీద ప్రేమతో మనల్నికృపుడు విడివడు. విదురుడు పాండవ పక్షపాతి అయినా ఒక్కడే ఏమి చేయడు. కనుక మీరు ఇందుకు సమ్మతించి తీరాలి " అని బలవంతం చేసాడు. గత్యంతరం లేక దృతరాష్ట్రుడు అందుకు అంగీకరించాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
* 31వ రోజు*
ధర్మరాజ యౌవ రాజ్య పట్టాభిషేకం దుర్యోదనాదులకుట్ర
తరువాత దృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజుని చేసాడు. ధర్మరాజు నలుగురు తమ్ములు నాలుగు దిక్కులను జయించి రాజ్యాన్ని విస్తరించగా చక్రవర్తిలా ప్రకాశించ సాగాడు. భీమార్జున పరాక్రమం నకుల సహదేవుల శత్రు భయంకరం ప్రజల మెప్పు పొందాయి. ద్రోణుడు అర్జునిని పరాక్రమానికి మెచ్చి బ్రహ్మశిరం అనే అస్త్రాన్ని ఇచ్చాడు. ద్రోణుడు ఆ అస్త్ర మహిమను ఇస్తూ "అర్జునా నాకు అగ్నివృశుడు ఇచ్చిన ఈ అస్త్రం అమోఘ శక్తి కలది. ఇది లోకాలను మాడ్చి వేస్తుంది. దీనిని సామాన్య మానవుల మీద ప్రయోగించ రాదు. ఇప్పుడు నీవు నాకు మరొక గురు దక్షిణ ఇవ్వాలి ఏ కారణం చేతనయినా నీకు నువ్వుగా నాతో యుద్ధం చేయరాదు " అన్నాడు. ధర్మ రాజు వైభవం దుర్యోధనుడు సహింప లేక పొయ్యాడు. ఒక రోజు తండ్రి దగ్గరకు వెళ్ళి " తండ్రీ పాండవులు మహా వీరులు నీవు ధర్మరాజును రాజుని చేసావు. మంత్రులూ, సామంతులూ, ప్రజలు అతనిని గౌరవిస్తున్నారు. నీవు గుడ్డి వాడివి తాత భీష్ముని ప్రతిజ్ఞ వలన ధర్మరాజు మాత్రం తగిన రాజని ప్రజలు విశ్వసిస్తున్నారు. మమ్మల్ని ఎవరూ లక్ష్యపెట్టడం లేదు. నీవు మార్గాంతం ఆలోచించి వారిని కొంత కాలం ఇక్కడి నుండి పంపించి నట్లైతే ప్రజలు వారిని మరచి పోతారు కాబట్టి మాకు గౌరవం దక్కుతుంది " అన్నాడు. దృతరాష్ట్రుడు బదులుగా " నాయనా దుర్యోధనా నాకు అన్నీ తెలుసు. నేను అంధుడను కనుక రాజ్య కార్యాలను స్వయంగా నిర్వహించ లేను. పాండురాజు నాచే యజ్ఞ యాగాలు చేయించాడు. రాజులను జయించి రాజ్యాన్ని విస్తరించాడు. నన్ను భక్తితో సేవించాడు. కనుక నీకంటే పెద్దవాడైన ధర్మరాజుని యువరాజుని చేసాను ఇప్పుడు తొలగించ లేను " అన్నాడు. దుర్యోధనుడు " తండ్రీ రాజ్యాధికారం వారసత్వంగా లభించేది నీవు అంధుడవు కనుక నీ తమ్ముడు రాజ్యం చేసాడు. అతని మీద అభిమానం చూపిన ప్రజలు ధర్మరాజుని రాజుగా చూడాలని కోరుతున్నారు ఆపై అతని కుమారుడు ఆ పై వారి వంశం రాజులౌతారు. మేము వశ పారంపర్యముగా బానిసలుగా ఉండవలసినదేనా? ఈ రాజ్యం నీది నీ తరువాత మాకు చెందాలి ప్రజాభిమతం మార్చడానికి కొంతకాలం పాండవులను వారణావతం పంపుతాము. ప్రజలు కొంత మరచిన తరువాత వారు తిరిగి వస్తారు " అన్నాడు. దృతరాష్ట్రుడు " నాయనా నా అభిప్రాయం కూడా అదే కానీ ఇందుకు విదురుడు భీష్ముడు అంగీకరించరు " అన్నాడు. దుర్యోదనుడు మీరు చక్రవర్తి కాబట్టి అందరూ మీ ఆజ్ఞను పాటిస్తారు. భీష్ముడు సమభావం కలవాడు కనుక ఏమీ అనడు, అశ్వత్థామ నాతో ఉంటాడు కనుక అతని మీద ప్రేమతో ద్రోణుడు నన్ను విడువడు. బావ మీద ప్రేమతో మనల్నికృపుడు విడివడు. విదురుడు పాండవ పక్షపాతి అయినా ఒక్కడే ఏమి చేయడు. కనుక మీరు ఇందుకు సమ్మతించి తీరాలి " అని బలవంతం చేసాడు. గత్యంతరం లేక దృతరాష్ట్రుడు అందుకు అంగీకరించాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి